అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక వ్యక్తి రాక్షసుడిగా మారి కుటుంబ సభ్యులను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. ఈ ఘటనలో నిందితుడితో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని అయోవా రాష్ట్రం మస్కటీన్ నగరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మస్కటీన్ నగరాన్ని ఈ దారుణ ఘటన ఒక్కసారిగా కుదిపేసింది. సోమవారం (జూన్ 1)మధ్యాహ్నం మస్కటీన్లోని పార్క్ అవెన్యూలో ఉన్న ఓ నివాస గృహంలో కాల్పులు జరుగుతున్నాయంటూ స్థానిక పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వారు ఆ ఇంటి లోపలికి వెళ్లి చూసేసరికి అక్కడ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రక్తపు మడుగులో తుపాకీ గాయాలతో పడి ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వారు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించారు.
పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, ఈ ఘోరానికి ఒడిగట్టిన నిందితుడిని మస్కటీన్ నగరానికి చెందిన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. ఆ నలుగురిని హతమార్చిన తర్వాత నిందితుడు మెక్ఫార్లాండ్ అక్కడి నుండి వేగంగా పరారయ్యాడు. అతని కోసం పోలీసులు నగరవ్యాప్తంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరకు మిస్సిసిపీ నది వెంబడి ఉన్న ఒక రివర్ఫ్రంట్ ట్రయిల్లో నిందితుడు ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. పోలీస్ అధికారులు అతనిని చుట్టుముట్టి, లొంగిపోవాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగానే, ఊహించని విధంగా మెక్ఫార్లాండ్ తన వద్ద ఉన్న తుపాకీతో స్వయంగా కాల్చుకున్నాడు. పోలీసులు, అత్యవసర వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, తీవ్ర గాయాలపాలైన నిందితుడిని కాపాడలేకపోయారు. అతడు అక్కడికక్కడే మరణించాడు.
అయితే ఈ దారుణం ఇంతటితో ఆగలేదు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నగరంలో మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, మరో రెండు వేర్వేరు చోట్ల మరో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒక మృతదేహం మిల్ స్ట్రీట్లోని ఒక నివాసంలో దొరకగా, మరొకటి గ్రాండ్వ్యూ అవెన్యూలోని ఒక వ్యాపార సంస్థ ప్రాంగణంలో పడి ఉంది. ప్రాథమిక విచారణలో తేలిందేమిటంటే, చనిపోయిన ఆరుగురు వ్యక్తులు కూడా నిందితుడైన 52 ఏళ్ల ర్యాన్ విల్లీస్ మెక్ఫార్లాండ్ కుటుంబ సభ్యులే. కుటుంబ తగాదాల కారణంగానే ఈ ఘోరం జరిగినట్లు తేలింది. నిందితుడికి గతంలో కూడా నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amily-murdered-and-killer-commits-suicide-36-221470.html
గర్భాలయం, అర్థమండపం, మహామండపలతో, కప్పుల వరకు ఉన్న ఆలయం, కాకతీయ వాస్తు శిల్పానికి అర్థం పడుతుందనీ, కప్పురాళ్లు, గోడలు కూలిపోయి, చుట్టూ చెట్లు పొదలు పెరిగి, ఆలయం ఉనికికే ప్రమాదం ఏర్పడిందని, ఆలయాన్ని ఊడదీసి, ఆధునిక పునాదులపై పునర్నిర్మించి, వారసత్వ సంపదగా కాపాడి, భవిష్యత్ తరాలకు అందించాలని గ్రామ ప్రజలకు, జిల్లా యంత్రాంగానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
విమానాన్ని వెంటనే తిరిగి విమానాశ్రయానికి మళ్లించి, భద్రతా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ మహిళను అవుట్పోస్ట్ పోలీస్ సిబ్బందికి అప్పించారు. వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రయాణికులకు, విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ఎన్బీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మీట్ ది ప్రెస్ టాక్ షో లైవ్ ఇంటర్వ్యూలో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురై.. షో హోస్ట్, సీనియర్ మహిళా యాంకర్ క్రిస్టెన్ వెల్కర్పై దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. తన చేతిలో ఉన్న మైక్రోఫోన్ను లైవ్ కెమెరాల ముందే నేలపైకి విసిరికొట్టి, ఇంటర్వ్యూను మధ్యలోనే బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ ఉదంతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది.
బీహార్ లోని ఔరంగాబాద్ సమీపంలో జాతీయ రహదారి పై వీరు ప్రయాణిస్తున్న బస్సును గుర్తు తెలియని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ వైపు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. దీంతో బస్సు ఎడమ వైపున సీట్లలో కూర్చున్న ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు.
ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. దీంతో ఒక్కసారియా వెస్ట్ ఆసియా అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ఆకస్మిక క్షిపణి దాడులతో జనం తీవ్ర భయాందోళనల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత షెల్టర్లలోకి పరుగులు తీశారు.
నైరుతి తెలంగాణ ప్రవేశం మరో రెండు మూడు రోజుల తరువాతేనని వాతావరణ శాఖ పేర్కొంది. జూన్ 10 నుంచి 12 మధ్య రైరుతి రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్ డేట్ ఇచ్చింది.
కెప్టెన్గా గిల్ బ్యాటింగ్ సగటు సుమారు 82.8కి చేరింది. ఇప్పటివరకు టెస్ట్ చరిత్రలో కెప్టెన్గా వెయ్యికి పైగా పరుగులు చేసిన 101 మంది ఆటగాళ్లలో ఒక్క డాన్ బ్రాడ్మన్ మాత్రమే గిల్ కంటే ఎక్కువ సగటు 99.94 కలిగి ఉన్నారు.
భాగ్యనగర ప్రజలకు అలర్ట్. నగరంలోని నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కీలక సూచనలు చేసింది.
తెలంగాణ క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి తెరలేచింది
హైదరాబాద్ నగర గుండెకాయ లాంటి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సరికొత్త ప్రస్థానానికి సిద్ధమైంది.
న్యూ చండీగఢ్ వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పరుగుల పండగ చేసుకుంది.
తనను చూడాలని ఉందటూ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వృద్ధుడి వీడియోపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు.