గల్ఫ్ కు రోడ్డు మెటల్ గా అనంతపురం ఐరన్ ఓర్
Publish Date:Mar 12, 2012
Advertisement
గాలి అక్రమాల్లో కొత్త కోణం తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం అనంతపురం: గాలి జనార్దనరెడ్డి అంతూ పంతూ లేకుండా రాష్ట్ర సహజ వనరులకు దోచుకున్నాడు. కడపలో ఉక్కు కర్మాగారం పెడతానంటూ ముందస్తుగానే అనంతపురం గనుల్లో లక్షలాది టన్నుల ఐరన్ ఓర్ ను తవ్వి చైనా, మలేషియా వంటి దేశాలకు విక్రయించుకున్నాడు. ఇదంతా ఒక ఎత్తయితే ఈ అమూల్యమైన ఖనిజ సంపదను గల్ఫ్ లోని కొన్ని దేశాలకు రోడ్లు వేసేందుకు మెటల్ గా విక్రయించాడు. ఐరన్ ఓర్ లోని నాసికరం ఖనిజాన్ని దిగుమతి చేసుకోవడానికి చైనా నిరాకరించిది. అయితే అప్పటికే ఈ నాసికరం ఉక్కు లక్షలాది టన్నుల మేరకు తవ్వి ఉంచారు. అపారంగా పెరిగిపోయిన ఈ నిల్వలను ఏదోకరంగా విక్రయించి ఎంతో కొంత డబ్బు సంపాదించాలనే తపనతో రాష్ట్రంలో ఐదు బినామీ కంపెనీలను నెలకొల్పి వాటిలో రెండు కంపెనీలకు ఈ నాసిరకం ఐరన్ ఓర్ ను అమ్మినట్లుగా రికార్డుల్లో చూపాడు.
అనంతరం ఈ రెండు కంపెనీలు గల్ఫ్ లోని యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్, ఓమన్ తో ఒప్ప,ఒప్పందాలు చేసుకున్నాయి. అక్కడ రోడ్లు వేయడానికి కావలసిన మెటల్ కు బదులుగా నాసిరకం ఐరన్ ఓర్ ను అక్కడకు ఎగుమతి చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారు. ఈ ఐరన్ ఓర్ అంతా మొదట రైలుమార్గం ద్వారా కాకినాడ చేరి అక్కడనుంచి గుట్టుచప్పుడు కాకుండా నౌకల ద్వారా గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయింది. ఇలా వేలాది టన్నుల ఐరన్ ఓర్ గల్ఫ్ దేశాలకు రోడ్లు వేయడానికి ఉపయోగపడింది. ఈ భాగోతం గాలి జనార్ధనరెడ్డి అరెస్ట్ కావడానికి ముందువరకు నిరాటంకంగా జరుగుతూనే ఉంది. జనార్ధనరెడ్డి అరెస్ట్ అనంతరమే ఈ ఎగుమతులు ఆగిపోయాయి. ఉక్కు తయారీకి ఉపయోగించవలసిన రాష్ట్ర ఖనిజం ఇతరదేశాల్లో రోడ్లు వేయడానికి కంకరగా ఉపయోగించినప్పటికీ మన రాష్ట్ర పాలకులెవరూ కళ్ళు తెరవకపోవడం అత్యంత శోచనీయం.
http://www.teluguone.com/news/content/anathapuram-24-12561.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





