ఉగ్ర బంధాలపై గురి...రాయచోటి ఘటనపై లోతుగా విచారణ

Publish Date:Jul 6, 2025

Advertisement

 

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలకలం రేపిన ఉగ్ర భంధాలపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.  రాయచోటిలో దొరి కిన ఉగ్రవాదులతో సన్నిహితంగా మె లిగిన వాళ్లకు సహకరించిన వాళ్లను పోలీసులు గత రెండు మూడు రోజులుగా రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఈ విచారణ మొత్తం కేంద్ర స్థాయిలోని.  అత్యున్నత దర్యాప్తు సంస్థలు, నిఘవర్గాల కనుసన్నుల్లో జరుగుతున్నట్టు  తెలుస్తోంది.ఈ విచారణలో రాష్ట్రస్థాయిలోని దర్యాప్తు నిఘ వర్గాల సైతం పాల్గొంటున్నట్టు సమాచారం.  అత్యంత చాకచక్యంగా ఉగ్రవాదులను తమిళనాడు ఐబి, అన్నమయ్య పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఉగ్రవాదుల నుంచి బాంబులు,పెద్ద ఎత్తున బాంబు తయారీ పదార్థాలను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదుల భార్యలను సైతం అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. 

అంతటితో ఆగకుండా... మూడు దశాబ్దాలకు పైగా. రాయచోటిలో మకాం వేసిన ఉగ్రవాదుల గత చరిత్ర మొత్తం తవ్వే పనిలో పోలీసులు పడ్డారు. రాయచోటీలో ఉగ్రవాదులకు ఆవాసం కల్పించింది ఎవరు. వాళ్లతో అతిస న్నితంగా మెలిగింది ఎవరు. ఉగ్రవాదులు ఇద్దరికీ. ఈ ప్రాంతంలో పెళ్లి చేసింది ఎవరు. అనే కోణంలో దర్యాప్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పట్టణంలోని పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారంలో సాగుతోంది. ప్రస్తుతం పోలీసు విచారిస్తున్న వారిలో  కొందరు. గతంలో రాయచోటిలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనలు కీలకంగా వ్యవహరించినట్లు ప్రచారంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వారిని. వేర్వేరు ప్రదేశాలలో  ఉంచి పోలీసులు విచారిస్తున్నారని సమాచారం.

వారి భంధాలపై 

 పోలీసులు అబూబకర్, మహమ్మద్ అలీ అనే ఉగ్రవాదులను  అదుపులోకి తీసుకున్నప్పటికీ ప్రస్తుతం విచారణ మొత్తం అతని బంధాల చుట్టే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అబూబకర్ అరెస్టు తర్వాత అతని ఇంట్లో పోలీసులు జరిపిన సో దాలలో  భారీ సంఖ్యలో బాంబు తయారీ పదార్థాలు దొరికడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిన. అబూబకర్ బాంబులు తయారీలో నిష్ణాతుడు.. 1995లో తన నేర చరిత్రను మొదలుపెట్టిన అబుబకర్ దక్షిణాది రాష్ట్రాలలో పలుచోట్ల బాంబు పేలుళ్ల నేరాలు పాల్పడ్డాడు. 

అక్కడ కొన్ని కేసులలో  పోలీసులు చిక్కినప్పటికీ బెయిల్ మీద బయటకు వచ్చి రాయచోటి చేరిపోయాడు. ఇక్కడే స్థిరపడ్డాడు. గత 30 సంవత్సరాల లో రాయచోటిలో మూడు ప్రాంతాలలో అతను నివాసం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఇంటి ఓనర్లను,అతనికి ఇల్లు ఇప్పించిన వాళ్లను విచారిస్తున్నట్టు ప్రచారంలో ఉంది.2021లో  అతనికి పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేసిన వా రిని విచారిస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా మొహమ్మద్ అలీ కి ఇక్కడ ఇల్లు ఇప్పించిన వాళ్లను,పెళ్లి చేసిన వాళ్లను కూడా పోలీసులు వి చారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టౌన్ లో ఎక్కడ చూసినా ఈ విషయాలపైనే చర్చ నడుస్తోంది.

*రాయచోటి కే పరిమితమా!

రాయచోటిలో పట్టుబడ్డ ఉగ్రవాదులు అబూబకర్ ,మహమ్మద్ అలీ రాయచోటికే పరిమితం అయ్యారా?ఇక్కడ నుంచే  కార్యకలాపాలు నిర్వహించారా! లేక ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లోని  మరే ప్రాంతాల్లో అయినా వీరికి సంబంధాలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 30 ఏళ్లుగా రాయచోటి కేంద్రంగా వీరు రహస్యంగా ఉన్నారంటే వీరి కార్యకలాపాలకు ఎవరైనా సహకారం అందించి ఉంటారేమో అన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.ఉమ్మడి కడప జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా,  ఎవరైనా సహకారం అందిచారా  అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర దర్యాప్తు బృందాలు ,జిల్లా పోలీసు బృందాలు లోతుగా విచారిస్తుండడంతో తీగ లాగితే డొంక కదిలినట్టు ఎలాంటి  సమాచారం బయటికి వస్తుందో నన్ను ఆందోళన వ్యక్తం అవుతోంది.

By
en-us Political News

  
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
బొత్స పక్కా రాజకీయ వారసత్వం మీద దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా, వైసీపీ శాసన మండలి పక్షనేతగా వ్యవహరిస్తున్న బొత్స మారుతున్న రాజకీయ, పరిణామాల దృష్ట్యా ప్రత్యామ్నాయాలవైపు దృష్టి సారిస్తున్నార‌న్న ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.