నెల్లూరు నుండి అనిల్ ఔట్? తర్వాత ఏంటి సామీ..!

Publish Date:May 6, 2022

Advertisement

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా వదిలి పక్క జిల్లాకు పోతున్నారట..! లేదుర సామి.. ఈ సారి అసలు టిక్కెట్టే లేదంట కదా...?! టిక్కెట్టు ఇచ్చినా గెలిసేది ఏడరయ్యా..?! ఇది నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా మాజీ మంత్రి అనిల్ పై వైసీపీ నేతలే చేస్తున్న తాజా కామెంట్స్...! సామాన్యుడికి ఉన్నత పదవి వస్తే.. అంతకన్నా ఉన్నతంగా.. హుందాగా వ్యవహరించాలి. అప్పుడే అందరి మన్ననలూ పొందుతారు. కానీ.. అనిల్ కుమార్ నోటి దురుసే.. ఆయనను రాజకీయంగా సమాధి చేసేట్లు కనిపిస్తోందని చెబుతున్నారు నెల్లూరు జిల్లా వాసులు.

నిన్నటి దాకా తల ఎగరేసి మరీ హద్దూ.. అదుపూ లేకుండా మాట్లాడిన అనిల్ ఇప్పుడు వైసీపీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి తెచ్చుకున్నారంటున్నారు. నాదే నెల్లూరు అని విర్రవీగిన అనిల్ ఇప్పుడు ఎక్కడి నుండి పోటీచేయాలో దారి తెలియక దిక్కులు చూస్తున్నారట. తాజా పరిణామాలు వైసీపీర్టీలో అనిల్ ను ఒంటరిని చేశాయనే చెప్పాలి. దీంతో నెల్లూరు టౌన్ లో ఆయన మళ్లీ గెలిచే అవకాశాలు తక్కువని అంటున్నారు. అసలు నెల్లూరు టౌన్ నుంచి అనిల్ కు టిక్కెట్ వస్తుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ దృష్టి శ్రీ బాలాజీ జిల్లాలోని వెంకటగిరి వైపు మళ్లిందని వైసీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అయినా అనిల్ అక్కడికి వెళితే గెలిచే ఛాన్స్ లేదురా నాయనా అనుకుంటున్నారు ఆ పార్టీ నేతలు.

ఇప్పటికే వెంకటగిరిలో కొమ్ములు తిరిగిన నేతలు ఖాళీగా ఉన్నారు. మాజీ సీఎం తనయుడు నేదురుమల్లి రాంకుమారెడ్డి.. వెంకటగిరి రాజాలు లాంటి ఉద్దండులు వెంకటగిరిలో ఉండగా..అనిల్ కు అక్కడ ఆదరణ లభించడం కష్టమనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలను పరుష పదాలతో దూషించడానికి కొంత సమయం.. నెల్లూరు జిల్లాలో సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టేందుకు మిగిలిన సమయం వృథా చేశాని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంత్రి పదవి పోయే నాటికి అనిల్ కొండంత చెడ్డ పేరు మూట కట్టుకున్నారంటున్నారు. ఈ క్రమంలో నెల్లూరు నగర ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు కూడా ఆయన దూరం అయ్యారనేది వాస్తవం అని చెబుతున్నారు.

నెల్లూరు నగరంలో ఆనం ఫ్యామిలీ అండతో కార్పొరేటర్ అయి.. వారి పుణ్యంతోనే అనిల్ ఎమ్మెల్యే టిక్కెట్టు సంపాదించుకున్నారు. అయితే వైసీపీ పంచన చేరిన తరువాత ఆనం ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో జిల్లా వాసులకు అనిల్ దూరం కాక తప్పలేదంటున్నారు మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు పెద్దారెడ్లకు కొద్దిగా కూడా అయినా మర్యాద ఇవ్వకుండా అనిల్ వ్యవహరించారట. దీన్ని మనసులో ఉంచుకున్న నెల్లూరు పెద్దారెడ్లు సమయం కోసం ఎదురు చూశారంటారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చింది. మంత్రి పదవి పోయాక ఆ పదవి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి దక్కడంతో నేతలంతా జోరీగలు తగులుకున్నట్టు అనిల్ ను తగులుకున్నారు.

తాజాగా.. నెల్లూరులో ఆనం ఫ్యామిలీ ఫ్లెక్సీలతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ఫ్లెక్సీలు కూడా చించేయడంతో అనిల్ ఖేల్ ఖతమైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అనిల్ కుమార్ కు మళ్లీ నెల్లూరు నగరం నుంచి పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే.. రెడ్లు వైఎస్సార్సీపీకి దూరం అవుతారని జగన్ చెవిలో వేశారట వేమిరెడ్డి. అంతేకాదు అనిల్ ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించేలా ఉందని చెప్పారట.  దీంతో ఈ సారి అనిల్ కు టికెట్ ఇవ్వకుండా పక్కన పెడదామని జగన్ చెప్పడంతో వేమిరెడ్డి, నెల్లూరు నేతలు శాంతించినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆనం రామనారాయణరెడ్డి వెంకటగిరిలో పోటీచేసే అవకాశాలు చాలా తక్కువ. అక్కడ యాదవ సామాజికవర్గం ఓట్లు ఉండడంతో అక్కడికి వెళ్ళేందుకు అనిల్ ప్రయత్నాలు సాగించారు. ఇది తెలిసిన వెంకటగిరి నేతలు స్థానికేతరుడైన అనిల్ తమ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరికలు చేశారని సమాచారం. దీంతో అనిల్ పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటి..? పార్టీలో ఉంటారా..? లేదంటే అనిల్ నే పార్టీ పూర్తిగా పక్కన పెట్టేస్తుందా..? అని టాక్ జిల్లాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఎనభై సంవత్సరాలుగా రాజకీయంగా చక్రం తిప్పిన ఆనం ఫ్యామిలీ నెల్లూరు పంటరెడ్ల జోలికి వెళ్ల లేదు. అలాంటిది కన్నూ మిన్నూ తెలియకుండా ఆనం వారితో పాటు నెల్లూరు పంటరెడ్లను అవమానకరంగా చూసిన అనిల్ కు భవిష్యత్తు ప్రశ్నార్థకం కావచ్చని అనుకుంటున్నారు. జగన్ అండ, మంత్రి పదవి శాశ్వతం అనుకున్న అనిల్ ఇప్పుడు ఒంటరైపోయి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో..! ముందు ముందు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో చూడాలి.. జగన్ ఫ్యాన్ గాలిలో గెలిచిన నేతలు సొంత గాలి ఉండేలా పనిచేయకపోతే.. ప్రతిసారీ.. గాలి ఉండదు కదబ్బా అంటున్నారు కొందరు.

By
en-us Political News

  
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం 3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా నియమించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.