అమరావతి ప్రగతి పరుగులో మరో మైలురాయి.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి  అభివృద్ధి బాటలో మరో కీలక ముందడుగు పడింది.   రాజధాని  అమరావతి పరిధిలో , విద్య, పర్యాటక రంగాల బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీఏ  నగరంలో కొత్తగా ఐదు ప్రతిష్టాత్మక పాఠశాలలు, అలాగే ఐదు   స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి కలిగిన  సంస్థల నుండి  ఆర్‌ఎఫ్‌పీ  ఆహ్వానిస్తూ  టెండర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాజధాని నగరంలో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడటంతో పాటు స్థానికులకు, పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వసతులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ టెండర్ల ప్రక్రియలో భాగంగా విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు. దీనితో పాటు రాజధానికి వచ్చే సందర్శకులు, వ్యాపారవేత్తలు, పర్యాటకుల సౌకర్యార్థం ఐదు  స్టార్  హోటళ్లను కూడా నిర్మించనున్నారు. ఈ హోటళ్లలో మూడు హోటళ్లు 'త్రీ స్టార్' సదుపాయాలతో,  మిగిలిన రెండు హోటళ్లు ఫోర్ స్టార్ సదుపాయాలతో పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకు సంబంధించిన భూ కేటాయింపులు, ఇతర సాంకేతిక ప్రక్రియలను సీఆర్డీఏ వేగవంతం చేస్తోంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి వైపు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చెందిన అనేక ప్రముఖ విద్యా సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు పలు సంస్థలు ముందుకు రాగా, వాటికి అనుగుణంగా సీఆర్డీఏ ఇప్పటికే పలు ప్రాంతాల్లో స్థలాలను కూడా కేటాయించింది. గతంలో స్థలాలు పొందిన వాటిలో పొదార్ ఇంటర్నేషనల్ స్కూల్, సెంట్రల్ చిన్మయ మిషన్ ట్రస్ట్ స్కూల్, సెయింట్ గాబ్రియేల్ ఎడ్యుకేషనల్ సొసైటీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు సెయింట్ మేరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ , కేంద్రీయ విద్యాలయం, బాసిల్ వుడ్స్ స్కూల్,  డీపీఎస్ స్కూల్ వంటి ప్రసిద్ధ విద్యా సంస్థలు కూడా రాజధాని పరిధిలో తమ ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతున్నాయి.

అమరావతి కేవలం ప్రాథమిక, సెకండరీ విద్యకే   కాకుండా,  ఉన్నత విద్యా హబ్‌గా కూడా అవతరిస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఎస్‌ఆర్‌ఎం, విట్, అమృత యూనివర్సిటీలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్  వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తమ విద్యా కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ క్యాంపస్‌లలో  35 వేల మందికి పైగా విద్యార్థులు వివిధ రకాల విద్యా కోర్సులను అభ్యసిస్తున్నారు. ఈ ఉన్నత విద్యా సంస్థల విస్తరణ కోసం ప్రభుత్వం ఇటీవల ఎస్‌ఆర్‌ఎం, విట్ సంస్థలకు అదనంగా మరో 100 ఎకరాల చొప్పున భూమిని కేటాయించింది. ఈ అదనపు స్థలాల్లో  క వైద్య కళాశాలలు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి ఆయా యాజమాన్యాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.

మరోవైపు, బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్)కు కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ప్రభుత్వం   70 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికి సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తవగా, త్వరలోనే పూర్తి స్థాయి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ, ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐయూఎల్ఈఆర్), ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన సంస్థలకు కూడా సీఆర్డీఏ స్థలాలను  కేటాయించింది. విద్యా రంగంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపించేందుకు, రాజధాని నగరానికి ఆతిథ్య రంగంలో మేటి గుర్తింపు తెచ్చేందుకు గతంలో కొన్ని హోటళ్లకు స్థలాలు ఇవ్వగా, ఇప్పుడు అదనంగా మరో ఐదు హోటళ్లకు  టెండర్ల ప్రక్రియను ప్రారంభించడం విశేషం.

ఈ   నిర్మాణాల వల్ల అమరావతి కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా, పారిశ్రామిక, విద్యా  పర్యాటక రంగాల సమ్మేళనంగా రూపాంతరం చెందనుంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ స్థాయి పాఠశాలలు, హోటళ్లు అందుబాటులోకి రావడం వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, రాజధాని ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

CRDA,  Amaravati Tenders, Schools, Hotels

By
en-us Political News

  
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.