Publish Date:Aug 31, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది డిసెంబర్ లో భారత్ లో జరపాల్సిన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది చివరిలో ఇండియాలో జగరనున్న క్వాడ్ సదస్సులో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆయన దానిని రద్దు చేసుకున్నారు. భారత్ పై ట్రంప్ టారిఫ్ వార్.. ప్రతిగా ప్రధాని నరేంద్రమోడీ చైనా పర్యటన నేపథ్యంలో ట్రంప్ టూర్ రద్దు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలు ఆపరేషన్ సిందూర్ తరువాత నుంచి భారత్ - అమెరికాల మధ్య సంబంధాలు ఒకింత చెడ్డాయనే చెప్పాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని పదే పదే చెప్పుకుంటూ తనకు తానే శెహభాష్ అంటూ భుజ కీర్తులు తగిలించేసుకుంటున్న ట్రంప్ కు పాకిస్థాన్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం ప్రమేయం ఇసుమంతైనా లేదనీ, పాక్ బతిమలాడుకుని కాళ్ల బేరానికి రావడం వల్లనే సీజ్ ఫైర్ కు అంగీకరించామనీ భారత్ కుండబద్దలు కొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మింగుడు పడలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అలాగే రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో కూడా ట్రంప్ అభ్యంతరాలను ఇండియా ఇసుమంతైనా ఖాతరు చేయకపోవడంతో కంగుతిన్న అమెరికా అధ్యక్షుడు భారత్ పై అదనపు సుంకాలు విధించారు. దీనిని కూడా లేక్క చేయని ఇండియా రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో తగ్గేదే లే అని చేతల ద్వారా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మోడీతో చర్చించేందకు ట్రంప్ పలు మార్లు ఫోన్ చేశారనీ, అయితే ఆ ఫోన్ కాల్స్ కు మోడీ స్పందించలేదనీ వార్తలు వినవచ్చాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లడంతో ట్రంప్ తన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/america-president-india-tour-cancil-39-205346.html
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.