పెరిగిన రాష్ట్ర ఆదాయం, ఖర్చుపై నియంత్రణకు కృషి

Publish Date:Oct 31, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా బాగా దెబ్బతింది. ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం ఇప్పుడప్పుడే కోలుకోలేదని చాలా మంది ఆందోళన చెందారు. కానీ అదృష్టవశాత్తు రాష్ట్రం త్వరగానే కోలుకొంటున్న సూచనలు కనబడుతున్నాయి. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో సమావేశమయిన వివిదశాఖాల ఉన్నతాధికారులు, గత సంవత్సరంతో పోలిస్తే తమ తమ శాఖల ఆదాయం ఆశించిన దానికంటే బాగానే పెరిగిందని చెప్పారు.

 

గత సం.తో పోలిస్తే ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో ఎక్సైజ్ శాఖ ఆదాయంలో-85శాతం వృద్ధి కనబడగా, కమర్షియల్ టాక్స్-93శాతం, స్టాంప్స్ మరియు రిజిస్ట్రేషన్-85శాతం, రెవిన్యూ- 115.6శాతం, రవాణా-78శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో అన్ని శాఖల ఆదాయం కలిపి రూ.12, 881 కోట్లు వచ్చిందని, గత సం. ఇదే కాలానికి రూ.11,313కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఏడాదిలో ఇంతవరకు 17.6 శాతం వృద్ధి కనబడిందని వారు తెలిపారు.

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారినందరినీ అభినందిస్తూనే, రాష్ట్ర ఆర్దికపరిస్థితి పూర్తిగా కుదుటపడేవరకు అందరూ తమ తమ శాఖలకు బడ్జెట్ లో కేటాయించిన నిధులను చాలా పొదుపుగా వాడుకోవాలని, అదేవిధంగా బడ్జెట్ లోటు మరింత పెరగకుండా ఖర్చుల మీద పూర్తి నియంత్రణ సాధించాలని కోరారు. వృదాఖర్చులను అరికట్టి ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ఇదివరకు మహారాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ‘ఎకనామిక్ ఇంటలిజెన్స్’ పద్దతిని మన రాష్ట్రంలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించమని ఆయన కోరారు. తమిళనాడు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎక్సయిజ్ పాలసీనే రాష్ట్రంలో అమలు చేయడానికి అనువుగా ఉంటుందా లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించమని ఆయన ఎక్సయిజ్ అధికారులను కోరారు. రవాణాశాఖ తన ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు మరింత కృషి చేయాలని ఆయన కోరారు.

 

గత డిశంబరు నెలలో కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలలో కనుగొన్న అపారమయిన బొగ్గు నిక్షేపాలను వెలికితీసేందుకు ఆరు నెలలోగా ఒక కన్సల్టెన్సీ ఏజన్సీని నియమించాలని ఆయన కోరారు.

 

ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రాణాలికేతర వ్యయాన్ని కనీసం 20శాతం కంటే తక్కువలో ఉండేలా ఖర్చులను నియంత్రించుకోవాలని అన్ని శాఖల అధికారులను కోరారు. అన్ని శాఖల అధికారులు కూడా ఏ శాఖ ఆదాయం ఎక్కువగా ఉంటుందో దానికి అన్ని విధాల సహకరిస్తూ ఆ ఆదాయం మరింత పెరిగేందుకు తోడ్పడాలని ఆయన కోరారు. అన్ని శాఖల మధ్య మరింత సమన్వయం సాధించడం ద్వారా అన్ని శాఖలు తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు.

By
en-us Political News

  
ఇటు జగన్ కు, ఆయన పార్టీ వైసీపీకీ, అలాగే అటు కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వ నిర్ణయాలను సమర్ధించడం, మద్దతు పలకడం అత్యావశ్యకం. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏకంగా బీజేపీలో కలిసిపోవడం ఖాయం అన్న మాట వినిపిస్తోంది. మిగిలేది టీఆర్ఎస్ ప్రతిరూపంగా తెలంగాణ జాగృతి ఒక్కటేనని గత కొంత కాలంగా ఒక ప్రచారం అయితే జోరుగా నడుస్తోంది.
వైసీపీలో ఇప్పుడు పేర్ని నాని పాటి నోరున్న నేతలు వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత మందే ఉన్నారు. దీంతో పేర్ని నాని అనివార్యంగా రాజకీయాలలో క్రియాశీలంగా ఉండడమన్నది.. ఆయనకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ దృష్ట్యా మాత్రమే కాకుండా, రాష్ట్రంలో వైసీపీ ఉనికికి కూడా ఒక అవసరంగా మారిపోయింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, మరో కీలక నేత రాజిరెడ్డితో కలిసి లొంగిపోవడం సంచలనంగా మారింది.
గాంధీల కుటంబానికి మ‌న‌మంతా ఒక చేయి వేసి వెయ్యి కోట్ల రూపాయ‌లు విరాళంగా ఇద్దాం. ఇదీ ఇటీవ‌ల రేవంత్ చేసిన కామెంట్.
కనీసం తండ్రిని నాన్నా అని కూడా సంబోధించకుండా, బీఆర్ఎస్ అధినేత అన్న ప్రస్తావన కూడా చేయకుండా కేవలం పొడి మాటలతో కవిత చెప్పిన శుభాకాంక్షలపై రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
వాస్తవానికి వైసీపీ ఆరోపణలు, విమర్శల స్థాయి రోజురోజుకూ పతనం నుంచి పతనానికి అన్నట్లుగా దిగజారుతోంది. జగన్ సొంత మీడియాలో లోకేష్ శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన పాకిస్థాన్, ఇండియా మ్యాచ్ చూడడానికి వెళ్లిన ప్రైవేట్ పర్యటనపై చేసిన ఆరోపణలు అవాస్తవంగా తేలడంతో ఆ పార్టీ ప్రతిష్ఠ మరింత దిగజారింది.
అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు, పని తీరు, ప్రజా సంక్షేమం చూసి వారంతట వారే స్వచ్ఛందంగా పార్టీలో చేరారని ఘనంగా ప్రకటించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి రివర్స్ లో కనిపిస్తుంటే మాత్రం.. ప్రజాస్వామ్యం ఖూనీ, మా పార్టీ వారికి కాంగ్రెస్ గేలం అంటూ గుండెలు బాదుకుంటోంది. పైగా ఆ ఆరోపణలను స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుకు కల్వకుంట్ల తారకరామారావు నుంచే రావడంతో తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటోంది.
పార్టీ నుంచి సస్పెండైన ఇద్దరు ఎమ్మెల్సీలు కలిశారు. జగన్ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పార్టీ గొంతు బలంగా వినిపించాలని వారికి దిశానిర్దేశం చేశారు.
ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది.
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉండవల్లిని పరామర్శించిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.
ఇప్పటి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్ కాట్ చేసినా.. సభలో చర్చించిన అంశాలు, ఆమోదించిన బిల్లులపై తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చొని ఆ పార్టీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్‌మీట్లు పెట్టి మాట్లాడుతూ వచ్చారు. శాసనసభకు రాకపోయినా ఆ విధంగా తన అభిప్రాయాలు ప్రజలకు తెలియజేస్తే సరిపోతుందని జగన్ స్వయంగా ప్రకటించారు కూడా.
కేంద్ర ఎన్నికల సంఘం టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయించింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో విజిల్ సౌండ్ పై ప్రభుత్వం నిషేధం విధించింది. ఎన్నికల కోడ్ అమలులోకి రాకుండానే విజల్ పై బ్యాన్ విధించడంతో విజయ్ టీవీకే పార్టీ అంటే అధికార డీఎంకే భయపడుతోందా అన్న చర్చ మొదలైంది.
ప‌రామార్శ పేర బలప్రదర్శనలకు దిగడం జగన్ కు రివాజుగా మారిపోయిందంటున్నారు. బలప్రదర్శన పేర జరిగే ఈ నాటకాన్ని రక్తికట్టించేందుకు పేర్ని నాని వంటివారు జగన్ కు ఇతోధికంగా సహాయపడుతుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.