నెల్లూరులో మరో అంబులెన్స్ మాఫియా.. జగన్ సర్కార్ ఏం చేస్తోంది?

Publish Date:May 5, 2022

Advertisement

జగన్ పాలనలో ఏపీలో మానవీయతకు నూకలు చెల్లినట్లు కనిపిస్తున్నది. అత్యాచారాలు, హత్యాచారాలు అడ్డూ అదుపూ లేకుండా జరుగుతున్నా..వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా అంబులెన్స్ మాఫియా ఆగడాలు వెలుగులోకి వస్తున్నా..వాటిని అరికట్టేందుకు ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలూ కనిపించడం లేదు. తాజాగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అంబులెన్స్ మాఫియా ఆగడం వెలుగు చూసింది. రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది తిరస్కరించడంతో.. గత్యంతరం లేక తన కుమార్తె మృతదేహాన్ని తండ్రి బైక్ పై తీసుకువెళ్లిన హృదయవిదారక సంఘటన నాయుడుపేటలో జరిగింది.

ప్రమాద వశాత్తు క్వారీ గుంటలో పడిపోయిన చిన్నారిని వెలికితీసి ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే మరణించిందని  వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆ చిన్నారి మృతదేహాన్నిఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు అంబులెన్స్ సిబ్బంది నిరాకరించారు. నిబంధనలు ఒప్పుకోవంటూ మొండికేశారు. ప్రైవేటు అంబులెన్సు కిరాయికి తీసుకునే ఆర్థిక స్థోమత లేని తండ్రి తన బైక్ పైనే తన కుమార్తె మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. 
 
గత నెల 26న తిరుపతి రుయా ఆసుపత్రిలో కూడా ఇటువంటి సంఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనలో కుమారుడి మృతదేహాన్ని 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి తరలించేందుకు రుయా ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు రూ. వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని తండ్రి ఉచిత అంబులెన్స్ ను తెచ్చుకున్నా.. రుయా ఆసుపత్రి అంబులెన్స్ డ్రైవర్లు పడనివ్వలేదు. దీంతో చేసేది లేక ఆ తండ్రి తన కుమారుడి మృత దేహాన్ని బైక్ పై 90 కిలోమీటర్లు తన స్వగ్రామానికి తీసుకు వెళ్లారు. అలాగే ఈ నెల 1న మంచిర్యాలలో ఇటువంటి సంఘటనే జరిగింది.  వలస కూలీ మృతదేహాన్ని తరలించేందుకు మంచిర్యాలలో అంబులెన్స్ డ్రైవర్లు ఏకంగా 80 వేల రూపాయలు డిమాండ్ చేశారు. యూపీకి చెందిన వలస కూలీ వడదెబ్బతో మరణిస్తే.. అతడి మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించి కుటుంబ సభ్యులకు కడసారి చూపు దక్కేలా చేద్దామని భావించిన అతడి బంధువులకు అంబులెన్స్ డ్రైవర్ల దురాశ శరాఘాతమైంది. అంత సొమ్ము ఇచ్చుకోలేక మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.  
కనీస మానవత్వం లేకుండా సొమ్ముకోసం గద్దల్లా పీడిస్తూ అంబులెన్స్ మాఫియా పెట్రేగిపోతుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏం చేస్తున్నదని జనం ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో దుష్ట చతుష్టయం నుంచి రాష్ట్రాన్ని కాపాడ మని ముఖ్యమంత్రి ఏడు కొండల స్వామిని వేడుకున్నారు. జనం మాత్రం ఈ పని చేయని ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడు తండ్రీ అని మొక్కుకుంటున్నామని చెబుతున్నారు. 

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.