Publish Date:Feb 19, 2025
మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. తన అమోఖమైన వాదనా పటిమతో జగన్ గుంటూరు మిర్చియార్డ్ పర్యటనను సమర్ధించుకున్నారు. ఇందు కోసం ఆయన ఎన్నికల నియమావళికి సైతం కొత్త భాష్యం చెప్పారు. ఎన్నికల కోడ్ అనేది కేవలం ఎన్నికలలో పోటీ చేసే పార్టీలూ, అభ్యర్థులకు మాత్రమే వర్తిస్తుందని సెలవిచ్చారు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఆ ఎన్నికలలో పోటీలో లేని వైసీపీకి ఆ కోడ్ వర్తించదని అంబటి రాంబాబు వాదిస్తున్నారు.
వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. కృష్ణా గుంటూరు గ్రడ్యుయూట్ కాన్సిట్యుయెన్సీ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. ఆ కారణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియార్డ్ సందర్శనకు అనుమతి నిరాకరించింది. అయినా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి వేలాది మందితో ప్రదర్శనగా మిర్చియార్డ్ కు వెళ్లి హల్ చల్ చేశారు. రాజకీయ ప్రసంగం చేశారు. చంద్రబాబు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేశారు.
అలా నియమావళిని ఉల్లంఘించి జగన్ గుంటూరులో పర్యటించడానికి ఎన్నికల కోడ్ కు సంబంధం లేదంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ఎక్కడైనా సరే ఎన్నికల కోడ్ అనేది ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకే వర్తిస్తుందనీ, పోటీకి దూరంగా ఉన్న పార్టీలకు కాదనీ భాష్యం చెప్పి తన అజ్ణానాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నారు. ఎన్నికలు జరిగే ప్రాంతం మొత్తానికి ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ఫలానా రాజకీయ పార్టీ పోటీలో లేదు కనుక ఆ పార్టీకీ, ఆ పార్టీ వ్యక్తులకు అది వర్తించకుండా మినహాయింపు లేదు. సభలూ, సమావేశాలు నిర్వహించకూడదు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టకూడదు. అనుమతి లేకుండా ప్రదర్శనలు నిర్వహించకూడదు. ఈ విషయం కూడా తెలియకుండానే అంబటి రాంబాబు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ambati-ignorence-or-oversmart-39-193105.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.