కేసీఆర్ తో సఖ్యత కోసం తెలంగాణా-తెదేపా నష్టపోనవసరం లేదు

Publish Date:Nov 22, 2015

Advertisement

 

అమరావతి శంఖుస్థాపన కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల మధ్య కొంత సయోధ్య ఏర్పడింది. ఇటువంటి సానుకూల వాతావరణం వలన రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణలు కూడా తగ్గుతాయి కనుక రెండు ప్రభుత్వాలు పరిపాలన, రాష్ట్రాభివృద్ధిపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతాయి. ఈ సహృద్భావ వాతావరణం చెదిరిపోకుండా ఉండేందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదని భావించవచ్చును. అందుకు ఇతరత్రా అనేక కారణాలు కూడా ఉండి ఉండవచ్చును కానీ ప్రధాన కారణం మాత్రమే ఇదేనని భావించవచ్చును.

 

ఇదే కారణంగా ఇక ముందు కూడా ఆయన తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చేయి. ఒకవేళ ఆ వార్తలు నిజమనుకొంటే చంద్రబాబు నాయుడు తీసుకొన్న ఆ నిర్ణయం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సయోధ్య పెరగవచ్చును కానీ తెలంగాణాలో తెదేపా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

 

గత పన్నెండేళ్లుగా తెలంగాణా తెదేపా నేతలు ప్రతిపక్ష బెంచీలలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇంకా మరో మూడున్నరేళ్ళు వెళ్లదీయవలసి ఉంది. కనీసం వచ్చే ఎన్నికలలో అయినా విజయం సాధించి అధికారంలోకి రావాలంటే ఇప్పటి వరకు వారు ప్రజా సమస్యలపై ఏవిధంగా తెరాస ప్రభుత్వంతో గట్టిగా పోరాడుతున్నారో అదేవిధంగా ఇక ముందు కూడా పోరాడవలసి ఉంటుంది. అప్పుడే వారి ఉనికిని చాటుకోగలుతారు, వచ్చే ఎన్నికలలో ప్రజలను ఓట్లు అడుగగలుగుతారు. కానీ ఇరువురు ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల మధ్య ఏర్పడిన సహృద్భావ వాతావరణం అలాగే నిలిపి ఉంచేందుకు తెరాస ప్రభుత్వంపట్ల తెలంగాణా తెదేపా నేతలు మెతకవైఖరి అవలంభించినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి గొప్ప వరంగా మారుతుంది.

 

ఇంతవరకు తెలంగాణాలో తెదేపా కూడా ఒక బలమయిన రాజకీయ శక్తిగా గుర్తింపు కలిగి ఉంది. కానీ ఇప్పుడది వెనక్కి తగ్గినట్లయితే దాని స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆక్రమిస్తుంది. తెరాస ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడగల ఏకైక పార్టీగా, తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా అవతరిస్తుంది. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడలేకపోతే చివరికి నష్టపోయేది సదరు పార్టీ నేతలే తప్ప ప్రజలు కాదు. తెలంగాణాలో వైకాపా పరిస్థితిని చూసినట్లయితే ఆ విషయం అర్ధం అవుతుంది.

 

రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య నిలిపి ఉంచుతూనే, తెలంగాణాలో తెదేపా లాభపడే మార్గం ఒకటుంది. తెరాస ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేని పరిస్థితిలో ఉండి నష్టపోవడం కంటే, తెరాస-తెదేపా-బీజేపీలు చేతులు కలిపినట్లయితే తెలంగాణాలో తిరుగులేని మహాశక్తిగా అవతరించవచ్చును. అంతే కాదు దాని వలన తెలంగాణాలో తెదేపా, బీజేపీ నేతలకు అధికారం అవకాశం దక్కవచ్చును. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి కేంద్రప్రభుత్వ సహాయసహకారాలు పుష్కలంగా లభిస్తాయి. కాంగ్రెస్ నేతలు జోస్యం నిజం చేస్తూ తెరాస కూడా ఎన్డీయే కూటమిలో చేరి కవితమ్మ కలలు సాకారం చేసుకోవచ్చును. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య ఇంకా సహృద్భావం పెరిగి, విభజన సమస్యలన్నీ సమసిపోవచును. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ పోటాపోటీగా అభివృద్ధి సాధించవచ్చును.

 

ఈవిధంగా చేయగలిగినట్లయితే తెలంగాణాలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ఒంటరి అయిపోతాయి. బహుశః అప్పుడు ఆ రెండు పార్టీలు చేతులు కలుపవచ్చును కానీ దాని వలన బలీయమయిన శక్తిగా అవతరించే తెరాస, తెదేపా, బీజేపీలపై ఎటువంటి ప్రభావం ఉండబోదు. చంద్రబాబు నాయుడు తెలంగాణా రాజకీయాలకు దూరంగా ఉండి తన పార్టీని నష్టపరుచుకోవడం కంటే, ఎలాగు కేసీఆర్ తో సఖ్యత కోరుకొంటున్నారు కనుక తెరాసతో చేతులు కలిపి తన పార్టీని కాపాడుకొంటూనే తన తెలంగాణా నేతల రాజకీయ భవిష్యత్ కి కూడా భరోసా కల్పించినట్లయితే వారు సంతోషిస్తారు. పైగా దానివలన ఇన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి కదా.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.