ఆంధ్రప్రదేశ్ అమరావతిలో పాలనా భవనాల నిర్మాణానికి రూ.3,673 కోట్ల చేపట్టే పనులకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని సంబంధిత సంస్థలను సీఆర్డీఏపై సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రూ.882 కోట్లతో పాలనా భవనం నిర్మాణ టెండర్ను ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. రూ.1,467 కోట్లతో టవర్ 1, 2 నిర్మాణాలను షాపూర్జీ పల్లోంజి సంస్ధ చేపట్టనుంది.
మరో రూ.1,393 కోట్లతో టవర్ 3, 4 నిర్మాణ టెండర్లు ఎల్అండ్టీ సంస్థ దక్కించుకుంది. టెండర్లు దక్కించుకున్న సంస్థలు వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పాలన సులభం చేసేందుకే భవనాలన్నీ ఒక చోట కట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. న్యాయపరమైన సమస్యలు లేకుండా టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. ‘‘ పెట్టుబడులు రావాలంటే 5 వేల ఎకరాలతో విమానాశ్రయం అవసరం. స్మార్ట్ ఇండస్ట్రీస్, అంతర్జాతీయ క్రీడానగరానికి 34 వేల ఎకరాలు సరిపోదు.3 ప్రాజెక్టులకు ప్రజాభిప్రాయం మేరకు భూ సేకరణ చేస్తాం. 24 వేల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. ఇప్పటి వరకు భూ సమీకరణ నిబంధనలు 217చ.కి.మీ వరకే ఉన్నాయి. నిబంధనల పరిధిని పెంచేందుకు సీఆర్డీయే నిర్ణయం తీసుకుంది.’’ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati-39-199163.html
ఇంగ్లాండ్తో బర్మింగ్హామ్లో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ 587 పరుగులకు ఆలౌటైంది.
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు.
ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ఫోర్టులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ, రెండుగా చీలిపోయిందా? అంటే, విశ్లేషకులు అవుననే అంటున్నారు. మంత్రి కొండా సురేఖ అండ్ ఫ్యామిలీ ఒక జట్టుగా, మిగిలిన ఎమ్మెల్యేలు మరో జట్టు హస్తం పార్టీ రెండుగా చీలి పోయిందని, మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడి ప్రియుడితో కలిసి తన సంవత్సన్నర వయస్సు గల కూతురిని చంపిన కేసులో ఇద్దరు ముద్దయిలకు జీవిత కాలం ఖైదు మరియు 5 వేల రూపాయల జరిమానా విధించారు.
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు అస్వస్థతకు గురియ్యారు. ఆయన సీజనల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారు.
కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని తోమాల సేవ, అభిషేక సేవలలో కూర్చుని తనివి తీరా చూడాలని భావించిన వారి కోరిక ఫలించలేదు
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు.
ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్ప్రాష్ లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది.
అంగన్వాడీ హెల్పర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందేందుకు ఉన్న గరిష్ఠ వయోపరిమితిని 45 నుంచి 50 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రఖ్యాత ఫుట్బాల్ క్లబ్ లివర్పూల్ స్టార్ ఆటగాడు డియోగో జోటా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.