ఏపీ అధికారులు కళ్ళు తెరవాలి!!

Publish Date:May 2, 2024

Advertisement

‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు. ఇంత చిన్న లాజికల్ పాయింట్ ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది అధికారులకు అర్థం కావడం లేదు. ఆ అధికారులలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతోపాటు పలువురు ద్వితీయ, తృతీయ స్థాయి అధికారులు కూడా వున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికారంలో వున్న వైసీపీ త్వరలో అధికారం కోల్పోబోతోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. కానీ, కొంతమంది అధికారులకు మాత్రం ఆ విషయం తెలియడం లేదు.. వైపీపీ శాశ్వతంగా అధికారంలో వుంటుందన్న భ్రమల్లో బతుకుతూ ఆ పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు.  ఐదేళ్ళుగా వైసీపీ సేవలో తరించిన అధికారగణం ఎలక్షన్ కోడ్ అమల్లో వున్న ప్రస్తుత తరుణంలో కూడా నిస్పక్షపాతంగా పనిచేయడానికి మనసు రాక జగన్ ప్రభుత్వం సేవలో పునీతమవుతున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే భయం ఎంతమాత్రం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలోని అధికారులను చూసి, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులను చూసి మారాల్సిన అవసరం వుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తప్పిదాన్ని చేయించిన కేసీఆర్, కేటీఆర్ ఇప్పుడు ఏమంటున్నారు? మాకేమీ సంబంధం లేదని అంటున్నారు. మొన్నటి వరకు అధికారం వెలగబెట్టిన ఇద్దరూ ఇప్పుడు చేతులు ఎత్తేశారు. ఒకవేళ ట్యాపింగ్ జరిగి వుంటే, దానికి సంబంధించిన అధికారులను శిక్షించాలి అంటున్నారు తప్ప.. మేమే ట్యాపింగ్ చేయమన్నాం అని చెప్పడం లేదు. కేసీఆర్ అయితే మరింత దారుణంగా మాట్లాడారు. ప్రభుత్వ అధినేతగా నేను సమాచారం అడుగుతాను. అధికారులు ఏ మార్గంలో సమాచారం తెలుసుకుని తెచ్చి ఇస్తారో నాకు అవసరం లేదు.. నాకు సంబంధం లేదని చెప్పేశారు. అంటే, ట్యాపింగ్ చేయించిన కేసీఆర్, కేటీఆర్ చాలా తెలివిగా తప్పంగా అధికారుల మీదకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సీన్ రేపు ఏపీలో కూడా రిపీట్ అవుతుంది. ఇప్పుడు జగన్ మెప్పు కోసం పనిచేస్తే, రేపు అధికారం పోయిన తర్వాత జగన్ కూడా చేతులు దులుపుకుంటాడు.. నాకేం సంబంధం.. అధికారులే బాధ్యులు అనేస్తాడు. అప్పుడు దోషుల్లా నిలబడాల్సింది అధికారులే. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేసిన ప్రజల్నే మోసం చేసిన వ్యక్తి జగన్. అలాంటి వ్యక్తి మమ్మల్ని మోసం చేయడులే అనుకోవడం అధికారుల అమాయకత్వం.

By
en-us Political News

  
నిన్నటి వరకు ఉక్కపోతగా  వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. శుక్రవారం హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షంతో ప్రారంభమైన వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు కొనసాగనున్నాయి. 
ఏపీలో ఎన్నికలు పూర్తి అయి నాలుగు రోజులైనా రాష్ట్రంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. హింసాకాండ అదుపులోనికి రాలేదు. పోలింగ్ సందర్భంగా, పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్ అయింది. సీఎస్,డిజిపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. సరే దాదాపు మూడు గంటల పాటు సీఎస్, డీజీపీలో రాష్ట్రంలో పరిస్థితులపై వారి వివరణ ఇచ్చారు.
గెలుస్తున్నాం.. ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పకుండా, గెలుస్తారని ఆశిస్తున్నానని, ప్రమాణ స్వీకారం చేస్తారని ఆశిస్తున్నాను అన్నప్పుడే బొత్సకి కూడా మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మకం పోయిందని అనుకుంటున్నారు.
పొలిటికల్ కామెడీడలో ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ను మించిపోయారు. ఇంత కాలం రోహిణీకార్తె ఎండలను మించి వేడెక్కిన రాజకీయ మంటల నుంచి పాల్ మాత్రమే తన ప్రసంగాలతో ఒకింత ఉపశమనం కలిగిస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు, ఆ తరువాత యథేచ్ఛగా సాగిన హింసాకాండకు సంబంధించి కొందరు పోలీసు అధికారులు, కలెక్టర్లపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసింది. పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది. వారందరిపై కూడా శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీకి పిలిపించుకుని మరీ వివరణ కోరింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అధ్వానం కావడానికి బాధ్యులెవరని నిలదీసింది. హింస ప్రజ్వరిల్లిన పల్నాడు ఎస్పీపై బదిలీ వేటు వేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (మే 17) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ వెలుపలి వరకూ సాగింది.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-19
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొన్నటి ఎన్నికల ముందు కూడా రాజశ్యామల యాగం చేశాడు.. ఏమైంది? చెత్తగా పరిపాలించడం వల్ల దారుణంగా ఓడిపోయాడు. ఇప్పుడు జగన్ పరిస్థితి కూడా సేమ్ టు సేమ్ అవబోతోంది.
చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా షిర్డీ సాయిబాబాను సందర్శించుకున్నారు.
సీబీఐ, ఈడీ చాలా పవిత్రమైన, అమోఘమైన తేదీ అయిన జూన్ 4వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ, జగన్‌కి తమ సత్తా చూపించడానికి అవసరమనవన్నీ ‘సిద్ధం’ చేసుకుంటున్నాయి.
ఈ-ఆఫీస్‌ని అప్‌గ్రేడ్ చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చేసిన అక్రమాలు సమాధి అయ్యే ప్రమాదం వుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.