ప్రతిపక్షం లేని అసెంబ్లీ అదిరిందిగా...

Publish Date:Nov 11, 2017

Advertisement

 

ఉప్పు లేని కూర ఎలా ఉంటుంది. చప్పగా... రుచిలేకుండా అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా ఉంటుంది. మరి దీనిలాగే ఉంటుంది.. ప్రతిపక్షం లేని అసెంబ్లీ కూడా. అలా ప్రతిపక్షం లేకుండానే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిజానికి అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే అదొక కళ. అధికారపక్షాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చించాలి. సమస్యలకు పరిష్కారమయ్యేలా అవసరమైతే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలి. అధికారపక్షానికి మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వకుండా, అసలు సభ జరిగేందుకు వీలుగా లేకుండా చేయాలి. ఇదీ అసెంబ్లీలో ప్రతిపక్షం చేయాల్సిన పని. కానీ ఏపీ అసెంబ్లీలో సీన్ రివర్స్ లో ఉంది. ఏంటో చెరువు మీద నక్క అలిగినట్టు... ప్రతిపక్షం అయిన జగన్ అండ్ కో బ్యాచ్ అసెంబ్లీ మీద అలిగి సమావేశాలకు డుమ్మా కొట్టారు. పాపం నష్టం వారికే అని తెలియట్లేదు. పైకి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటేనే అసెంబ్లీ సమావేశాలకు వస్తామని ఏదో కుంటిసాకు చెబుతున్నారు కానీ... పాదయాత్ర చేసుకోవడానికి అది జగన్ వేసిన ప్లాన్ అని అందరికీ తెలుసనుకోండి.

 

అయితే విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా బాగానే ఉంటుందేమే అనిపిస్తుంది ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తుంటే. ఎందుకంటే... ఇంతకుముందు ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా.. వైసీపీ నేతలు చేసే గోలకి అసలు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా.. అంతా గందరగోళంగా ఉండేది. గత అసెంబ్లీ సమావేశాలు అయితే అసలు ఎందుకు జరిగాయో కూడా తెలియదు. ఆ సమావేశాల వల్ల ఒక్క శాతం ఉపయోగం లేకుండా పోయింది. కానీ ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కాస్త భిన్నంగా ఉండబోతున్నాయి అని అర్ధమయింది. తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో ప్రశాంతంగా జరిగాయి. పట్టిసీమపైనా, నదుల అనుసంధానంపైనా చర్చలు జరగగా... ప్రతిపక్షం లేకపోవడంతో ఎక్కడా అసెంబ్లీకి ఆటంకం కలగలేదు.  ప్రభుత్వం చెప్పాలనుకున్నది చెప్పింది. దాంతో ఆ సమాచారమంతా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చేరింది. దీంతో గడచిన మూడేళ్ళతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ సమావేశాలే ఆసక్తికరంగా సాగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.

 

ఇక ప్రతిపక్షం లేకపోవడం చంద్రబాబుకు కలిసొచ్చింది. తాము చేసిన అభివృద్ధిని గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మంచి అవకాశం దొరికింది. దీంతో ఆయన ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం దక్కింది. అలాగే ప్రస్తుతం ఉన్న సమస్యలపై ప్రశ్నించే అవకాశాన్ని ప్రతిపక్షం కోల్పోయింది. మరి ప్రతిపక్షం ఇప్పటికైనా కళ్లు తెరిచి తాము చేసిన తప్పేంటో తెలుసుకొని అసెంబ్లీకి వస్తే బావుంటుంది. అలా కాని పక్షంలో తమ తప్పుకు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.

By
en-us Political News

  
గతంలో అంటే జగన్ హయాంలో అభివృద్ధి అంటే సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు అన్న పరిస్థితి నుంచి ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన, రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులతో నిజమైన అభివృద్ధి జనం కళ్లకు కనిపించేలా చేస్తోంది.
ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గం కేంద్రంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఉదహరిస్తూ.. జగన్ బోత్సనుపక్కన పెట్టడానికి అనారోగ్యం ఒక్కటే కారణం కాదని విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు ఇటీవల ఒక సందర్భంలో వైసీపీలో కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత తగ్గుతోందంటూ చేసిన వ్యాఖ్యలను చూపుతున్నారు. ఇక బొత్స స్థానంలో మండలిలో విపక్ష నేత పదవిని ఒక మహిళా నేతకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో జగన్ ఉన్నట్లు వైసీపీ వర్గాలలో టాక్ నడుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమై అధికారానికి దూరమవ్వడమే కాకుండా, కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని సంగతి తెలిసిందే. అంతటి ఘోర పరాభవం ఎదురైనా జగన్ తీరులో మార్పు రాలేదన్న అసంతృప్తి వైసీపీ నేతలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ప్రకృతి గర్భంలో దాగి ఉన్న కొన్ని రహస్యాలు సైన్స్‌కు కూడా సవాల్ విసురుతుంటాయి.
భవిష్యత్ లో జగన్.. సపోజ్ ఫర్ సపోజ్ అధికారంలోకి వస్తే.. అమరావతిలో ప్రస్తుత ప్రభుత్వం నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలు లేవని విశ్లేషిస్తున్నారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలుపుతూ ఈ సరికొత్త రాజధాని నమూనాను ఆయన తొలిసారి ప్రస్తావించినప్పుడు.. అన్ని వర్గాల నుంచీ తీవ్ర వ్యతిరేకత రావడమే కాకుండా, నెటిజనులు జనగ్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. అయినా తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్నట్లుగా జగన్ మావిగన్ ను వదల లేదు.
పెద్దిరెడ్డి కి వ్యతిరేకంగా చెవిరెడ్డి పావులు కదుపుతున్నట్లు వైసీపీలోనే ప్రచారం నడుస్తోంది. కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించడానికి అప్పట్లో పెద్దిరెడ్డి చేయని ప్రయత్నం లేదు. జగన్ ఫుల్ సపోర్ట్ ఆయనకి ఉండటంతో అప్పట్లో జిల్లా నేతల్లో ఎవరూ అయన్నివ్యతిరేకించే సాహసం చేయలేకపోయారు.
తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ కేబినెట్ ప్రక్షాళనలో డీకే అరుణకు మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని కిషన్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వైసీపీ తరపున గవర్నర్ కోటాలో నామినేట్ అయిన జకియా ఖానం, పందుల రవీంద్రబాబుల పదవీ కాలం నెల రోజుల్లో ముగియనుంది. దీనితో ఖాళీ అవుతున్న ఆ రెండు ఎమ్మెల్సీ స్థానాలను తెలుగుదేశం కూటమి దక్కించుకోనుంది.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఎన్నో ఆలయాలు నిధులు లేక, ధూపదీప నైవేద్యాలు కరవై శిథిలావస్థకు చేరుకుంటుంటే.. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఆలయాలకు శ్రీవాణి నిధులు కేటాయించడమేంటన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో కొండగట్టు వంటి తెలంగాణ ఆలయాలకు టిటిడి నిధులు ఇవ్వడంపై అక్కడి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ఆలయాల అభివృద్ధికి ఏపీ నిధులు ఎందుకు కేటాయించాలంటూ సోషల్ మీడియాలో విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తెలుగుదేశం కూటమి భాగస్వామ్య పక్షమైన జనసేన రాష్ట్రంలో మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రణాళికా బద్ధంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే గత ఎన్నికలలో ఘోర పరాజయంతో కుదేలై ఉన్న వైసీపీని మరింత బలహీన పరిచే దిశగా వ్యూహాలు రచిస్తోంది.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా తీసుకుంటున్న రాజకీయ నిర్ణయాలు పార్టీ శ్రేణులతో పాటు.. ఆయన పార్టీకే చెందిన సొంత సామాజిక వర్గ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాలు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.