ఢిల్లీ పర్యటనకు ముందు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు!!

Publish Date:Feb 12, 2020

Advertisement

జగన్ సర్కార్ ఏపీలో మరో పథకానికి రూపకల్పన చేపడుతోంది. ఇప్పటికే అనేక పథకాలు ప్రారంభించిన జగన్ సర్కార్ మరో నూతన పథకానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను ఆసాంతం సమూలంగా మార్చాలని ప్రవేశపెట్టిన నాడూ నేడూ పధకంతో పాటు జగనన్న అమ్మఒడి వంటి పథకాలను ప్రారంభించారు. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పేరుతో మరో కొత్త పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యనభ్యసించే విద్యార్థికి ఒక స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫాం, రెండు జతల బూట్లు, నోట్ బుక్స్ ఇవాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. 

రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో విచారణను వేగంగా పూర్తి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఎర్రచందనం దొంగతనాల కేసులో విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును తిరుపతిలో ఏర్పాటు చేసేలా మంత్రి వర్గం ముందుకు ప్రతిపాదనలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులు చేసిన ర్యాలీల పై నమోదైన కేసులను రద్దు చేయాలనే ప్రతిపాదన మంత్రి వర్గానికి పంపారు. 

కేంద్రంలో ఉన్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరహాలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనూ ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు చేసేలా ప్రత్యేకంగా ముసాయిదా బిల్లును ప్రభుత్వం రూపొందించగా మంత్రి వర్గంలో ఆమోదం పొందితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ముసాయిదా బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇప్పటి వరకు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ 27 రోజుల వరకు ఉండగా ఇక పై 20 రోజులకే కుదించాలని మునిసిపల్ శాఖ నుంచి మంత్రి వర్గం ఆమోదం కోసం ప్రతిపాదన వెళ్ళింది. కొత్తగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుండగా దీనిని ఏర్పాటు చేయటం ద్వారా 10,000 ల మెగావాట్ల విద్యుత్ ను సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంగా నిర్దేశించారు అధికారులు.ఇవాళ జరిగే మంత్రి వర్గ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ ఢిల్లి పర్యటణలో మోదీని కలిసి బడ్జెట్ లో రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించక పోవడం పై మరియు  రైల్వే ప్రాజెక్టుల పై కూడా చర్చించే అవకాశమున్నట్లు సమాచారం.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. మూడు నెలల్లోపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించినప్పటికీ.. ఆ ఆదేశాలను అమలు చేయలేదని బీజేపీ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ మేరకు స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.