Publish Date:Oct 16, 2019
అమరావతి నిర్మాణంలో మళ్లీ కదలిక ప్రారంభమైంది. ప్రాథమిక చర్చలు ముగిశాయి. కాసేపట్లో జరిగే మంత్రి వర్గ సమావేశంలో లాంఛనంగా ఆమోదం పొందిన తర్వాత నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభించాలని కాంట్రాక్టు సంస్థలకు వర్తమానం పంపారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. అప్పటి వరకూ రాజధానిలో నిర్మాణాల కోసం కాంట్రాక్టు సంస్థలు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ముప్పై ఐదు వేల మంది కార్మికులు వెనుదిరిగి వెళ్లిపోయారు.
నివాస భవనాలు, సెక్రెటరీ టవర్లు, హైకోర్టు నిర్మాణం, మంత్రుల నివాసాలు నిర్మాణ దశలో ఉన్నాయి. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ విచారణకు ఆదేశించింది, ప్రస్తుతం ఈ విచారణ జరుగుతోంది. నివేదిక అందిన తర్వాత అక్రమాలు ఉన్నాయో లేవో తేలుతోంది. అయితే ఇటీవల ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిలో పర్యటించారు. అనేక నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన పర్యటన అనంతరం ప్రభుత్వంలో కదలిక ప్రారంభమైంది. రెండ్రోజుల క్రితం మంత్రి బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ అధికారులతో సమావేశమయ్యారు. మొత్తం పదమూడు పనులను నవంబర్ ఒకటవ తేదీ నుంచి పున ప్రారంభించాల్సిందిగా మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు.
ఈ పనులన్నీ ఇప్పటికే డెబ్బై శాతం పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవోలూ, గెజిటెడ్ అధికారులు, సచివాలయ ఉద్యోగుల అపార్ట్మెంట్ నిర్మాణాలను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన మూడు వందల యాభై కోట్ల రూపాయలను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. పనుల పున: ప్రారంభానికి లిఖిత పూర్వకంగా లేఖలు పంపాలని కూడా నిర్ణయించారు. గతంలో రద్దు చేద్దామనుకున్న హై కోర్టు, సచివాలయ టవర్లు, మంత్రి నివాస భవనాలు, సీఎం నివాసాలను హొల్డ్ లో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఎందుకంటే ఇప్పటికే ఈ భవనాల నిర్మాణం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పూర్తయింది. వీటిని రద్దు చేయటం మంచిది కాదని ఇంజనీరింగ్ నిపుణులు సూచించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెక్రటేరియట్, హెచ్ఓడి టవర్లు అంతస్తులు కుదించి పదిహేను లేదా ఇరవై అంతస్తులతో నిర్మిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంతోంది. అయితే వ్యయం తగ్గదని భవిష్యత్తులో నిర్మాణాలు చేపట్టడం కూడా ఇబ్బంది అవుతుందని నిపుణులు సూచించినట్టు తెలుస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-capital-amaravati-works-to-re-start-from-nov-1st-25-90127.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.