రాజకీయ నేతల మాటల ప్రభావం వల్లనే రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగాయా?

Publish Date:Sep 4, 2015

Advertisement

 

ప్రత్యేక హోదా రాలేదనే మనస్తాపంతో రాష్ట్రంలో నిత్యం ఎవరో ఒకరు ప్రాణాలు తీసుకొంటున్నారు. కానీ వారు ప్రత్యేక హోదా గురించి కొందరు రాజకీయ నాయకులు చెపుతున్న మాటల ప్రభావానికి లోనయినందునే ఆత్మహత్యలు చేసుకొంటున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర విభజన తరువాతనే పైకి వచ్చింది. అప్పుడూ దాని గురించి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు. కానీ కాంగ్రెస్, వైకాపాలు ప్రత్యేక హోదాపై పోరాటాలు మొదలు పెట్టి ‘ప్రత్యేక హోదా రాకపోతే పరిశ్రమలు రావు...మీ పిల్లలకు ఉద్యోగాలు రావు...వారి భవిష్యత్ అంధకారం అయిపోతుంది’ అని పదేపదే నొక్కి చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండే రాష్ట్రంలో ఆత్మహత్యలు మొదలయ్యాయి. పేద, దిగువ మధ్య తరగతికి చెందినవారి ఆర్ధిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. కనుక వారు నిత్యం కష్టాలు, కుటుంబ సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి వారిపై ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు పెను ప్రభావం చూపుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ నేతలు ప్రజలకు వారి భవిష్యత్ పట్ల ఆశ, భరోసా కల్పించకపోగా తమ మాటలతో వారిని తీవ్ర ప్రభావితం చేసి వారు ప్రాణాలు తీసుకొనేందుకు ప్రోత్సహిస్తున్నట్లుంది. వారు తమ మాటలతో సమాజాన్ని ముఖ్యంగా నిరుపేదలని ‘మాస్ హిప్నటైజ్’ చేస్తున్నారని చెప్పవచ్చును. ప్రజలకు సరయిన మార్గ దర్శనం చేయగలిగినవాడే నాయకుడు తప్ప ప్రజలని మృత్యు మార్గం పట్టించేవాడు కాదు.

 

ప్రజలు కూడా ఇప్పుడు పార్టీల వారిగా చీలిపోతున్నారు. కనుక వారిపై సదరు పార్టీ నేతలు మాటల ప్రభావం సహజంగానే మరికాస్త ఎక్కువగా ఉంటుంది. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకే చెందిన మునికోటి ఆత్మహత్య చేసుకోవడం అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.

 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమే. కానీ అది రానంత మాత్రాన్న ప్రళయం రాదనే సంగతి ప్రజలు కూడా తెలుసు. అటువంటప్పుడు రాజకీయ నేతలు తమ పార్టీల ఉనికిని కాపాడుకోవడానికో లేక తమ పార్టీలో నేతలు, కార్యకర్తలు వేరే పార్టీల వైపు చూడకుండా పట్టి ఉంచుకోనేందుకో లేకపోతే ప్రజలకు, అధికార పార్టీకి తమ శక్తి ప్రదర్శించడానికో చేస్తున్న పోరాటాలు, మాట్లాడుతున్న మాటలను నమ్మి ఆత్మహత్యలు చేసుకోవడం అవివేకం. దాని వలన వారి కుటుంబాలే రోడ్డున పడుతాయి. కానీ వారి ఆత్మహత్యలను కూడా రాజకీయం చేస్తూ పార్టీలు మరింత బలపడే ప్రయత్నాలు చేస్తుండటం మన కళ్ళ ముందే జరుగుతోంది. కనుక ప్రజలు భావోద్వేగాలకు లొంగి ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యలు చేసుకోవడం వలన సాధించేదేమీ ఉండదని గ్రహించాలి.

 

రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడూ ఆంధ్రా ప్రాంతంలో పెద్దగా పరిశ్రమలు రాలేదు. అన్నీ హైదరాబాద్ కే పరిమితమయ్యాయి. కానీ అప్పుడు ఎవరూ ఈవిధంగా వరుసపెట్టి ఆత్మహత్యలు చేసుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేని మాట వాస్తవమే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి వలన ఇప్పటికే చిత్తూరు, అనంతపురం, నెల్లూరు తదితర జిల్లాలలో చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రీ సిటీ, కృష్ణపట్నం వద్ద అనేక కొత్త పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పలు రాయితీలు, ప్రోత్సాహకాల వలన అక్కడ చాలా పరిశ్రమలు స్థాపించబడుతున్నాయి. నిజం చెప్పాలంటే రాష్ట్ర విభజన తరువాతే రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగం పుంజుకొంది. ఒకవేళ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు అయితే అది మరింత వేగం పుంజుకొనే అవకాశం ఉంటుంది. అంతే!

 

రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా కృషి చేస్తోంది. కానీ రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొత్తగా ఎన్ని, ఎటువంటి పరిశ్రమలు రాబోతున్నాయి? వాటి వలన ఎంత మందికి ఉపాధి దొరకబోతోంది? ఇంకా మున్ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేప్పట్టబోతోంది? దాని వలన ప్రజలకు, ముఖ్యంగా యువతకు, నిరుపేదలకు ఏవిధంగా ప్రయోజనం కలుగబోతోంది? అనే విషయాల గురించి ప్రభుత్వం గట్టిగా ప్రచారం చేయడం ద్వారా ఈ ఆత్మహత్యలను నివారించవచ్చును.

 

ఈ సమస్యను ప్రతిపక్షాలు రాజకీయ అంశంగా చేసుకొంటున్నప్పుడు, ప్రభుత్వం కూడా దానిని ఒక రాజకీయ, సామాజిక సమస్యగా పరిగణించి అంతే ధీటుగా ఎదుర్కొనవలసి ఉంది. లేకుంటే ప్రత్యేక హోదా వల్ల ఏమి ప్రయోజనం కలుగుతుందో తెలియని రమణయ్య వంటి అమాయకులు ప్రాణాలు తీసుకొంటూనే ఉంటారు. వారు ఆత్మహత్యలు చేసుకొంటున్నకొద్దీ ప్రతిపక్షాల ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.