ఏపీ, తెలంగాణ బడ్జెట్ కబుర్లు

Publish Date:Feb 25, 2015

Advertisement

 

ఆంద్రప్రదేశ్, తెలంగాణా రెండు రాష్ట్రాల శాసనసభ బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 7 నుంచి మొదలవబోతున్నాయి. గవర్నర్ నరసింహన్ మొదట ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉభయసభలను, ఆ తరువాత తెలంగాణా రాష్ట్ర ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మార్చి 12న సభలో ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు 13న సమర్పిస్తారు. మార్చి 27 వరకు ఈ సమావేశాలు నిర్వహించవచవచ్చును.

 

తెలంగాణా రాష్ట్ర బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి ఈటెల రాజేందర్ మార్చి11న ప్రవేశపెడతారు. మార్చి 13, 14,16 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరుగుతుంది. మార్చి 17న ఆర్ధికమంత్రి బడ్జెట్ పై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెపుతారు. మార్చి25 వరకు నిర్వహించవచ్చును. రెండు రాష్ట్రాల బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయాన్ని బిజినస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాలలో నిర్ణయిస్తారు.

 

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మొట్టమొదటిసారిగా 2015-16సం.లకి గాను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాయి. ఈసారి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రూ.1.25 లక్షల కోట్లు, తెలంగాణా బడ్జెట్ సుమారు రూ.1.0 లక్ష కోట్లు ఉండవచ్చని సమాచారం. ఉభయ రాష్ట్రాలకు ప్రత్యేకమయిన సమస్యలు, అవసరాలు, ఆర్ధిక వనరులు కలిగి ఉన్నందున వాటి బడ్జెట్ కేటాయింపులు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మౌలికవసతుల, ఐటీ, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారిస్తోంది. రాజధాని నిర్మాణం కూడా చేపట్టబోతోంది. వాటి ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెంచుకొనే అవకాశం ఉంది. వాటి ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు కూడా కలుగుతాయి. కనుక వాటి కోసం ముందుగా యువతకు ఆయా రంగాలలో సాంకేతిక శిక్షణ (స్కిల్ డెవలప్మెంట్) కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ‘నాలెడ్జ్ హబ్’ గా తయారుచేయాలని భావిస్తున్నారు. కనుక మిగిలిన అన్నిటికంటే ఆ రంగానికే చాలా భారీగా నిధులు కేటాయించవచ్చును.

 

దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు తమ ప్రభుత్వం నదులు అనుసంధానం చేయాలనుకొంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అలాగే ఎత్తిపోతల పధకాలకు ద్వారా సీమ జిల్లాలకు త్రాగు,సాగు నీరు అందించేందుకు బడ్జెట్ లో భారీ కేటాయింపులు చేయవచ్చును.

 

తెలంగాణా రాష్ట్రం ప్రధానంగా చెరువుల పునరుద్దరణ ద్వారా పంటలకు నీళ్ళు అందించి తద్వారా రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కష్టాలను నివారించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అందుకోసం ముమ్ముర ప్రయత్నాలు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ మంచి నీళ్ళు సరఫరా చేస్తామని లేకుంటే ప్రజలను ఓట్లు అడగబోమని కేసీఆర్ పడే పడే చెపుతున్నారు. కనుక ఈ బడ్జెట్ లో ఈ రెండు పధకాల కోసం భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది.

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటోంది. కనుక దానిని అధిగామించేందుకు రాష్ట్రంలో పలుచోట్ల థర్మల్, సౌర విద్యుత్ ఉత్పతి కేంద్రాలను స్థాపించేందుకు వీలుగా కేటాయింపులు చేయవచ్చును.

 

ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిపాలనలో తెలంగాణా రాష్ట్ర సంస్క్రతి, సంప్రదాయాలను, తెలంగాణా రాష్ట్ర ప్రత్యేక ఉనికిని చాటుకొనేందుకు చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే తెలంగాణాకే ప్రత్యేకమయిన బ్రతుకమ్మ, బోనాల పండుగల నిర్వహణ, తిరుపతితో సమానంగా యాదగిరిగుట్ట అభివృద్ధి, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఎర్రగడ్డ వద్ద కొత్త సచివాలయ నిర్మాణం వంటి భారీ కార్యక్రమాలను భుజాలకెత్తుకొన్నారు. అయితే వీటిలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, ఆకాశ హర్మ్యాల నిర్మాణం సాధ్యాసాధ్యాలను ఇంకా పరిశీలించవలసి ఉంది. కనుక మిగిలిన వాటికి భారీ కేటాయింపులు జరుపవచ్చును.

 

మెట్రో రైల్ మార్గంలో మార్పులు చేర్పులకు అయ్యే అదనపు వ్యయాన్ని తెలంగాణా ప్రభుత్వమే భరిస్తుందని ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చి ఉన్నారు. దానికి సుమారు రూ.2200 కోట్లు అవసరం ఉంటాయని నివేదిక అందింది. దానికి ఈ బడ్జెట్ లో ఎంతో కొంత కేటాయింపు జరుపవలసి ఉంటుంది. లేకుంటే మళ్ళీ మెట్రో రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉంటుంది.

 

కనుక రెండు రాష్ట్రాలు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతలకు అద్దం పట్టేవిగా ఉంటాయని స్పష్టం అవుతోంది. అయితే ఆ బడ్జెట్ కేటాయింపులు వాస్తవ అంచనాలకి, పరిస్థితులకి అనుగుణంగా ఉండాలని ప్రజలు కోరుకొంటున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.