అమరావతి నిర్మాణానికి 17.05 ఎకరాల భూమిని అందజేసిన రైతు..!

Publish Date:Jul 16, 2026

Advertisement

 

ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు  కుటుంబం ఉదారత.. !

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అనుమోలు వెంకట నాగవర్ధన సాయి బిపిన్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకు వచ్చారు.

రాయపూడి గ్రామ పరిధిలో తమ కుటుంబానికి చెందిన 17.05 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణ అవసరాల కోసం ఏపీ సీఆర్‌డీఏకు అందజేసేందుకు తమ సమ్మతిని తెలియజేస్తూ సంబంధిత అంగీకార పత్రాలను కాంపిటెంట్ అథారిటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. భాగ్యరేఖకి అందజేశారు.

ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ, ఐఏఎస్ సమక్షంలో రాయపూడిలోని ఏపీ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సాయి బిపిన్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. రాజధాని గ్రామాల ప్రజలు కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు ఏపీ సీఆర్‌డీఏ అధికారులకు సహకరించాలని వారు కోరారు.

Amaravati, Amaravati Capital Construction, APCRDA, Land Pooling Scheme, Land Pooling, Land Acquisition, Rayapudi Farmers, 17.05 Acres of Land, APCRDA Officials
 

By
en-us Political News

  
ముద్రగడ పద్మనాభం మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ శకానికి ముగింపు పలికింది.
నువ్వు ముస్లిమేనా? అంటూ దుండగడు 15 కత్తి పోట్లు పొడిచాడు..
రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని సీఎం చంద్రబాబు తెలిపారు.
దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్షాల మధ్య సరికొత్త రాజకీయ పోరు మొదలైంది.
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థుల తల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత తీపి కబురు అందించింది.
ఆషాఢ మాస బోనాల పండుగ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదంబ మహంకాళి అమ్మవారిని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ దర్శించుకున్నారు.
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.