ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ
Publish Date:Jul 6, 2025
Advertisement
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ మొత్తం కేంద్ర స్థాయిలోని. అత్యున్నత దర్యాప్తు సంస్థలు, నిఘవర్గాల కనుసన్నుల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.ఈ విచారణలో రాష్ట్రస్థాయిలోని దర్యాప్తు నిఘ వర్గాల సైతం పాల్గొంటున్నట్టు సమాచారం. అత్యంత చాకచక్యంగా ఉగ్రవాదులను తమిళనాడు ఐబి, అన్నమయ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల నుంచి బాంబులు,పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అంతటితో ఆగకుండా... మూడు దశాబ్దాలకు పైగా. రాయచోటిలో మకాం వేసిన ఉగ్రవాదుల గత చరిత్ర మొత్తం తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. రాయచోటీలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించింది ఎవరు. వాళ్లతో అతిస న్నితంగా మెలిగింది ఎవరు. ఉగ్రవాదులు ఇద్దరికీ. ఈ ప్రాంతంలో పెళ్లి చేసింది ఎవరు. అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారంలో సాగుతోంది. ప్రస్తుతం పోలీసు విచారిస్తున్న వారిలో కొందరు. గతంలో రాయచోటిలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని. వేర్వేరు ప్రదేశాలలో ఉంచి పోలీసులు విచారిస్తున్నారని సమాచారం. వారి భంధాలపై పోలీసులు అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ మొత్తం అతని బంధాల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అబూబకర్ అరెస్టు తర్వాత అతని ఇంట్లో పోలీసులు జరిపిన సో దాలలో భారీ సంఖ్యలో బాంబు తయారీ పదార్థాలు దొరికడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన. అబూబకర్ బాంబులు తయారీలో నిష్ణాతుడు.. 1995లో తన నేర చరిత్రను మొదలుపెట్టిన అబుబకర్ దక్షిణాది రాష్ట్రాలలో పలుచోట్ల బాంబు పేలుళ్ల నేరాలు పాల్పడ్డాడు. అక్కడ కొన్ని కేసులలో పోలీసులు చిక్కినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి రాయచోటి చేరిపోయాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. గత 30 సంవత్సరాల లో రాయచోటిలో మూడు ప్రాంతాలలో అతను నివాసం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇంటి ఓనర్లను,అతనికి ఇల్లు ఇప్పించిన వాళ్లను విచారిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2021లో అతనికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసిన వా రిని విచారిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మొహమ్మద్ అలీ కి ఇక్కడ ఇల్లు ఇప్పించిన వాళ్లను,పెళ్లి చేసిన వాళ్లను కూడా పోలీసులు వి చారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌన్ లో ఎక్కడ చూసినా ఈ విషయాలపైనే చర్చ నడుస్తోంది. *రాయచోటి కే పరిమితమా! రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ ,మహమ్మద్ అలీ రాయచోటికే పరిమితం అయ్యారా?ఇక్కడ నుంచే కార్యకలాపాలు నిర్వహించారా! లేక ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని మరే ప్రాంతాల్లో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా వీరు రహస్యంగా ఉన్నారంటే వీరి కార్యకలాపాలకు ఎవరైనా సహకారం అందించి ఉంటారేమో అన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా, ఎవరైనా సహకారం అందిచారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు ,జిల్లా పోలీసు బృందాలు లోతుగా విచారిస్తుండడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఎలాంటి సమాచారం బయటికి వస్తుందో నన్ను ఆందోళన వ్యక్తం అవుతోంది.
http://www.teluguone.com/news/content/annamaya-district-25-201406.html





