జూబ్లీహిల్స్ బైపోల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపుతోంది. జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య భారీగా ఉండటంతో అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది తేల్చుకోలేక పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది. మీనాక్షి నటరాజన్ ను రంగంలోకి దింపి ఏకాభిప్రాయ సాధన కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ లో మాత్రం అధిష్ఠానం ప్రయత్నాలు అధిష్ఠానానివే.. అన్నట్లుగా ఉంది. ఆశావహులు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు.
ఇక పార్టీ టికెట్ ఆశిస్తున్న నేతలు టీకెట్ పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలో విభేదాలు కూడా జూబ్లీ బైపోల్ ముంగిట రచ్చకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీ సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ మంత్రి పొన్నం మీద ఫైర్ అయ్యారు. తన కుమారుడు ఎంపీగా ఉండటంపై కామెంట్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు అంజన్ కుమార్ యాదవ్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీ టికెట్ ఎవరికి ఇవ్వాలన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, దీనిపై మాట్లాడడానికి మధ్యలో పొన్నం ప్రభాకర్ ఎవరంటూ ఫైర్ అయ్యారు. పొన్నం ప్రభాకర్ కంటే తాను చాలా సీనియర్ ని అని అంటూ.. కాంగ్రెస్ లో ఒకే కుబుంబం నుంచి ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా చాలా మంది ఉన్నారంటూ ఓ పెద్ద లిస్టు చెప్పారు. ఉపముఖ్యమంత్రిగా మల్లు భట్టివిక్రమార్క ఉండగా, ఆయన అన్న మల్లు రవి ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు.
అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి, మంత్రి కొమటిరెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ల పేర్లు ప్రస్తావించారు. ఇలా ఒకే కుటుంబం నుంచి రెండు పదవులు ఉన్నవారు చాలా మంది ఉన్నారన్నారు. అటువంటప్పుడు తన కుమారుడు ఎంపీ అయితే జూబ్లీ బైపోల్ లో తనకు ఎమ్మెల్యే టికెట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలూ ఉన్నాయన్న అంజన్ కుమార్ యాదవ్ పార్టీ అధిష్ఠానం తనకే టికెట్ ఇస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఆ ధీమాతోనే ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని ప్రారంభించేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున కటౌట్ లు ఏర్పాటు చేశారు. ఇంటింటి ప్రచారాన్ని కూడా షురూ చేసేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/anjankumar-express-confidene-og-getting-congress-ticket-in-jublee-bypoll-fires-25-207352.html
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.