ఆయన నోట మళ్లీ ఢిల్లీ మాట! లైట్ తీసుకుంటున్న పార్టీలు

Publish Date:Nov 19, 2020

Advertisement

​దేశంలో గుణాత్మక మార్పు రావాలి.. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందే.. ఆ పార్టీల వల్లే దేశం ఆగమైంది.. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేస్తా.. ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత కేసీఆర్ గత రెండేండ్లుగా చెబుతున్న మాటలు. ఎన్నికల సమయాల్లోనూ, తనకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినపుడే, బీజేపీ, కాంగ్రెస్ లపై ఈ తరహా కామెంట్లు చేస్తూ వచ్చారు కేసీఆర్. ఇంకా చేస్తూనే ఉన్నారు. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేళ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు గులాబీ బాస్. బీజేపీని టార్గెట్ చేస్తూ జాతీయ రాజకీయాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త పోరాటానికి టీఆర్ఎస్ సన్నద్ధమవుతోందని తెలిపారు. చాలా మంది ప్రాంతీయ నేతలతో మాట్లాడానని చెప్పారు కేసీఆర్. 

 

జాతీయ రాజకీయాలపై కేసీఆర్ చేసిన తాజా ప్రకటనపై జనాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రెండేండ్ల నుంచి చెబుతున్న మాటలే మళ్లీ చెప్పారనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలవగానే జాతీయ పార్టీలపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు కేసీఆర్. బీజేపీ, కాంగ్రెస్ వల్లే దేశం అభివృద్దికి నోచుకోలేదని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు దేశానికి అరిష్టమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాదు త్వరలోనే ఢిల్లీ వెళ్తునున్నానని కూడా చెప్పారు గులాబీ బాస్. భువనేశ్వర్ వెళ్లి ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడారు. చెన్నె వెళ్లి స్టాలిన్ తో సమావేశమయ్యారు. కోల్ కతా వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్డీతోనూ మంత్రాగం చేశారు. లక్నో వెళ్లి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతిని కలిశారు. దీంతో ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ సీరియస్ గా వర్కవుట్ చేస్తున్నారనే అభిప్రాయం వచ్చింది. 

 

తర్వాత ఏమైందో ఏమోకాని తుస్సుమనిపించారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ మాట కూడా మర్చిపోయారు. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఢిల్లీ వెళ్లింది లేదు.. ఫెడరల్ ఫ్రంట్ వచ్చింది లేదు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రావడంతో ఢిల్లీకి వెళ్లినా చేసేది ఏమి లేదని భావించిన కేసీఆర్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకపోతే.. ప్రాంతీయ పార్టీలతో కలిసి హడావుడి చేయాలని చూశారని, మోడీ ప్రభంజనం వీచడంతో కేసీఆర్ ఆశలు ఆవిరయ్యాయనే ప్రచారం జరిగింది. కేసీఆర్ ఫెడరల్ ప్రంట్ ఏర్పాట్లకు సంబందించి మరో ప్రచారం కూడా జరిగింది. ఎన్డీఏ నుంచి బయటికొచ్చిన టీడీపీ అధినేత,అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ప్రచారం చేశారు. బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ , కోల్ కతాల్లో మమతా బెనర్జీలు నిరసనకు దిగితే అక్కడికి వెళ్లి వారికి మద్దతు తెలిపారు. చంద్రబాబు దూకుడుతో లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయనే చక్రం తిప్పబోతున్నారనే ప్రచారం జరిగింది. చంద్రబాబుకు జాతీయ స్థాయిలో వస్తున్న క్రేజీని జీర్ణించుకోలేకే.. ఆయనకు పోటీగా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తెరపైకి తెచ్చారని కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

 

గత ఆగస్టులో మరోసారి జాతీయ రాజకీయాల ప్రస్తావన తెచ్చారు కేసీఆర్. మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఉద్యమానికి ప్లాన్ చేస్తున్నానని చెప్పారు. హైదరాబాద్ లోనే విపక్ష పార్టీలతో సమావేశం పెట్టబోతున్నానని, అన్ని ప్రాంతీయ పార్టీ నేతలను ఆహ్వానిస్తానని చెప్పారు. అప్పుడు కూడా కేసీఆర్ ఢిల్లీకి  వెళ్తారేమోనని జనాలు భావించారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ఢిల్లీకి వెళ్లేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారనే చర్చ కూడా జోరుగా జరిగింది. కాని అప్పుడు కూడా కేసీఆర్ మాటలు గాలి మాటలుగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ లో సమావేశం జరగలేదు.. ఏ పార్టీ నేత వచ్చి కేసీఆర్ ను కలవలేదు. టీఆర్ఎస్ అధినేత కూడా ఏ లీడర్ తోనూ మాట్లాడలేదు. కనీసం ఫోన్ లో కూడా కేసీఆర్ ఏ ప్రాంతీయ పార్టీ నేతతోనూ మాట్లాడినట్లు కనిపించ లేదు. జీఎస్టీ బకాయిలను కేంద్రం విడుదల చేయడం లేదంటూ లేఖలు రాసి సెప్టెంబర్ లో మరోసారి హడావుడి చేశారు కేసీఆర్. కేంద్రం తీరుకు నిరసనగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ఆర్థికమంత్రులతో సమావేశం పెడతామని కూడా ప్రకటించారు. కాని అది కూడా జరగలేదు. 

 

తాజాగా పార్టీ నేతలతో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల సన్నద్దత సమావేశంలో జాతీయ రాజకీయాలపై మాట్లాడారు కేటీఆర్. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేదని, తప్పుడు ప్రచారాలతో, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని కేసీఆర్‌ విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్‌ దొందూ దొందేనని, బడేభాయ్‌ వెంట చోటే భాయ్‌ అన్నట్లు దేశాన్ని సరైన దిశ చూపెట్టడంలో విఫలం అయ్యాయన్నారు. ఆ రెండు మూస పార్టీల నుంచి దేశానికి విముక్తి కావాలని, అందుకు  హైదరాబాద్‌ నుంచే యుద్ధం ప్రకటిస్తామన్నారు. దేశంలోని ఇతర ప్రతిపక్షాలన్నింటినీ ఒక్క తాటిపై నిలిపేందుకు  ప్రయత్నాలు చేస్తున్నామని  చెప్పారు. ఇప్పటికే పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం విజయన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే నేత స్టాలిన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్‌ యాదవ్‌, శరద్‌పవార్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌, కుమారస్వామి, సీపీఐ, సీపీఎం నాయకులతో మాట్లాడానని తెలిపారు. డిసెంబరు రెండోవారంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి దేశవ్యాప్త ఉద్యమం గురించి చర్చిస్తామన్నారు కేసీఆర్. 

 

కేసీఆర్ తాజా ప్రకటనకు ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ బీజేపీ తమకు గట్టి పోటీ ఇస్తుండటంతో కారణమనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ బలమైన శక్తిగా ఎదగడంతో.. ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గెలిచేందుకు ఇలా ఎత్తులు వేస్తున్నారని, గ్రేటర్ ఎన్నికలు ముగియగానే జాతీయ రాజకీయాలపై మళ్లీ కేసీఆర్ మాట్లాడరని చెబుతున్నారు. ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఎప్పుడో ఆ పని చేసేవారంటున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై ఉద్యమం చేస్తానంటున్న కేసీఆర్.. ఆ బిల్లులు పార్లమెంట్ ముందుకు వచ్చిన సమయంలో ఆ పని ఎందుకు చేయలేదనే ప్రశ్న ప్రజల నుంచి వస్తోంది. కేంద్రం తీసుకువచ్చిన మెజార్టీ బిల్లులకు మద్దతు ఇచ్చిన టీఆర్ఎస్.. ఇప్పుడు కేంద్రం ఏం చేయడం లేదని విమర్సిండంలో అర్ధం లేదంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేస్తున్న ప్రటనకను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.