Publish Date:May 12, 2024
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు కూడా ఈ విషయంలో ఎలర్ట్ చేశారు. ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి, వాళ్ళకి డబ్బు ఇచ్చి, వారి వేళ్ళ మీద ఇంకు గుర్తు వేసి, వాళ్ళు ఓటింగ్కి వెళ్ళకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని హెచ్చరించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలతోపాటు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ తరహా కుట్ర జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ ఇష్యూ మీద రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముకేష్ కుమార్ మీనా స్పందించారు. ఇతర సిరా ద్వారా ఓటర్ల వేళ్ళ మీద గుర్తు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేళ్ళ మీద వేసే సిరా ప్రభుత్వమే తయారు చేస్తుందని, ఆ ఇంక్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దనే అందుబాటులో వుంటుందని ఆయన తెలిపారు. ఇతరుల దగ్గర చెరగని సిరా వుండదని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఎవరైనా ఓటర్ల వేళ్ళ మీద ఇతర సిరాలతో గుర్తు వేస్తే, దానిని చట్టవ్యతిరేక చర్యగా భావించి కఠన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-ceo-mk-meena-on-ink-mark-39-175704.html
ఏపీ ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చారు. ఓట్ల రూపంలో.. నువ్వు ప్రతిపక్షం హోదాకు కూడా పనికిరావంటూ పాతాళానికి తొక్కేశారు. ఐదేళ్లు పాలించమని అధికారమిచ్చిన ప్రజలనే చిత్రహింసలకు గురిచేసిన జగన్ మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం చెప్పారు.
జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు. ఆయన కాకపోతే ఈయన, ఈయన కాకపోతే ఆయన రెండ్రోజులకోసారి వంతుల వారీగా ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ వుండేవారు.
పెమ్మసాని చంద్రశేఖర్.. రెండేళ్ల కిందటి వరకూ ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఆయన పేరు మార్మోగిపోతోంది.
మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించేశారు. కాపులకు అన్యాయం చేశారంటూ జనసేనాని పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించి, పవన్ ఓటమి ఖాయం అంటూ వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలూ చేసిన ఆయన ఇప్పుడు ఒఖ్కసారిగా యూటర్న్ తీసుకున్నారు.
డబ్బూ, అధికారం ఇవి రెండు ఒకటే. ఇవి ఉన్నప్పుడు బంధాలు గుర్తొస్తాయి. మనుషులుగా కనబడతారు.
ఏపీలో వైసీపీని 11 స్థానాలకే పరిమితం చేస్తూ... టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సునామీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమికి 164 అసెంబ్లీ స్థానాలు రాగా, అందులో టీడీపీ వాటానే 135 స్థానాలు.
ఆటల్లో ఎవరు గెలుస్తారు అనే కాకుండా.. ఎన్నికల్లోనూ ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై బెట్టింగ్ వేయడం ఈమధ్య బాగా ట్రెండ్ అయింది.
జవహర్ రెడ్డి చిరునవ్వులు చిందిస్తూ పుష్పగుచ్ఛం ఇస్తే, దాన్ని సీరియస్గా అందుకున్న చంద్రబాబు, సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్కి ఎవర్నడిగి లీవ్ ఇచ్చావని జవహర్రెడ్డిని ప్రశ్నించారని, ఆయన నీళ్ళు నమిలారని సమాచారం.
రెండు పర్యాయాలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కేంద్రంలో సుస్థిరం చేసి హ్యాట్రిక్ కొట్టిన ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పదవికి రాజీనామా చేశారు. మళ్ళీ ఎనిమిదో తేదీన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటి వరకు అయితే మళ్ళీ మోడీ అనే అంటున్నారు. అయితే, ఈలోపు ఏమైనా జరగొచ్చు.
ఫోన్ ట్యాపింగ్ కారణంగానే బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఫలితాల్లో సున్నాకు పడిపోయింది. బిఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం చేసిన ఫోన్ ట్యాపింగ్ ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో అద్భుత విజయంతో జనసేనకు గాజుగ్లాసు గుర్తు పర్మనెంటుగా దక్కింది. ఏదైనా ఒక పార్టీకి ఒక గుర్తును శాశ్వతంగా కేటాయించాలంటే ఈసీ నిబంధనల మేరకు ఆ పార్టీకి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో కనీసం 6శాతం ఓట్లు రావాలి.
పాలన అంటే బటన్ నొక్కి సంక్షేమం పంచడమే.. అభివృద్ధి, సంపద సృష్టి, ఉపాధి కల్పన ఏవీ అక్కర్లేదు అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాలన జరిగింది. విధ్వంసంతో ఆరంభమై విధ్వంసంతోనే ఐదేళ్లు కొనసాగిన జగన్ పాలనపై జనంలో పెల్లుబికిన ఆగ్రహ ప్రతిఫలమే ఈ ఫలితం అనడంలో సందేహం లేదు.
పదేళ్ల క్రితం విడిపోయిన ఆంధ్ర ప్రదేశ్ కు ఇంత వరకు పర్మినెంట్ రాజధాని నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. అమరావతి రాజధాని కల సాకారం కానుంది. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఊపిరి పీల్చుకునే రోజులు వచ్చాయి. ఐదేళ్లుగా రాజధాని నినాదాలతో హోరెత్తిన
అమరావతి ప్రాంతమంతా చల్లబడనుంది..అక్కడి దీక్షా శిబిరాలను ఎత్తివేస్తున్నట్లు దీక్షా శిబిరాల నిర్వాహకులు తెలిపారు