రాజధాని నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తే...

Publish Date:Nov 14, 2014

Advertisement

 

 

రాష్ట్రంలో మరే ఇతర సమస్యలు లేనట్లుగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలన్నీ రాజధాని భూముల చుట్టూనే తిరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ వద్ద రాజధాని నిర్మించబోతునప్పుడు స్వాగతించిన కాంగ్రెస్, వైకాపాలు, ఇప్పుడు రాజధాని రైతుల హక్కుల పరిరక్షణ కమిటీల ముసుగులో గ్రామాలలో పర్యటిస్తూ రైతులలో లేని పోనీ అనుమానాలు, భయాందోళనలు సృష్టిస్తూ భూసేకరణకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తుండటం చాలా దురదృష్టకరం. అయితే తాము రైతుల హక్కులను కాపాడేందుకే ప్రయత్నిస్తున్నాము తప్ప రాజధాని నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించడం లేదని సమర్ధించుకొంటున్నారు.

 

ఆ విషయం గ్రహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులను, స్థానిక యంపీ, యం.యల్యేలను కూడా గ్రామాలలో పర్యటించి రైతుల సందేహాలు తీర్చి, వారికి ప్రభుత్వం తరపున పూర్తి భరోసా కల్పించమని ఆదేశించారు. వారు తమకు అప్పగించిన బాధ్యత చాలా సమర్ధంగానే నిర్వహించారని చెప్పవచ్చును.

 

లక్షలు పలికే భూములకు ఎక్కడి నుండో వచ్చిన వ్యాపారులు ఇప్పుడు కోట్లు ఎందుకు ఆఫర్ చేస్తున్నారో? ఆలోచించుకోవాలని వారు రైతులను కోరారు. రాజధాని ఇక్కడ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయం వలననే రైతుల భూముల ధరలు పెరిగాయని, అందువల్ల ఎవరి చెప్పుడు మాటలకో చెవొగ్గి అయినకాడికి భూములను అమ్ముకోవద్దని, రైతులు అన్నివిధాల లాభాపడేలా, వారి జీవితాలకు పూర్తి భద్రత, భరోసా కలిగేవిధంగా ప్రభుత్వమే భాద్యత తీసుకొంటుందని హామీ ఇచ్చారు. మంత్రులు చెప్పిన ఆ మాటలు రైతులకు బాగా చేరింది.

 

అప్పటి నుండే రైతులలో నెలకొన్న భయాందోళనలు క్రమంగా తగ్గు ముఖం పట్టి, ఒక్కో గ్రామంలో రైతులు స్వచ్చదంగా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వస్తున్నారు. రైతులు కోరుతున్న విధంగా 1000 గజాల స్థలానికి బదులు రాజధాని నగరంలో అన్ని విధాల అభివృద్ధి చేయబడిన 1200గజాల స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో రైతులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

రైతన్నలను భయాందోళనలు రేకెత్తించి, వారు రాజధాని నిర్మాణానికి భూమి ఇవ్వకుండా అడ్డుకోగలిగితే, రాజధాని నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో ముందుకీ, వెనక్కి వెళ్ళలేని పరిస్థితి కలుగుతుందని భావించిన ప్రతిపక్షాలకు ఇది ఊహించని పరిణామమేనని చెప్పవచ్చును. కానీ వారి ప్రయత్నాలు వారు ఇంకా చేస్తూనే ఉన్నారు.

 

సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్న మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గ్రామాలలో పర్యటించనంత కాలం, ప్రభుత్వం ఎక్కడో హైదరాబాద్ లో ఏసీ గదుల్లో కూర్చొని భూసేకరణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించిన ప్రతిపక్షాలు, ఇప్పుడు వారు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి, రైతుల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తూ వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించి భూసేకరణకు మార్గం సుగమం చేస్తుంటే, అధికార పార్టీ నేతలు రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారనే మరో కొత్త ప్రచారం మొదలుపెట్టి, రైతన్నలకు అండగా నిలబడతాము అంటూ ప్రతిపక్ష నేతలు గ్రామాలలో పర్యటిస్తున్నారు.

 

అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ రాజకీయ చదరంగం ఇలా సాగుతుంటే, గన్నవరం మండలంలో గల అజ్జంపూడి, బుద్దవరం, దావాజీ గూడెం మరియు కేసరపల్లి గ్రామాలకు చెందిన రైతులు నిర్వహించిన గ్రామసభలో చేసిన తీర్మానం చాలా ఆసక్తికరంగా ఉంది.

 

కొత్త రాజధానికి అత్యంత సమీపంలో ఉన్న గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం మండలంలో గల ఆ నాలుగు గ్రామాల నుండి మొత్తం 406 ఎకరాల భూమిని సేకరించేందుకు కొన్నిరోజుల క్రితమే ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. చట్ట ప్రకారం భూసేకరణకు ఎంత పరిహారం చెల్లించవలసి ఉంటుందో అంతా ప్రభుత్వం చెల్లిస్తుందని పేర్కొంది. కానీ తూళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ఏవిధమయిన నష్టపరిహారం ఇస్తోందో అదే విధంగా తమకు పరిహారం ఇవ్వాలని నిన్న గ్రామ సభలో రైతులు తీర్మానించారు. తూళ్ళూరులో రైతులు రాజధాని కోసం భూములు ఇస్తుంటే, తాము రాజధానికి అవసరమయిన విమానాశ్రయ విస్తరణకు భూములు ఇస్తున్నాము కనుక తమకూ అదేవిధంగా పరిహారం చెల్లించాలని వారు తీర్మానించారు.

 

వారి డిమాండ్ల మాట ఎలా ఉన్నప్పటికీ వారు చేసిన ఆ తీర్మానం తూళ్ళూరు రైతులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం మరియు ప్యాకేజీ చాలా బాగుందనే విషయాన్ని ద్రువీకరిస్తోంది. అందుకే తమకూ అటువంటి మంచి ప్యాకేజీయే ఇవ్వాలని గన్నవరం మండలం రైతులు కూడా కోరుతున్నారని అర్ధమవుతోంది. అంటే తూళ్ళూరు మండలంలో తెదేపా నేతలు, యం.యల్యేలు. రైతన్నలను బెదిరించి, భయపెట్టి భూములు స్వాధీనం చేసుకొంటున్నారని కాంగ్రెస్, వైకాపాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది.

 

నిన్న మొన్నటి వరకు దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా పేరు పొందిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాంగ్రెస్ పుణ్యమాని రాజధాని లేని దుస్థితిలో ఉందిపుడు. అందుకు కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా పశ్చాత్తాప పడకపోవచ్చును, సిగ్గుపడకపోవచ్చును. కానీ రాజధాని లేదని చెప్పుకోవలసిరావడం ఆత్మాభిమానం ఉన్న ప్రతీ తెలుగు వ్యక్తికీ చాలా సిగ్గు, బాధ కలిగిస్తుంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీలయినంత త్వరగా రాష్ట్రానికి రాజధాని నిర్మించాలనే పట్టుదలతో కృషి చేస్తున్నారు.

 

రాష్ట్ర పరిస్థితిని అర్ధం చేసుకొని ఆయనకు సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించడం క్షమార్హం కాదు. తమ అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. అదేవిధంగా ఇప్పడు రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్న వారికి ప్రజలు అదే విధంగా బుద్ధి చెప్పగలరనే సంగతి వారు గ్రహిస్తేమంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.