ఆంధ్రా ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా తయారయ్యారేంటి?

Publish Date:Oct 11, 2024

Advertisement

విభజన కారణంగా 40 శాతం, జగన్ కారణంగా 60 శాతం నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కష్టాల నుంచి త్వరగా బయటపడాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలని ఆశిస్తున్నారా? ఎక్కువగా ఆశించకండి.. ఎందుకంటే ఎక్కువగా ఆశపడటం ఎందుకు... మళ్ళీ నిరాశకు గురవటం ఎందుకు? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శాయశక్తులా కృషి చేస్తోంది. కానీ, ప్రభుత్వానికి సహకరించడానికి చాలామంది సిద్ధంగా లేరు. ఐదేళ్ళపాటు ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిన జగన్ అండ్ కో, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జనం మీద పగబట్టారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకుండా వుండటానికి ఏం చేయాలో అవన్నీ చాపకింద నీరులా చేస్తూనే వున్నారు. జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పరువు పోయేవిధంగా, పెట్టుబడిదారులు వెనకడుగు వేసే విధంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. జగన్ అండ్ కో పరిస్థితి ఇలా వుంటే, కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఆంధ్రా ముఖం చూడటానికే ఇష్టం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినవాళ్ళ నుంచే నిరాదరణను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ ఏనాటికి అభివృద్ధి చెందుతుందో ఏంటో!

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర కేడర్‌కి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తెలంగాణలో ఉండిపోయారు. అదేవిధంగా తెలంగాణ కేడర్‌కి, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రలో వుండిపోయారు. ఆంధ్రలో వున్న తెలంగాణ అధికారులు ఎప్పుడెప్పుడు తెలంగాణకు వెళ్ళిపోవాలా అని ఎదురుచూస్తూ వున్నారు. తెలంగాణంలో వున్న ఆంధ్ర అధికారులు ఆంధ్ర పేరు చెబితేనే గిట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తెలంగాణను వదిలి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళడం ఇష్టం లేక న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు.

విభజన తర్వాత ఏపీకి కేటాయించినా కొంతమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తెలంగాణలో కొనసాగుతున్నారు. వారిలో వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, ప్రశాంతి... ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్త్, అభిషేక్ మహంతి వున్నారు. వీరిలో కొంతమంది వేరే రాష్ట్రాలకు చెందిన వారు అయినప్పటికీ, ఆంధ్రా కేడర్ అధికారులు. మరికొందరు ఆంధ్రా ప్రాంతంలోనే పుట్టి, పెరిగిన స్వచ్ఛమైన ఆంధ్రులు. చట్టపరంగా, న్యాయంగా అయితే, వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళాలి. కానీ, మేం వెళ్ళబోం అంటూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్)ని ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాల మేరకు ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళందరూ తెలంగాణలోనే కొనసాగుతున్నారు. తాజాగా వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్‌కే వెళ్ళి తీరాలని కేంద్రానికి చెందిన డిపార్ట్.మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డీఓపీటీ) ఆదేశించింది. సాధారణంగా అయితే డీఓపీటీ ఆదేశిస్తే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు చప్పుడు చేయకుండా చెప్పినట్టు వినాలి. కానీ, ఆంధ్రాకి వెళ్ళాల్సిన ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఆంధ్రాకి వెళ్ళడానికి ఎంతమాత్రం ఇష్టపడటం లేదు. డీఓపీటీ ఆదేశాల మీద కూడా కోర్టును ఆశ్రయించాలన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి, వడ్డించిన విస్తరి లాంటి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళడానికి అధికారులు బాధపడిపోతున్నారు. అలాగే ఏపీలో వున్న తెలంగాణ కేడర్ వాళ్ళు ఆనందోత్సాహాలతో తెలంగాణకు వస్తున్నారు. అక్కడి వారు ఇక్కడికి వస్తున్నారుగానీ, ఇక్కడి వాళ్ళు అక్కడకి వెళ్ళడానికి బాధపడిపోతున్నారు. మిగతా రాష్ట్రాల్లో పుట్టిపెరిగి, ఆంధ్రా కేడర్‌కి ఎంపికైన వాళ్ళ సంగతి అలా వుంచితే, ఆంధ్రాలో పుట్టి పెరిగిన రోనాల్డ్ రాస్, ఆమ్రపాలి కాటా, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, ప్రశాంతి లాంటి వాళ్ళు కూడా సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి విముఖత చూపించడం చాలా బాధాకరమైన విషయం. విభజన కారణంగా నష్టపోయిన తమ సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమవంతు పాత్రను పోషించాలన్న కనీస బాధ్యత కూడా లేకుండా ఈ అధికారులు వ్యవహరిస్తూ వుండటం దురదృష్టకరం. ఒకవేళ భవిష్యత్తులో వీళ్ళు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాల్సిందే అనే పరిస్థితి వస్తే, వీళ్ళు ఏపీలో బాధ్యతలు తీసుకున్నా పూర్తిస్థాయి అంకితభావంతో పనిచేస్తారా అనే సందేహాలు వున్నాయి.

By
en-us Political News

  
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.