అభివృద్ధి మంత్రం జపిస్తున్న ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలు

Publish Date:Nov 24, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ అంశాలపై కత్తులు దూసుకొంటునప్పటికీ, తమ తమ రాష్ట్రాలను పొరుగు రాష్ట్రం కంటే వేగంగా, ఎక్కువగా అభివృద్ధి చేసుకోవాలని పట్టుదలగా ప్రయత్నిస్తుండటం అభినందనీయం. వచ్చే ఎన్నికల నాటికి పొరుగు రాష్ట్రం కంటే తమ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి చూపకపోయినా, సమస్యలను పరిష్కరించడంలో విఫలమయినా ప్రజలు తమ పార్టీని తిరస్కరించవచ్చనే భయం కూడా బహుశః వారిని అభివృద్ధి పధంలో పరుగులు పెట్టేలా చేస్తున్నాయని భావించవచ్చును. కారణాలు, ఆలోచనలు ఏవయినప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంతకు ముందు ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా అభివృద్ధి గురించే మాట్లాడుతున్నాయి. ఆలోచిస్తున్నాయి. గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

 

గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణా రాష్ట్రం ఆంద్ర పాలకుల చేతిలో దోపిడీకి, తీవ్ర నిర్లక్ష్యానికి గురయిందని గట్టిగా వాదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేసి ఆంద్ర పాలకులకు, తమ పాలనకు మధ్య గల తీవ్ర వ్యత్యాసం చూపించాలనే ప్రయత్నంలో అన్ని వర్గాలను, ప్రాంతాల సమస్యలను ఏకకాలంలో పరిష్కరించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే తెలంగాణాలో అత్యధిక జనాభాగా ఉన్న యస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించారు. తెలంగాణాను పట్టి పీడిస్తున్న తీవ్ర విద్యుత్ సంక్షోభం నుండి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

 

వ్యవసాయానికి నీటి వసతి కల్పించేందుకు చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాలను జిల్లా కేంద్రాలతో, జిల్లా కేంద్రాలను రాజధానితో అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రాజధాని హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, దాని చుట్టూ ఆకాశ హర్మ్యాల నిర్మాణం, ఇందిరా పార్క్ సమీపంలో ప్రపంచంలోకెల్లా ఎత్తయిన ఆకాశహర్మ్య నిర్మాణం చేయాలనే ఆలోచనలన్నీ పొరుగు రాష్ట్రంతో పోటీలో భాగంగానే భావించవచ్చును. అయితే ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఇటువంటి ఆరోగ్యకరమయిన పోటీని హర్షిస్తారు.

 

మళ్ళీ పదేళ్ళ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప్పట్టిన చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకొన్న ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని చక్కదిద్దుతూనే, రాజధాని నిర్మాణం దానితో బాటే రాష్ట్రాభివృద్ధి, అదే సమయంలో తన ఎన్నికల హామీలను, బడ్జెట్ లో ప్రకటించిన హామీలను కూడా అమలుచేసి తన సత్తా ఏమిటో ప్రజలకు చూపించాలని తపిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలోగా రాజధానికి ఓ రూపురేఖలు తీసుకురావాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. దేశంలో కెల్లా అత్యద్భుతమయిన, అత్యాదునికమయిన హంగులతో కూడిన రాజధానిని నిర్మించేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు, దానికి ఎదురవుతున్న అడ్డంకులను ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నదుల అనుసంధానం వంటి భారీ కార్యక్రమాలను ఆయన పెట్టుకొన్నారు. ఈ రెంటివల్ల రాష్ట్రంలో అనేక లక్షల ఎకరాలకు నీళ్ళు లభిస్తే వ్యవసాయం కూడా గాడిన పడుతుంది.

 

రాష్ట్ర విభజన వల్ల పూర్తిగా దెబ్బతిన్న ఆర్ధిక పరిస్థితి మెరుగుపడాలంటే కొత్తగా భారీ పరిశ్రమలు, పెట్టుబడులు రావలసి ఉంటుంది. అయితే అంతకంటే ముందుగా రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం నివారించడం చాలా అవసరమని గ్రహించిన ఆయన ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలం అయ్యారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు ఆయన దేశ విదేశాలలో పర్యటిస్తున్నారు. అదే సమయంలో వాటికి అవసరమయిన అనుమతులు మంజూరు చేస్తూ, సౌకర్యాలు కల్పిస్తూ పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నాలు గట్టిగా చేస్తున్నారు. ఆ ప్రయత్నంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, అనుమతులు, విభజన చట్టంలో రాష్ట్రానికి హామీ ఇవ్వబడిన అనేక ప్రాజెక్టుల క్లియరెన్స్ కోసం ఆయన కేంద్రం ఒత్తిడి చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నాలకు బహుశః త్వరలోనే ఫలితాలు కనబడటం మొదలవుతాయని చెప్పవచ్చును.

 

ఈ ఐదేళ్ళలో ఈ పనులన్నీచేసి చూపగలిగినట్లయితే అవి ఆయన ప్రభుత్వ పనితీరుకి, సామర్ధ్యానికి గీటురాయిగా నిలుస్తాయి. దానివలన వచ్చే ఎన్నికలలో కూడా గెలిచి తన అధికారం నిలబెట్టుకోవడం సాధ్యమవుతుంది కనుక, ముఖ్యమంత్రి చంద్రబాబు సాధ్యమయినంత వరకు ఈ పనులన్నిటినీ పూర్తిచేసేందుకు గట్టిగానే ప్రయత్నిస్తారని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఈవిధంగా రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడుతూ ఒకదానికొకటి సహకరించుకొంటూ ముందుకు సాగినట్లయితే అందరూ హర్షిస్తారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.