Publish Date:Jun 23, 2025
గత పాలకులు విధ్వంసం సృష్టించారని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేశ్ విమర్శించారు. ఏపీలో ఎన్డీయే కూటమి ఏడాది పాలన సందర్భంగా అమరావతిలో నిర్వహిస్తున్న సుపరిపాలన-తొలి అడుగు సదస్సులో లోకేశ్ మాట్లాడారు. వైసీపీ హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఎక్కువ మొత్తంలో పింఛను ఇస్తున్నామని. తల్లికి వందనం పేరుతో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆర్థిక సాయం చేస్తున్నామని తెలిపారు. తొలి ఏడాదిలోనే డీఎస్సీ ద్వారా 16,300 పోస్టులు భర్తీ చేస్తున్నామని లోకేశ్ స్పష్టం చేశారు.పేదలకు చేయూత ఇచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని ఏ రాష్ట్రానికి వెళ్లినా పీ-4 విధానాన్ని ప్రశంసిస్తున్నారు.
పొగాకు, మిర్చి, మామిడి, కోకో రైతులను ఆదుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయలసీమకు అనేక పరిశ్రమలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు టీసీఎస్, కాగ్రిజెంట్ సంస్థలను తీసుకొచ్చాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోంది. అభివృద్ధిలో డబుల్ ఇంజిన్ సర్కారు దూసుకుపోతోందని మంత్రి వెల్లడించారు. వైసీపీ నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోదు. ప్రశ్నిస్తే చాలు లాఠీ దెబ్బలు, అరెస్టులు వేధింపులు గురిచేసే వారని లోకేశ్ పేర్కొన్నారు. నియంత పాలన నుంచి ప్రజలకు నిజమైన స్వాతంత్రర్యం వచ్చిందని తెలిపారు. ఈ కార్య క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/amaravati-39-200524.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.