Publish Date:Oct 11, 2024
యథారాజా తథా ప్రజా అన్నట్టుగా పాలించేవాళ్ళు ఏది చేస్తే, పాలించబడేవాళ్ళు కూడా అదే చేస్తారు. ఈ పార్టీ... ఆ పార్టీ... ఈ రాష్ట్రం... ఆ రాష్ట్రం అని కాకుండా దేశంలో ప్రతి ఒక్క ప్రభుత్వమూ అప్పుల మీదే బండి లాగిస్తోంది. జానానికి ఉచితాలు అలవాటు చేసిన నాయకులు అప్పులు చేసి మరీ గొప్పలు చెప్పుకుంటున్నారు. దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టేస్తూ ఉచితాలు ఇవ్వడం తమ గొప్పతనంగానో, తన తాతలు సంపాదించిన ముల్లెని పంచుతున్నట్టుగానో బిల్డప్పు ఇచ్చుకుంటూ బతికేస్తున్నారు. ఈ జనం కూడా ప్రభుత్వం అప్పులు చేస్తోందో, అల్లాడి చస్తుందో మాకెందుకు... మా ఉచితాలు మాకు కావాలి అన్నట్టుగా వున్నారు. అందుకే దేశం అప్పుల కుప్పలా తయారైంది. దేశం సంగతి అలా వుంచితే, దేశ ప్రజలు కూడా అప్పులు చేయడంలో అభివృద్ధి పథంలో పయనిస్తున్నారు. అక్షరమాలలో అగ్రస్థానంలో వున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అప్పులు చేయడంలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో వున్నట్టు ఇటీవల కేంద్రం వెల్లడించిన నివేదిక చెబుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్దెనిమిదేళ్ళు దాటిన వారిలో ప్రతి లక్ష మందిలో సగటున 60,093 మంది అప్పులు చేయడం ద్వారానే జీవితాన్ని నెట్టుకొస్తున్నట్టు కేంద్రం ఇటీవల విడుదల చేసిన కాంప్రిహెన్సివ్ యాన్యువల్ మాడ్యులర్ సర్వే వెల్లడించింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం మంది అప్పుల అప్పారావులే అన్నమాట! సాధారణంగా పట్టణాలు అభివృద్ధి చెందాయి, గ్రామాలు అభివృద్ధి చెందలేదు అని అనుకుంటూ వుంటాం. కానీ, అప్పులు చేసే విషయంలో పట్టణాల్లో వుండే జనం కంటే గ్రామాల్లో వున్న జనమే ఫార్వర్డ్.గా వున్నారట. పట్టణ ప్రజలతో పోలిస్తే గ్రామీణ ప్రజలు 4.3 శాతం ముందున్నారట. అలాగే పట్టణాల్లో వుండే మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో వున్న మహిళలే ఎక్కువగా అప్పులు చేస్తున్నారట. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువ అప్పులు చేస్తున్నారట. అప్పులు చేసే విషయంలో అప్పుల అప్పారావుల కంటే అప్పుల అప్పలమ్మలదే అప్పర్ హ్యాండ్ అని అర్థమవుతోంది. ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, అప్పులు చేయడంలో తెలుగు మహిళలే దేశంలో అన్ని రాష్ట్రాల మహిళల కంటే ముందంజలో వున్నారట. ఇక ప్రభుత్వాలు చేసే అప్పుల విషయాన్ని మరోసారి ప్రస్తావించుకుంటే, ఉత్తరాది రాష్ట్రాల ప్రజల మీద కంటే, దక్షిణాది రాష్ట్రాల ప్రజల నెత్తినే ఎక్కువ అప్పుల భారం వుందట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-people-lones-25-186670.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.