Publish Date:Jul 29, 2025
వైసీపీ హయాంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అప్పులకుప్పలా మారిన రాష్ట్రాన్ని అభివృద్ధి అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం (జులై 29) శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం కంభంపాడులో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం తమ చేతిలో అప్పుల పత్రాలు పెట్టి వెళ్లిందనీ, అటువంటి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. అంతకు ముందు కోటి తీర్థం గ్రామంలో ప్రముఖ శైవ క్షేత్రాన్ని దర్శించున్న ఆనం మూడు కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.. జల జీవన్ మిషన్ ద్వారా మంచి నీటి పథకాలకు శంకుస్థాపన, ప్రభుత్వ పాఠశాలల అదనపు తరగతి గదులు, పశువైద్యశాల ప్రారంభోత్సవం చేశారు. అలాగే సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం లో భాగంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించారు.
ఏడాది పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేసిందన్నారు. అటువంటి సుపరిపాలన అందిస్తున్న తెలుగుదేశం కూటమి ప్రభభుత్వానికి అండగా నిలవాలని ప్రజలను కోరారు. ఆ తరువాత తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో జరిగిన సభలో మంత్రి ఆనం ప్రసంగించారు. నియోజకవర్గంలో ప్రతి పనిని చేపడుతున్నామని ప్రజల అవసరాలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీరుస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhrapradesh-heading-in-developement-and-welfare-25-203003.html
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.