గ్లోబల్ క్యాపిటల్ అమరావతి.. చంద్రబాబు సింగపూర్ టూర్ లక్ష్యం అదేనా?

Publish Date:Jun 15, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్  అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. లోక్‌సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధమైన రాజధాని హోదా దక్కిన కొద్ది రోజుల వ్యవధిలోనే..  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ చారిత్రాత్మక విజయానికి క్షేత్రస్థాయిలో  అభివృద్ధికి మెరుగులు దిద్దేందుకు నడుంబిగించారు. ముఖ్యంగా రాజధాని అమరావతిని గ్లోబల్ క్యాపిటల్ స్థాయికి చేర్చేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. అంతే కాకుండా వాటిని అమలు చేయడానికి రంగంలోకి దిగారు.  

ఆయన తాజా సింగపూర్ పర్యటన లక్ష్యం అదేనని విశ్వసనీయగా తెలుస్తోంది.  అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడం..  భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను  ఆకర్షించడం, అలాగే  గ్లోబల్ ఫండింగ్ పూల్స్ ద్వారా నిధులను సమీకరించడమే ఈ పర్యటన లక్ష్యంగా తెలుస్తోంది. 

ఈ పర్యటనలో ముఖ్యమంత్రితో పాటు  మంత్రి పి. నారాయణ, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ సీఆర్డీయే  ఉన్నతాధికారులతో కూడిన బృందం ఉంది. అమరావతి నిర్మాణ వేగాన్ని పెంచడానికి,  ప్రపంచ స్థాయి మౌలిక వసతులను తీసుకురావడానికి ఈ పర్యటన  కీలకంగా చెబుతున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్,  అక్కడి సీనియర్ క్యాబినెట్ మంత్రులతో చంద్రబాబు నేరుగా చర్చలు జరపనున్నారు. ఈ ప్రభుత్వాల మధ్య ప్రత్యక్ష సహకారం అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అమరావతి భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కానుందని ఆయన విశ్వసిస్తున్నారు.

కార్పొరేట్ రంగంలో గ్లోబల్ లీడర్లతో పెట్టుబడుల వేట కూడా చంద్రబాబు పర్యటన లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  జిఐసి  ఎగ్జిక్యూటివ్ కమిటీ సలహాదారు లిమ్ సియాంగ్ గువాన్, వైసిహెచ్ ( గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్, గూగుల్ క్లౌడ్ ఆసియా, పసిఫిక్ ప్రెసిడెంట్ కరణ్ బజ్వా వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం భేటీలు ఈ లక్ష్యంలో భాగంగానే చెబుతున్నారు. అలాగే..  గతంలోనే అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న ప్రముఖ సంస్థ  సుర్బానా జురాంగ్ ప్రతినిధులతో కూడా చంద్రబాబు  మౌలిక వసతుల టైమ్‌లైన్‌ను పునఃసమీక్షించనున్నారు.

ప్రపంచ నగరాల సదస్సు,  సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికలపై ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా చంద్రబాబు ప్రెసెంట్ చేసి,   అమరావతి మెగా డెవలప్‌మెంట్‌కు పూర్తిగా సిద్ధంగా ఉందనే బలమైన సంకేతాన్ని ప్రపంచ మార్కెట్‌కు పంపడమే ఆయన సింగపూర్ పర్యటన ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. 

By
en-us Political News

  
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్ టెక్నాలజీ సంచలనాలు సృష్టిస్తోంది. అమెరికా రెడీమేడ్ డ్రోన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయో, ఉక్రెయిన్ 250 కిలోమీటర్ల రేంజ్ ఏఐ డ్రోన్లతో రష్యాను ఎలా దెబ్బతీస్తుందో ఇక్కడ తెలుసుకోండి.
అనారోగ్యం లేదా ప్రమాదం వల్ల ఉద్యోగానికి వెళ్లలేనప్పుడు మీ నెలవారీ ఆదాయాన్ని కాపాడే ఆదాయ రక్షణ బీమా (Income Protection Insurance) గురించిన టాప్ 5 అపోహలను మరియు వాటి వెనుక ఉన్న అసలు నిజాలను నిపుణుల సర్వే గణాంకాలతో సహా ఇక్కడ తెలుసుకోండి.
అంతర్జాతీయ శాంతి ఒప్పందంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల పంట పండింది. సెన్సెక్స్ 1,100 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24,000 మార్కు వైపు దూసుకెళ్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్-ఇ లో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఈక్వెడార్‌పై ఐవరీ కోస్ట్ 1-0తో ఘన విజయం సాధించింది. 90వ నిమిషంలో అమాద్ డియాల్లో కొట్టిన సంచలన గోల్ ఈక్వెడార్ 19 మ్యాచ్‌ల అజేయ రికార్డును ముగించింది. మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును బద్దలు కొట్టి, టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయ బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ రికార్డు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యాపిల్ సంస్థ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ (iPhone Fold) విడుదలకు సిద్ధమవుతోంది. ఐఓఎస్ 27 కోడ్‌లో లీకైన క్రేజీ ఫీచర్లు, స్క్రీన్ సైజులు, కెమెరా మరియు లాంచ్ డేట్ వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
ముక్కోణపు సిరీస్‌లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ‘ఎ’ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్ పవర్ ప్లే లోనే అవుట్ అయ్యారు. తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దుతున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గి, నిఫ్టీ 24 వేల మార్కును దాటిన వేళ ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? మార్కెట్ దిగ్గజం సుదీప్ బందోపాధ్యాయ్ సూచించిన ఫార్మా, మెటల్స్ మరియు ఏషియన్ పెయింట్స్ స్టాక్ విశ్లేషణ మీకోసం.
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందంతో భారత స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయిలో లాభపడ్డాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో ఎల్‌అండ్‌టీ, హెచ్‌పీసీఎల్, అదానీ పోర్ట్స్ వంటి ప్రముఖ షేర్లు ఎందుకు దూసుకుపోతున్నాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
భారత్-అమెరికా మధ్య కుదిరిన సరికొత్త వాణిజ్య ఒప్పందం వల్ల టారిఫ్స్ 18 శాతానికి తగ్గాయి. అయితే 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్ల నిబంధనతో భారతీయ మార్కెట్లకు, రైతులకు ఎలాంటి ముప్పు పొంచి ఉందో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జూన్ 15 సోమవారం దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో నేటి లేటెస్ట్ 22 క్యారట్, 24 క్యారట్ గోల్డ్ రేట్ల వివరాలు ఇక్కడ చూడండి.
ఆర్థిక సంవత్సరం 2026-27 ఐటీఆర్ ఫైలింగ్ వేళ మీ వార్షిక ఆర్థిక సమాచార నివేదిక (AIS) ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకోండి. ఫామ్ 16, ఫామ్ 26AS మరియు ఏఐఎస్ ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలను మరియు సులభమైన డౌన్‌లోడ్ విధానాన్ని ఇక్కడ చూడండి.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ చేతిలో పాకిస్థాన్ 64 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. ఈ పరాజయంపై పాక్ కెప్టెన్ ఫాతిమా సనా సంచలన వ్యాఖ్యలు చేసింది. పవర్‌ప్లేలో ఆధిపత్యం సాధించినా, సీనియర్ల ఫీల్డింగ్ తప్పిదాలు మరియు బ్యాటింగ్ వైఫల్యం వల్లే ఓడిపోయామని అంగీకరించింది. పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.