Publish Date:Aug 30, 2022
శివుడాజ్ణ లేకుండా చీమ కుట్టదంటారు. అలా కుడితే కుట్టీ కట్టంగానే చస్తుందని కూడా చెబుతారు. కానీ ఎల్లో క్రేజీ యాంట్స్ మాత్రం శివుడాజ్ణ తీసుకుని మరీ దండెత్తుతున్నాయా అన్న రేంజ్ లో భయందోళనలకు కారణమౌతున్నాయి. తమిళనాడులోని కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని ఓ ఏడు గ్రామాలను చీమలు హడలెత్తిస్తున్నాయి.
ఈ చీమలను ఎల్లో క్రేజీ యాంట్స్ అంటారు. ఇవి అటవీ ప్రాంత సమీపగ్రామాలను బెంబేలెత్తించడమే కాదు.. ఆ గ్రామాల ప్రజల జీవనోపాధిపైనా దాడి చేస్తున్నాయి. ఈ గ్రామాల ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం, పశువుల పెంపకం. అయితే చీమల దాడి ఆ జీవనోపాధినే దెబ్బతీసేంత తీవ్రంగా ఉంది. మనుషులను అవి కుట్టవు కానీ పాకితే చాలు ఒంటిపై పొక్కులు వస్తున్నాయి. చీమలు దండుగా వస్తుండటంతో తాగునీటికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
వీటి కారణంగా చాలా మంది ఊళ్లు వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెడుతున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి.సమస్యలు ఇక్కడితో తీరడం లేదు. చీమల వల్ల కుందేళ్ల సంతతి గణనీయంగా తగ్గిపోయింది. ఈ చీమలు కుట్టకపోయినా అవి విడుదల చేసే ఒక రకమైన రసాయనం (యాసిడ్) వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పశువులకు ప్రాణహాని కలుగుతోంది. అవి విడుదల చేసే యాసిడ్ కారణంగా చర్మం పొట్టురాలిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ చీమల బెడదను అరికట్టేందుకు కీటక సైంటిస్టులు, అటవీశాఖ అధికారులు ప్రయత్నాలను ప్రారంభించారు. గతంలో ఆస్ట్రేలియాలోని ఒక ఐలెండ్ లో ఎర్రచీమల బెడద తీవ్రమైన సందర్భంగా హెలికాప్టర్ ద్వారా మందులను పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. ఇప్పుడు ఆ దిశగా అధికారులు ప్రయత్నాలు చేయనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ants-killing-live-stock-in-tamilnadu-25-142911.html
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.
జగన్ ప్రసంగాలు, మీడియా సమావేశాలు... ట్రోలింగ్కు, మీమ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారుతున్నాయి. నెటిజనులు, తెలుగుదేశం, జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు జగన్ ప్రెస్ మీట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారంటే ఇసుమంతైనా అతిశయోక్తి కాని పరిస్థితి ఉంది.
గతంలో ప్రభుత్వ పనుల కాంట్రాక్టులు దక్కించుకోవాలంటే కేవలం రాజకీయ పలుకుబడి, కమిషన్లు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకునేవనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ విధానాన్ని మార్చి విజయ్ ఇప్పుడు ప్రతిభ, పారదర్శకత ఆధారంగానే టెండర్లు లభించే కొత్త విధానాన్ని తీసుకువచ్చారు.
ఇటువంటి ఉత్కంఠభరిత రాజకీయ వాతావరణంలో.. ఇద్దరు బద్ద రాజకీయ ప్రత్యర్థులు అకస్మాత్తుగా ఒ ముఖాముఖి ఎదురైతే.. అసలా ఊహే ఎవరికీ రాదు అన్నట్లుగా ప్రస్తుతం ఏపీ రాజకీయ పరిస్థితి ఉంది. కానీ అనూహ్యంగా రఘురామకృష్ఫం రాజు, అంబటి రాంబాబు ఓ వివాహ వేడుకలో ఎదురు పడ్డారు.
రాజధాని వంటి అత్యంత కీలకమైన, సున్నితమైన విషయంలో జగన్ పదే పదే తన స్టాండ్ మార్చుకోవడం పరిశీలకులను సైతం విస్మయానికి గురి చేస్తున్నది. స్థిరత్వం లేని జగన్ తీరు వెనుక ఎవరి సలహాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
పాత చరితను పునరావృతం చేస్తున్న డిప్యూటీ స్పీకర్!