Publish Date:Jul 14, 2026
తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్.. వేద నిలయంను తన నివాసంగా చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చెన్నై నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన నివాసంలోకి మారేందుకు విజయ్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నివాసం గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జె. జయలలిత అధికారిక నివాసం అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వేదనిలయాన్ని కొనుగోలు చేసే ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు చెబుతున్నారు. . పోయెస్ గార్డెన్ (Poes Garden) లో ఉన్న ఈ చారిత్రాత్మక బంగ్లాను 350 కోట్లకు కొనుగోలు చేసి, ఆ భవనాన్ని తన నివాసంగా మార్చుకు ఉద్దేశంలో విజయ్ ఉన్నట్లు తమిళ మీడియాలో విస్తృతంగా ప్రచారమౌతోంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తమిళనాడు రాష్ట్ర అధికార కేంద్రంగా, కీలక నిర్ణయాలకు వేదికగా నిలిచిన వేద నిలయం ఇప్పుడు కొత్త రాజకీయ శకానికి సాక్ష్యంగా నిలవబోతుందా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక క్రమశిక్షణ గల పాలకుడిలా సచివాలయంలో విధులు నిర్వర్తిస్తున్న విజయ్.. నీలాంకరి నుంచి ప్రతిరోజూ దాదాపు 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణం కారణంగా చెన్నై నగరంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు సాధారణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ ట్రాఫిక్ కష్టాలకు స్వస్తి పలికి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికే సచివాలయానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలో ఉండే పోయెస్ గార్డెన్లోకి మారాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వేద నిలయం 24 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిని జయలలిత ఆమె తల్లి సంధ్యతో కలిసి 1967 జూలైలో కేవలం రూ. 1.32 లక్షలకు కొనుగోలు చేశారు. 1968 మే 15న గృహప్రవేశం చేసిన నాటి నుంచి 2016 డిసెంబర్లో ఆమె కన్నుమూసేంత వరకు ఈ నివాసమే తమిళ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండేది. అయితే జయలలిత మరణానంతరం ఈ ఇల్లు న్యాయవివాదాల్లో చిక్కుకుంది. ప్రభుత్వ స్మారక కేంద్రంగా మార్చాలనే ప్రతిపాదనలు వచ్చినా.. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మద్రాసు హైకోర్టు దీనిని ఆమె వారసులైన జె. దీప, జె. దీపక్లకు అప్పగించింది. ఇప్పుడు విజయ్ ఈ ఇల్లు కొనుగోలు చేయడానికి సిద్ధమై ఆ వారసులతో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
poes garden house, jayalalithaa veda nilayam buying, vijay buy jaya home 350 crore, thalapathy vijay new residence chennai
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amil-nadu-cm-vijay-to-shift-residence-from-neelankarai-to-veda-nilayam-25-225966.html
Publish Date:Aug 10, 2026
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.