రాజధాని అక్కడే నిర్మించనున్నారా?

Publish Date:Jul 15, 2014

Advertisement

 

రాష్ట్ర రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యనే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలా మంది మంత్రులు ప్రకటించారు. కానీ ఆ తరువాత ఏమయిందో తెలియదు కానీ ఈ విషయంపై చంద్రబాబుతో సహా అందరూ మౌనం పాటించడం మొదలుపెట్టారు.

 

రాజధాని ఎంపిక కోసం వేసిన శివరామ కృష్ణన్ కమిటీ సభ్యులు చంద్రబాబును కలిసిన తరువాత నుండే ఈ మార్పు వచ్చింది. అంటే కమిటీ సభ్యులు అక్కడ రాజధాని నిర్మాణం వల్ల ఏమయినా పెద్ద ఇబ్బందులు వస్తాయని చెప్పారా? లేక ఇంతకంటే మంచి ప్రాంతం ఆయనకు సూచించారా? లేక ప్రస్తుతం కృష్ణా జలాల కోసం పడుతున్న తిప్పలు చూసి, అక్కడ రాజధాని నిర్మిస్తే రాజధానికి అవసరమయిన 12 టీ.యం.సి.ల నీళ్ళు లభ్యమవ్వవనే ఆలోచనతో వెనకడుగు వేస్తున్నారా? లేక కేంద్రం నిధులు మంజూరు చేయకుండా పనులు మొదలు పెట్టడం మంచిది కాదని ఆగుతున్నారా? ఆ కారణంగా ఆలస్యమవుతుంటే విజయవాడ-గుంటూరు మధ్య భూముల ధరలకు రెక్కలు వస్తున్నందున వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నారా? లేక ఇతరత్రా వేరే ఏవయినా కారణాలు ఉన్నాయా? అనే సంగతి ఎవరికీ తెలియక పోవడంతో ప్రజలలో ముఖ్యంగా విజయవాడ-గుంటూరు ప్రాంతాల ప్రజలలో రాజధాని విషయంపై చాల గందరగోళం నెలకొని ఉంది. ఇటీవల విజయవాడలో ఏపీయన్జీవోలు నిర్వహించిన సన్మాన సభలో పాల్గొన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తప్ప అక్కడే రాజధాని నిర్మిస్తానని ఇదివరకులా ఖచ్చితమయిన హామీ ఇవ్వకపోవడం గమనార్హం.

 

అయితే ఈ నిశబ్దాన్ని బ్రద్దలు చేస్తూ రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు చూచాయగా తెలిపారు. విజయవాడ-గుంటూరు-మంగళగిరి-తెనాలి ప్రాంతాల చుట్టూ దాదాపు 180కిలోమీటర్ల పరిధిలో ఒక అవుటర్ రింగు రోడ్డు నిర్మాణం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. సింగపూర్ మోడల్ రాజధాని నిర్మాణానికయితే దాదాపు రూ.1.5 లక్షల కోట్లు, సాధారణ రాజధాని నిర్మాణానికయితే రూ.90 వేల కోట్లు అవసరమవుతాయని తాము అంచనా వేసినట్లు తెలిపారు. రాగల వంద సం.లలో రాజధాని ప్రాంతంలో పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకొని రాజధానిని నిర్మించాలనుకొంటున్నామని, అందుకు లోతుగా అధ్యయనం చేయవలసి ఉన్నందున ఒక బృందాన్ని త్వరలోనే సింగపూరు పంపబోతున్నట్లు తెలిపారు. రాజధాని నిర్మించే ప్రాంతం, దాని పరిధి, దాని రూపురేఖలు, అందుకు అయ్యే ఖర్చు వగైరా వివరాలన్నీ తెలియడానికి కనీసం మరో ఆరు నెలలు పట్టవచ్చని ఆయన తెలిపారు. అంటే మరో ఆరునెలల వరకు రాజధాని నిర్మాణం పనులు మొదలుకాక పోవచ్చని సూచన ప్రాయంగా చెప్పినట్లే భావించవచ్చును.

 

రాజధాని నిర్మాణం కోసం రూ.90 నుండి రూ.1.50 లక్షల కోట్లు అవసరమని ప్రాధమికంగా అంచనా వేసారు గనుక అందులో ఐదో లేక పదో వంతయినా సొమ్ము కేంద్రం విడుదల చేయనిదే పనులు మొదలుపెట్టడం మంచిదికాదనే ఉద్దేశ్యంతోనే ఆలస్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఏమయినప్పటికీ ఇందులో రాష్ట్రప్రభుత్వం తప్పు, జాప్యం లేదు గనుక, ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ఒక స్పష్టమయిన ప్రకటన చేస్తే బాగుంటుంది.

By
en-us Political News

  
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.