Publish Date:May 19, 2025
నిజం నిప్పులాంటిది. అధికారం ఉందికదాని దానిని గుప్పిట మూసి ఉంచుదామంటే కుదరదు. చేయి కాలిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్ హయాంలో అధికారం అండ చూసుకుని ఇష్టారీతిగా జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతూ.. నాసిరకం మద్యం సరఫరా చేస్తూ కోట్లు దండుగున్న అవినీతి తిమింగళాల గుట్టు బయటపడుతోంది. అవును మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభ కోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు. వాస్తవానికి ఈ కుంభకోణంలో బాధితులైన వారు లిక్కర్ కంపెనీల యజమానులు. ముడుపులు ఇచ్చి ఇబ్బందులకు గురయ్యారు. ఇప్పుడు దర్యాప్తు అధికారుల ముందు తాము ఇచ్చిన ముడుపులు, వాటిని తీసుకున్న వారి వివరాలను బయటపెడుతున్నారు.
తాజాగా ఆర్థోస్ అనే కంపెనీ యజమాన్యం దర్యాప్తు అధికారులకు విస్తుపోయే వాస్తవాలను వివరించారు. తుపాకీని తమ కణతకు గురిపెట్టి మరీ దోపిడీ చేశారని వివరించింది. అలా తమ ప్రాణాలు తీస్తామని బెదిరించింది మరెవరో కాదు.. వివేకా హత్య కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి అని దర్యాప్తు అధికారులకు తెలిపింది. ఖజురహో అనే బ్రాండ్ మద్యాన్నిసరఫరా చేయడానికి తమకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. అందుకోసం ముడుపులు తీసుకున్నారని వివరించింది.
వాస్తవానికి జగన్ హయాంలో లిక్కర్ కంపెనీలను చాలా వరకూ వైసీపీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. ఉత్పత్తిని గుప్పిట్లో పెట్టుకున్నారు. కొన్ని కంపెనీల్లో కేసు బాటిల్స్ కు ఇంత అని చెప్పి కమిషన్ వసూలు చేశారు. ఆ కమిషన్ ను నగదు రూపంలోనే కాకుండా.. బంగారం సహా ఇతర మార్గాల్లో వసూలు చేసుకున్నారు. ఇందు కోసం తప్పుడు కంపెనీలు సృష్టించారు. ఖర్చు లేని చోట ఖర్చు చూపించారు. లాజిస్టిక్స్అదనీ, ఇదనీ ఇష్టారీతిగా ఖర్చులు చూపించారు. ఇతర ఖర్చులు చూపించారు.
ఇప్పుడు దర్యాప్తులో భాగంగా లిక్కర్ కంపెనీల యజమానులు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇంకా ధైర్యం చేయకపోయినా.. తాము ముడుపులు ఎలా చెల్లించామన్న వివరాలను వెల్లడించారు. తాము కేసుల్లో ఇరుక్కోకుండా, తమ వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బందీ రాకుండా జాగ్రత్తపడుతూనే.. ఐదేళ్ల పాటు జలగల్లా తమ రక్తాన్ని పీల్చేసిన వారికి సంబంధించిన వివరాలను, వారెలో దోపిడీ చేశారో అందుకు అవసరమైన ఆధారాలను దర్యాప్తు అధికారులకు అందజేస్తున్నారు. ఆ వివరాలు, ఆధారాలను సేకరించిన సిట్ ఇక మరిన్ని అరెస్టులకు రంగం సిద్ధం చేస్తోందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/andhra-pradesh-liquor-scam-evidences-with-sit-39-198314.html
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.