Publish Date:Jul 11, 2026
ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టించిన యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్ట్ వ్యవహారం వైసీపీ తీరు రోజుకో రకంగా మారుతోంది. ప్రశ్న రావణ్ విషయంలో వైసీపీ ఎప్పుడు ఏం మాట్లాడుతోంది, ఏ క్షణంలో ఏ ప్రకటన చేస్తుందన్న విషయం ఆ పార్టీకైనా తెలుసా? అన్న అనుమానాలు పోలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తమౌతున్నాయి. ఈ క్రమంలోనే వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి తెరలేపాయి. ప్రశ్న రావణ్ కేసుపై స్పందించిన అంబటి రాంబాబు.. రావణుడే గెలుస్తాడు.. మేము గెలిపిస్తాం అంటూ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
వాస్తవానికి గత కొద్దిరోజులుగా ప్రశ్న రావణ్ ఎపిసోడ్లో వైసిపి సోషల్ మీడియా తీవ్ర అయోమయంలో పడినట్లు కనిపించింది. ఒక దశలో ప్రశ్న రావణ్ గతంలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడిన పాత వీడియోలను షేర్ చేస్తూ, అతను టిడిపి సానుభూతిపరుడంటూ వైసిపి ప్రచారం చేసింది. ఇప్పుడు.. ఇప్పుడు మాట మార్చి ప్రశ్న రావణ్ ను వెనకేసుకొస్తూ వైసీపీ అగ్రనేతలు మాట్లాడుతున్నారు. ఒకరోజు టిడిపి మనిషి అని ముద్ర వేసి, ఆ మరుసటి రోజే అతనికి పూర్తి స్థాయిలో అండగా నిలబడటం విస్మయ పరుస్తోంది. పైగా మాజీ మంత్రి అంబటి ఒక అడుగు ముందుకు వేసి.. రావణుడిని గెలిపిస్తామనడం వివాదాస్పదంగా మారింది. ప్రశ్న రావణ్ భావజాలానికీ, వైసీపీ సిద్ధాంతాలకూ సంబంధం లేదన్న అంబటి.. అతని మీద అన్యాయంగా కేసులు పెట్టి సోషల్ మీడియా గొంతు నొక్కాలని,చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. ఈ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు.. రావణుడిని మేము గెలిపిస్తామన్నారు.
సామాజిక మాధ్యమాల్లో తీవ్రమైన ద్వేషాన్ని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు గత వారం ప్రశ్న రావణ్ను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించిన సంగతి తెలిసిందే. సమాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రావణుడిని గెలిపిస్తామనడమంటే.. తాము రాక్షసుడి పక్కన నిలబడినట్లు అంగీకరించడమే అవుతుందని చెబుతున్నారు. మొత్తం మీద అంబటి రాంబాబు రావణుడిని గెలిపిస్తామంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ ట్రోల్ అవుతున్నాయి.
Ambati Rambabu, Prashna Ravan, YCP Strategy, Prashna Ravan Arrest, AP Political News, Telugu YouTuber Arrest
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-support-ravana-39-225691.html
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో యూనిట్ ఇంఛార్జ్లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.