న్యూస్ ఎక్స్ సర్వే సైతం అదే చెప్పింది.. చంద్రబాబే సీఎం!

Publish Date:Apr 15, 2024

Advertisement

ఏ నోట విన్నా ఒకటే మాట.. ఏ సర్వే చూసినా ఒకటే ఫలితం. ఏపీలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. తాజాగా మరో జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే కూడా అదే ఫలితాన్ని వెలువరించింది. ఏపీలో తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని పేర్కొంది. వైసీపీ భారీగా నష్టపోతున్నదని తేల్చేసింది.  రాష్ట్రంలోని పాతిక లోక్ సభ స్థానాలలో వైసీపీ కేవలం ఎనిమిది స్థానాలలో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నాయని కుండబద్దలు కొట్టింది.అదే విధంగా తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయకేతనం ఎగురవేయనున్నట్లు స్పష్టం చేసింది.

రాష్ట్రంలో వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది.   ఏపీలో ఈ సారి జరగనున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవనడంలో సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఏపీ ఎన్నికలపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా న్యూస్ ఎక్స్ నిర్వహించిన సర్వే ఫలితం కూడా రాష్ట్రంలో అధికారం చేపట్టబోయేది తెలుగుదేశం కూటమేనని నిర్ద్వంద్వంగా పేర్కొంది.  ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధిస్తుందని వెల్లడించింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 18 లోక్ సభ స్థానాలలో విజయకేతనం ఎగురవేస్తుందని అంచనా వేసింది.

రాష్ట్రంలో మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం పార్టీ 17 స్థానాలలో పోటీ చేస్తున్నది.  కూటమిభాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీ వరుసగా రెండు, ఆరు స్థానాలలో పోటీ చేయనున్నాయి.  ఇక న్యూస్ ఎక్స్ సర్వే ఫలితం మేరకు తెలుగుదేశం పోటీ చేస్తున్న 17 లోక్ సభ స్థానాలలో 14 స్థానాలలో విజయం సాధిస్తుంది. బీజేపీ పోటీ చేస్తున్న 6 స్థానాలలో రెండింటిలో విజయకేతనం ఎగుర వేస్తుంది. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న రెండు స్థానాలలోనూ గెలపు తథ్యం.  అంటే తెలుగుదేశం కూటమి 18 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ కేవలం ఏడు స్థానాలలో మాత్రమే గెలుపొందే అవకాశాలున్నాయి. 

దాదాపుగా ఇవే ఫలితాలు అసెంబ్లీ నియోజకవర్గాలలోనే ప్రతిఫలించనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి 126 స్థానాలలో విజయం సాధిస్తుంది. అధికార వైసీపీ 49 స్థానాలతో సరిపెట్టుకుంటుంది. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, చంద్రబాబు సీఎంగా పదవీ పగ్గాలు చేపట్టడం ఖాయమని సర్వే తేల్చింది. 

తెలుగుదేశం 144 అసెంబ్లీ నియోజకవర్గాలలో, జనసేన 21, బీజేపీ పది స్థానాలలో అభ్యర్థులను నిలుపుతోంది. లోక్ సభ నియోజకవర్గాల ఫలితాలను బట్టి చూస్తే తెలుగుదేశం కనీసం 98 స్థానాలలో విజయం సాధిస్తుంది.  అయితే పరిస్థితులు వేగంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ గ్రాఫ్ మరింతగా పడిపోయే అవకాశాలున్నాయనీ, ఎన్నికల సమయానికి తెలుగుదేశం కూటమి సాధించే స్థానాల సంఖ్య పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ రాష్ట్రంలో పుంజుకోవడం వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశాలున్నాయని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటే ఆ మేరకు వైసీపీ మరింతగా నష్టపోవడం ఖాయమని చెబుతున్నారు.  

By
en-us Political News

  
తెలంగాణ గీతంలో చేయాల్సిన మార్పులు, చేర్పుల గురించి గీత రచయిత అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణితో రేవంత్ రెడ్డి చర్చించారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-9
మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్గీయులు మరోమారు మారణహోమానికి పాల్పడ్డారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు.
పసిఫిక్ దేశం పపువా న్యూ గినియాలోని ఎన్గా ప్రావిన్స్‌.లో కొండ చరియలు విరిగిపడి 670 మంది మరణించారు
బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను, తీవ్ర తుఫానుగా మారి బీభత్సం సృష్టించనుంది. ఈ తుఫాను బంగ్లాదేశ్ కేపుపారా కూ దక్షిణంగా 330 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ సాగర్ ఐలాండ్స్క 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న రెమాల్ ఉత్తర దిశగా కదులుతూ మరింత బలపడుతున్నది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల వేంకటేశ్వరుని దర్శనం కోసం తండోపతండాలుగా తరలివస్తున్నారు
రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు ఆదర్శంగా నిలవాల్సిన‌ ఏపీ సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి భూబ‌కాసురుడిలా మారారా? విశాఖలో దళితుల అసైన్డ్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు అప్ప‌నంగా మింగేయాలని ప్రయత్నించాడా? 2వేల కోట్ల రూపాయల భూముల‌ను కాజేసేందుకు స్కెచ్ వేశారా? అంటే అవున‌నే స‌మాధానమే వినిపిస్తోంది. జ‌వ‌హ‌ర్ రెడ్డి మ‌రో నెల‌రోజుల్లో సీఎస్ ప‌ద‌వి నుంచి రిటైర్డ్ కానున్నారు.. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌హాయ‌ స‌హ‌కారాల‌తో జ‌వ‌హ‌ర్ రెడ్డి కుమారుడు, ప‌లువురు వైసీపీ ముఖ్య‌నేత‌లు అసైన్డ్ భుముల‌ను కాజేసే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్‌లో వున్న టి.ఆర్.పి. గేమ్ జోన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-10
వీళ్ళంతా కవిత విషయంలో చాలా రిలాక్స్.గా వున్నారు. కానీ, ఒక్క మనిషి మాత్రం కవిత అరెస్టు అయినప్పటి నుంచి కుమిలిపోతూ వున్నారు. ఆమె ఎవరో కాదు.. కవిత మాతృమూర్తి శోభ!
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా శనివారం (మే 25) జరిగిన ఆరో విడత పోలింగ్ లో కాంగ్రెస్ అగ్రనేతలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అయినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు అపరిష్కృతంగానే ఉన్నాయి. ఆందోళ‌న‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే ప‌దేళ్ల త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలోని ప‌లు అంశాల‌కు కాలం చెల్లుతుంది. అయిదే ఏపీ నేత‌లు త‌మ‌కేమీ ప‌ట్ట‌న‌ట్లు త‌డిబ‌ట్ట వేసుకొని నిద్దుర‌పోతున్నారు.
ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత కేంద్రంలో ఎన్డీయే కూటమి కొలువుదీరినా ప్రధానిగా మోడీకి గతంలో ఉన్నంత సీన్ ఉండదా? అంటే ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి ఔనన్న మాటే వినిపిస్తోంది. గత ఎన్నికలలో బీజేపీ సొంతంగా గెలుచుకున్న సీట్ల కంటే ఈ సారి ఏ మాత్రం తగ్గినా మోడీ రీప్లేస్ మెంట్ విషయంలో బీజేపీలో, బీజేపీ పొలిటికల్ మెంటార్ అయిన ఆర్ఎస్ఎస్ లో విస్తృత చర్చ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.