ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య సమన్వయం కలేనా?

Publish Date:Jun 19, 2014

Advertisement

 

పీపీఏల రద్దుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య అవాంఛనీయమయిన యుద్ధం కొనసాగుతోంది. రెండు ప్రభుత్వాలు ఈసమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొనే ప్రయత్నం చేయకుండా, కవ్వింపు మాటలతో యుద్ద వాతావరణం సృష్టిస్తున్నాయి. అందుకు ప్రధానకారణం రెండు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలు విషయంలో తీవ్ర ఇబ్బందులు, విమర్శలు, ఒత్తిళ్ళు ఎదుర్కోవడమే అయి ఉండవచ్చును. సాధారణంగా అధికార పార్టీలు ఇటువంటి సమస్యలు ఎదురయినప్పుడు ప్రజల, ప్రతిపక్షాల, మీడియా దృష్టిని వేరే ఇతర అంశాల మీదకు మళ్ళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక బహుశః ఇది కూడా అటువంటి ప్రయత్నమే అనుకోవాల్సి ఉంటుంది.

 

రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజల సంక్షేమం కోరుకొంటున్నానని పదేపదే చెపుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ నుండి పంపిణీ అయ్యే విద్యుత్ మీదే తెలంగాణా రైతన్నలు పూర్తిగా ఆధారపడి పంటలు సాగుచేసుకొంటున్నారని తెలిసిఉనప్పటికీ, తెలంగాణకు ఇచ్చే విద్యుత్ లో కోతపెట్టాలని ప్రయత్నించడం హర్షించదగ్గ విషయం కాదు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కు నష్టం కలిగించమని కూడా కాదు. విద్యుత్ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ఈ సమస్యను ఏవిధంగా పరిష్కరించుకోవచ్చునో కూడా బాగా తెలుసు. కనుక ఈ సమస్యను చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరిం చేందుకే గట్టిగా ప్రయత్నించాలి. లేకుంటే వ్యవసాయ రుణాలమాఫీ వంటి ఇతర అంశాలపై నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకే ఆయన కూడా కేసీఆర్ లాగ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించవచ్చును.

 

ఇక ఉద్యమపార్టీ అయిన తెరాస, ఇప్పుడు బాధ్యతాయుతమయిన అధికార పార్టీగా మెలిగేందుకు ప్రయత్నించాలి తప్ప, “మీరు ఒకటి చేస్తే మేము రెండు చేస్తాము, ఆంద్ర మంత్రుల ఇళ్ళకు విద్యుత్ నిలిపి వేస్తాము” వంటి బెదిరించడం మంచిపద్దతి కాదు. ఉద్యమకాలంలో తెరాస నేతలు తమ లక్ష్యం సాధించేందుకు ఏ విధంగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ప్రజలు అధికారం కట్టబెట్టారు గనుక చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి, వ్యవహరించాలి.

 

తెదేపా, తెరాసలు రాజకీయంగా ఒకదానినొకటి ఎంత వ్యతిరేఖించుకొన్నా ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. కానీ అధికారం చేపట్టిన తరువాత కూడా రెండు ప్రభుత్వాల వలే కాకుండా ఇంకా రాజకీయ పార్టీలలాగా వ్యవహరించడాన్ని ప్రజలు హర్షించారనే సంగతిని గ్రహిస్తే మంచిది. ఇంకా ఇటువంటి అనేకం సమస్యలను రెండు ప్రభుత్వాలు మున్ముందు ఎదుర్కోవలసి ఉంది. అటువంటప్పుడు ఈ సమస్యల శాశ్విత పరిష్కారానికి నిపుణులతో కూడిన కమిటీలు వేసుకోనో లేక ఉభయ రాష్ట్రాల ఉన్నతాధికారులు చర్చల ద్వారానో పరిష్కరించుకొనే ప్రయత్నం చేయాలి తప్ప చీటికి మాటికీ కేంద్రం వద్దకు, ఇరుగు పొరుగు రాష్ట్రాల వద్దకు వెళ్లి పంచాయితీ పెట్టుకొంటే తెలుగు ప్రజల పట్ల అందరికీ మరింత చులకన భావం ఏర్పడుతుంది. రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు ప్రజలు ఇది అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నారు. కనుక ఇకనయినా రెండు ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సమస్యలన్నిటినీ రాష్ట్ర స్థాయిలోనే పరిష్కరించుకొనే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.