Publish Date:Nov 19, 2019
అమ్మ ఒడి పథకానికి సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. 75% హాజరు ఉంటేనే పథకం కింద ప్రయోజనం పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల, పన్ను చెల్లించే వారి పిల్లలకు అమ్మ ఒడి లేదు. ఏపీ సర్కార్ వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసింది. ఈ నెలాఖరు నాటికి విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని తెలిపింది.ఒకవేళ అంత కంటే తక్కువ హాజరువుంటే ప్రధానోపాధ్యాయులు నిశిత పరిశీలన చేసి హజరు తగ్గటానికి విద్యార్థి లోపం లేదని పరిగణనలోకి తీసుకోవచ్చని సిఫార్సు చేస్తే పథకం వర్తింపజేస్తామని స్పష్టం చేసింది.
అదే విధంగా ప్రభుత్వం నుంచి పింఛన్ తీసుకుంటున్న మాజీ ఉద్యోగుల పిల్లలకు అమ్మ ఒడి ఉండదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వ.. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపు దారుల పిల్లలు ఈ పథకం కింద అర్హులు కాదని తెలిపింది. దారిద్య రేఖకు దిగువ ఉండి తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కలిగిన వారు అమ్మఒడికి పూర్తి అర్హులని ప్రభుత్వం వివరించింది. ఈ కార్యక్రమం కోసం డీఈవో కార్యాలయంలో 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశించారు.
అమ్మఒడి కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 13జిల్లాలకు పర్యవేక్షకులను నియమించారు. పాఠశాల చైల్డ్ ఇన్ఫోలో నమోదైన విద్యార్థుల వివరాలను ప్రతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు క్షుణ్ణంగా పరిశీలించి ఈ నెల 19లోగా నిర్థారించాలి. ఆ జాబితాను గ్రామ సచివాలయంలోని విద్య సంక్షేమ సహాయకునికి ఈ నెల 24న పంపాలి. ఈ జాబితాను 25వ తేదీ నాటికి గ్రామ సచివాలయం నోటీసు బోర్డులో పెట్టాలి. వీటి పై అభ్యంతరాలను మూడు రోజుల్లో సేకరించి తెలియజేయాలి. ఆధార్ లేని విద్యార్థుల వివరాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 1వ తేదీలోగా సేకరించి హెచ్ ఎం అందించాలి. ముసాయిదా జాబితాకు డిసెంబరు 15 నుంచి 18వ తేదీలోగా గ్రామ సభ ఆమోదం పొందాలి. ఈ జాబితాను ప్రధానోపాధ్యాయుడు ఎంఈవో ద్వారా పీవోకు డిసెంబర్ 23 లోగా అందించాలి. బిఈవో డిసెంబర్ 24 నాటికి కలెక్టర్ ఆమోదం కోసం సమర్పించాలని ప్రభుత్వం ప్రణాళిక విడుదల చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amma-vodi-scheme-eligibility-details-39-91329.html
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.