Publish Date:Oct 17, 2019
మేఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్దఎత్తున ఐటీ దాడులు జరగడం కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా వచ్చి నాలుగైదు రోజులపాటు మేఘా కార్యాలయాల్లోనూ, మేఘా ఫ్యామిలీ నివాసాల్లోనూ రోజుల తరబడి సోదాలు చేయడం సాదాసీదా విషయం కాదంటున్నారు. పైగా ఐటీ దాడుల సమయంలో కేంద్ర బలగాలను వినియోగించడం చూస్తుంటే మేఘా చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే చెప్పాలంటున్నారు. మేఘాలో ఐటీ దాడులు సాధారణంగా కనిపించడం లేదని, కనీసం హైదరాబాద్ లోని ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వకుండా... ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి తనిఖీలు చేయడమంటే ఎఫెక్ట్ భారీగా ఉండొచ్చని కార్పొరేట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఐటీ దాడుల్లో దొరికిన పత్రాలు, ఆధారాలపై అనేక రకాల వదంతులు బయటికొచ్చినా అధికారుల నుంచి మాత్రం అధికారిక సమాచారం రాలేదు.
అయితే, మేఘా కృష్ణారెడ్డికి... తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయనే ప్రచారం ఉంది. అందుకే, తెలుగు రాష్ట్రాల్లో మేఘా కంపెనీ చేపడుతోన్న ప్రాజెక్టులపైనా ఆ ప్రభావం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ లో సింగిల్ బిడ్డర్ గా నిలిచి మేఘా కంపెనీ పోలవరం కాంట్రాక్టును దక్కించుకోవడంతో... ఆ ప్రాజెక్టు భవిష్యత్ ఏంటనే చర్చ జరుగుతోంది. మేఘా కంపెనీపై కేవలం ఐటీ దాడులతోనే ఆగదని, ఈడీ కూడా దృష్టిపెట్టే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈడీ కూడా మేఘాపై దృష్టిపెడితే పోలవరం ప్రాజెక్టు పనులు చిక్కుల్లోనే పడినట్లేనన్న టాక్ వినిపిస్తుంది. జగన్ ప్రభుత్వం... నవంబర్ నుంచి పోలవరం పనులు చేపడతామని చెబుతున్న నేపథ్యంలో.... ఒకవైపు మేఘాపై ఐటీ దాడులు... మరోవైపు కోర్టు కేసులు... అడ్డంకిగా మారడం ఖాయమంటున్నారు. మొత్తానికి మేఘాపై ఐటీ దాడుల ఎఫెక్ట్... కచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పనులపై పడటం ఖాయమంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-polavaram-project-25-90168.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.