అనంత ఆంతర్యం ఏమిటి?
Publish Date:Mar 22, 2012
Advertisement
అనంతపురం ఇంపు అనంతవెంకటరామిరెడ్డి ఆంతర్యం అంతుపట్టక జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా అనంత అసెంబ్లీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఆశావహులు తలలుపట్టుకుంటున్నారు. అనంతపురం అసెంబ్లీ కాంగ్రెస్ టిక్కెట్ ను పలువురు నాయకులు ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఎవరికీ టిక్కెట్ దక్కాలన్నా ఎంపి అనంతవెంటకరామిరెడ్డి ఆశీస్సులు తప్పక ఉండాల్సిందే. నిజానికి అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయీ తమ కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి నిలపడానికి అనంతవెంకటరామిరెడ్డి ఇప్పటివరకు ఆసక్తి చూపలేదు. మరోవైపు టిక్కెట్ ఆశిస్తున్న నాయకుల్లో ఏ ఒక్కరికి కూడా ఆయన మద్దతు ప్రకటించలేదు. ఆయన మౌనం జిల్లా నాయకులకు కలవరాన్ని కలిగిస్తోంది. ఇక్కడ పోటీచేయడానికి కాంగ్రెస్ నాయకులు చవ్వా రాజశేఖరరెడ్డి, రాగే పరుశురామ్, కోగటం విజయభాస్కరరెడ్డి, రషీద్ అహ్మద్, మల్లిఖార్హున్, కలియులాఖాన్ ప్రయత్నిస్తున్నారు. నిజానికి వీరిలో కొంతమంది అనంతవెంకటరామిరెడ్డి కుటుంబంలో ఎవరో ఒకరికి టిక్కెట్ ఇస్తే పార్టీకి నష్టం కలుగుతుందని బహిరంగంగానే ప్రకటించారు. ఈ ప్రకటనలు అనంతవెంకటరామిరెడ్డికి బాధకలిగించినట్లు తెలిసింది. కానీ అధిష్టానం ఆదేశిస్తే అనంత కుటుంబంలో ఒకరు ఇక్కడ పోటీచేయడం ఖాయమని అనంత అనుచరులు అంటున్నారు. ఇదే జరిగితే పార్టీ టిక్కెట్ ను ఆశిస్తున్న ఇతర ఆశావహుల్లో కొందరు కాంగ్రెస్ పై తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. జిల్లాలో మరో ప్రముఖ నాయకుడు, మాజీ మంత్రి జె.సి.దివాకర్ రెడ్డి తన వర్గానికి చెందిన కె.విజయభాస్కరరెడ్డికి టిక్కెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఒకవేళ అతనికి టిక్కెట్ ఇవ్వకపోతే అనంతపురంలో బలమైన సామాజికవర్గానికి చెందిన పిఆర్పీ మాజీ నేత టిజె ప్రకాష్ ను బలపరుస్తున్నట్లు తెలిసింది. ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షుడు చవ్వా రాజశేఖరరెడ్డికి మంత్రి రఘువీరారెడ్డి ఆశీస్సులు ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అనంతలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి కత్తిమీద సాములా మారనుంది.
http://www.teluguone.com/news/content/anantapuram-assembly-constituency-24-12835.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





