ఢిల్లీ పేలుడుపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

Publish Date:Nov 11, 2025

Advertisement

ఎర్రకోట సమీపంలో  సోమవారం (నవంబర్ 10) జరిగిన  పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం (నవంబర్ 11)  ఉన్నత స్థాయి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘటనపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అమిత్ షా తెలుసుకున్నారు. భద్రతా చర్యలను మరింత బలపరిచే దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

దర్యాప్తు పురోగతిలో ఉందనీ, ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవనీ అమిత్ షా చెప్పారు. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో  డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ  డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాఠే హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఇలా ఉండగా  ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో  ఈ పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఎర్రకోట మెట్రో స్టేషన్ ను అధికారులు మూసి వేశారు.  ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్,ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ బృందాలు దర్యాప్తు ప్రారం భించా యి. భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ కు 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేత తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మెట్రో స్టేషన్ ను తెరుస్తామన్నారు. కీలక ఆధారాల సేకరణకు ఇబ్బందులు తతెల్తకూడాదన్న ఉద్దేశంతో తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
తిరుపతి జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఒక ఘటనపై చంద్రబాబు స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలందుకుంటోంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అనుచరులు టోల్ ప్లాజా సిబ్బందిపై దౌర్జన్యానికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కఠినంగా స్పందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.