ఎందుకీ అకారణ ద్వేషం?

Publish Date:Jul 4, 2014

Advertisement

 

ఆంధ్ర, తెలంగాణాలు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడి కనీసం నెల రోజులు గడవక మునుపే అప్పుడే విద్యుత్, జల వివాదాలు మొదలయ్యాయి. ప్రతీసారి కేంద్ర జల, విద్యుత్ సంఘాలు జోక్యం చేసుకొంటే తప్ప అడుగు ముందుకుపడటం లేదు. విభజన కారణంగా ఉభయ రాష్ట్రాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న ఈ తరుణంలో అవి సరిపోవన్నట్లుగా మళ్ళీ కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవివేకమే అవుతుంది.

 

రాష్ట్ర విభజన మొదలు మొన్న ఎన్నికల వరకు జరిగిన రాజకీయాలతో ఇరు రాష్ట్రాల ప్రజలు చాలా విసుగెత్తిపోయి ఉన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి జరగాలని కోరుకొంటున్నారు తప్ప ఇంకా ఈ విద్వేషాలను కొనసాగించాలని కోరుకోవడం లేదనే సంగతిని రెండు ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రజల దృష్టిలో హీరోలుగా నిలిచేందుకో, లేక సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికో అధికారంలో ఉన్నవారు ఇతరుల గురించి చులకనగా మాట్లాడటం, నిందించడం, దుందుడుకుగా వ్యవహరించడం వలన తాత్కాలికంగా కొందరు ప్రజల మెప్పు పొందవచ్చునేమో, కానీ చిరకాలం ప్రజలందరినీ మెప్పించలేరు. మభ్యపెట్టలేరు. వారు ఇదే ధోరణి ఇంకా కొనసాగించినట్లయితే ఆ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో ప్రజలు కూడా గ్రహించగలరు.

 

రాష్ట్ర విభజన జరగడం కోసం తెరాస నేతలు ఆంధ్ర, తెలంగాణా ప్రజలను మానసికంగా విడదీసారు. చివరికి వారు కోరుకొన్నట్లే భౌగోళికంగా కూడా రెండు రాష్ట్రాలు విడిపోయాయి. అయినా ఇంకా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, వ్యవహరించడం వల్ల ఏమి ప్రయోజనం ఆశిస్తున్నారో వారికే తెలియాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సంయనం పాటిస్తూ, తెలంగాణా ప్రభుత్వానికి స్నేహహస్తం అందిస్తుంటే, తెరాస నేతలు మాత్రం అందుకు ఏ మాత్రం సానుకూలంగా స్పందించకపోగా, దానిని ఆయన బలహీనతగా భావిస్తున్నట్లు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏమాత్రం సంమయమనం కోల్పోకుండా వ్యవహరిస్తుండటం అభినందనీయం.

 

మాటకారితనం ప్రదర్శించడం వలన రెండు ప్రభుత్వాల మధ్య, ప్రజల మధ్య కూడా దూరం మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. ‘రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ములుగా కలుసుందాము,’ అని తెరాస నేతలు పదేపదే చెప్పిన నిన్నటి మాటలను ఒక మారు గుర్తుకు తెచ్చుకోవాలి. నిన్న మొన్నటి వరకు ఒకటిగా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారినపుడు అన్నదమ్ములవలె మెలగాలి తప్ప దాయాదులుగా మారి కుమ్ములాడుకోవడం తగదు. దాని వలన రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. అభివృద్ధి కుంటుపడుతుంది తప్ప వేరే ప్రయోజనం ఉండదు. అందువల్ల ఇప్పటికయినా తెరాస నేతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజల పట్ల తమ అకారణ విద్వేష వైఖరిని విడనాడి, స్నేహసంబంధాలు పెంచుకొనే ప్రయత్నాలు చేయగలిగితే, రాష్ట్ర విభజన కారణంగా తలెత్తుతున్న అనేక సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చును. రెండు రాష్ట్రాలు ఒకదానికొకటి సహకరించుకొంటూ వేగంగా అభివృద్ధి చెందవచ్చును. కానీ ఇప్పుడు కూడా రెండు ప్రభుత్వాలు విజ్ఞతతో వ్యవహరించకపోతే, కేంద్రం దృష్టిలో, దేశ ప్రజల దృష్టిలో తెలుగుజాతి చులకనవుతుంది. నవ్వులపాలవుతుంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.