ఎర్రబస్సు రాదన్న చోటకు.. ఎయిర్ బస్సు వచ్చింది..అర్థమైందా రాజా..! : మంత్రి లోకేష్

Publish Date:Aug 1, 2026

Advertisement

 

మోదీ వికసిత్ భారత్... సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం..!

కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన‌ వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధాన‌మే అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవం. ఎర్రబస్సు రాదు అన్నచోటకి ఎయిర్ బస్ వచ్చింది. ఎర్రబస్సు రాదు అన్న చోటకి ఏకంగా మన నమో వచ్చారు. ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్దమైందా రాజా..` అంటూ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఉత్తేజ‌భ‌రితంగా ప్ర‌సంగించారు. భోగాపురం అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవ సభలో ప్రధాని న‌రేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ పాల్గొన్నారు. 

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలిచ్చిన నమో..!

ఎయిర్ పోర్టు ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ... స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావీరుడు అల్లూరి సీతా రామరాజు నడయాడిన గొప్ప నేల ఉత్తరాంధ్ర. ఈ రోజు నుంచి ఈ నేల చరిత్ర, పౌరుషం గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది.  ఈ రోజు కేవలం ఒక ఎయిర్ పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు. మన నమో  వికసిత్ భారత్, మన సీబీఎన్విజన్ కలిసిన రోజు. ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో దూసుకెళ్లే రోజు. ఈనేలపై స్వాతంత్య్రం కోసం పోరాడింది అల్లూరి సీతారామ రాజు  అయితే ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు ఇచ్చింది మన నమో. రైతుల త్యాగం, కార్మిక కష్టం, మన సీబీఎన్ విజన్‌కు ప్రతిరూపం ఈ విమానాశ్రయం. అల్లూరి సీతా రామరాజుకి ఉన్న పట్టుదల, పౌరుషం, దేశ భక్తి నాకు మన నమోలో కనిపిస్తుంది. నమో అంటే ధైర్యం, నమో అంటే విశ్వాసం, నమో అంటే సురక్షిత భారత్. నమో అంటే శత్రువు గుండెల్లో భయం, అభివృద్ధి, పేదల సంక్షేమం, భవిష్యత్తుకు భ‌రోసా కోరుకునే వారికి ఒకే ఒక సమాధానం నమో. 

డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే అభివృద్ధి..!

రాష్ట్ర విభజన వల్ల మనం కట్టు బట్టలతో ప్రయాణం ప్రారంభించాం. అలాంటి రాష్ట్రాన్ని ఆదుకుంది మన ప్రధాని. దేశం మొత్తం నమో అంటే  ప్రధాని నరేంద్ర మోదీ. ఏపీలో నమో అంటే నాయుడు జీ - మోదీజీ జోడి. ఆ ఇద్దరి కలయికే డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మన రాష్ట్రం లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్ ను రికార్డ్ టైమ్ లో పూర్తి చేసారు. ఆంధ్ర ప్రదేశ్ జీవనాడి పోలవరం, అమరావతి పూర్తి చెయ్యడానికి నిధులు ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసారు. ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి విశాఖ ఉక్కుని కాపాడారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. గూగుల్ డేటా సెంటర్, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్, AMCA ఫైటర్ జెట్ ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రావడానికి కారణం మన నమో.

ఆ నమ్మకమే భోగాపురాన్ని ప్ర‌పంచ‌ప‌టంలో పెట్టింది..!

మోదీజీ విజన్ – నాయుడుజీ ఎగ్జిక్యూషన్ – ఇద్దరి ఏకైక లక్ష్యం వికసిత్ ఉత్తరాంధ్ర. మోదీ భారత్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. నాయుడు  ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. వారిద్దరిపై ఇక్కడి ప్రజల నమ్మకమే భోగాపురాన్ని ప్ర‌పంచ‌ప‌టంలో పెట్టింది. ఎన్డీఏకి కంచు కోట ఉత్తరాంధ్ర. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్ డిఎకి క్లీన్ స్వీప్ ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి మా బాధ్యత. నదులు, అడవులు, వనరులు, తీరప్రాంతం ఉత్తరాంధ్రకు వరం. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రను అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చింది. 

జన్మభూమి రుణం తీర్చుకున్న జిఎంఆర్..!

రాజాం నుండి పారిశ్రామికవేత్తగా ఎదిగిన వ్యక్తి గ్రంధి మల్లికార్జున‌రావు. రికార్డ్ టైమ్ లో ఎయిర్ పోర్ట్ నిర్మించి జన్మ భూమి రుణం తీర్చుకున్నారు. శ్రీకాకుళం ముద్దు బిడ్డ నా తమ్ముడు కేంద్ర మంత్రి రాముని కూడా అభినందిస్తున్నాను. 5నెలల ముందే ఎయిర్ పోర్ట్ పూర్తిచేసాడు. అల్లూరి సీతా రామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకి వరం. ఇది ఉద్యోగ, ఉపాధి కేంద్రంగా మారబోతుంది. ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ హబ్ కాబోతుంది. పరిశ్రమలు, ఐటీ, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలకు ఈ విమానాశ్రయం వారధి కాబోతుంది. రోడ్డు, రైలు, విమాన, వాటర్ కనెక్టివిటీతో ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ కి గ్రోత్ ఇంజన్ గా  నిలుస్తుంది.

ఉత్తరాంధ్ర అంటే వలసలు ఒకప్పుడు...ఇప్పుడు భవిష్యత్తు..!

`ఒక్కప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు, వెనకబాటుతనం, చిన్నచూపు. ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఉద్యోగాలు, ఉపాధి, బంగారు భవిష్యత్తు. ఇప్పుడు ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాల కోసం విమానాలు ఎక్కాల్సిన అవసరం లేదు. అవకాశాలే విమానం ఎక్కి ఉత్తరాంధ్రకి వస్తాయి. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అయింది. ఈ రెండేళ్లలో మన నమో రాష్ట్రానికి 5సార్లు వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ అన్నా, ఇక్కడ ప్రజలు అన్నా ఆయనకు ఎంతో ప్రేమ. రాష్ట్రం కోసం మ‌నం అడిగిన‌వ‌న్నీ ఆయ‌న ఇచ్చారు. 

గుజరాత్‌లో ఒకే ప్రభుత్వం దీర్ఘకాలంగా కొనసాగుతోంది కాబట్టే అభివృద్ది చెందింది. ఆంధ్ర ప్రదేశ్ కూడా అభివృద్ది కావాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యం. సంక్షేమం - అభివృద్ది ప్రజా ప్రభుత్వానికి జోడెద్దుల బండి. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ కాలం కాదు… ఇది ఈస్ట్ కోస్ట్ ఇండియా యుగం. ఇప్పుడు ఈస్ట్ కోస్ట్‌ ఇండియా ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. సుందర్‌బన్ నుంచి శ్రీహరికోట వరకు, ఎన్డీఏ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాకెట్‌లాగా దూసుకుపోతూ అభివృద్ధి సాధిస్తోంది. ఇది నమో (నరేంద్ర మోదీ) శక్తి` అని మంత్రి లోకేష్ ప్ర‌శంసించారు. 

Alluri Sitarama Raju International Airport, Nara lokesh, Andhra Pradesh Aviation, Bhogapuram Airport, Prime Minister Narendra Modi, CM Chandrababu, Deputy CM Pawan Kalyan, Alluri Sitarama Raju International Airport, AP Development Projects

By
en-us Political News

  
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులే ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని సీఎం చంద్రబాబు అన్నారు.
దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తీపి కబురు అందించాయి.
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి మహత్తర అడుగు పడింది.
పెళ్లైన నెలలకే షాక్..ఆస్ట్రేలియా ఉద్యోగం పేరుతో ఘరానా మోసం..!
స్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు..!
భారతదేశపు మొట్టమొదటి ఆర్‌ఈఐటీ ఇండెక్స్ ఫండ్ ఆగస్టు 2026లో లాంచ్ కానుంది. ఎడెల్‌వీస్ నిఫ్టీ REITs & రియాల్టీ ఇండెక్స్ ఫండ్ NFO వివరాలు, రాబడుల విశ్లేషణ మరియు పన్ను ప్రయోజనాల గురించి క్లియర్‌గా తెలుసుకోండి.
ఆగస్టు 1న దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24K, 22K, 18K బంగారం నేటి రేట్లు, మార్కెట్ విశ్లేషణల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
పెరిగిపోతున్న ఓటీటీ, క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీల నుండి విముక్తి పొందేందుకు హోమ్ సర్వర్లు ఎలా సహాయపడతాయో తెలుసుకోండి. పాత పీసీలతో సొంతంగా డిజిటల్ క్లౌడ్ క్రియేట్ చేసుకుని నెలకు వేల రూపాయలు ఆదా చేసే సులభమైన గైడ్.
మానవ DNAలో దాగి ఉన్న రహస్య గోస్ట్ లినేజ్ ఆనవాళ్ళను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 8 లక్షల సంవత్సరాల నాటి ఈ అజ్ఞాత మానవ జాతి డిఎన్ఏ మన శరీరంలోకి ఎలా వచ్చింది? పరిశోధనలో తేలిన సంచలన గణాంకాలు మరియు నిజాలు ఇవే!
ప్రముఖ సౌండ్ ఇంజనీర్ కుర్ట్ మార్టినెజ్ తన ఇంటి వెనుక ఉన్న 2.5m x 3.5m గార్డెన్ షెడ్‌ను ప్రపంచ స్థాయి డాల్బీ ఆట్మాస్ మ్యూజిక్ స్టూడియోగా ఎలా మార్చారో, అందులో వాడిన స్పీకర్లు, అకౌస్టిక్ టెక్నాలజీ మరియు ఆశ్చర్యపరిచే నిజాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్నా కొణిదెల తన పుట్టినరోజు సందర్భంగా సమాజానికి స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు.
మీరు ఎలక్ట్రిక్ వాహనం ఉపయోగిస్తున్నారా? సాధారణ మోటార్ ఇన్సూరెన్స్ మీ EV బ్యాటరీ మరియు ఛార్జింగ్ కిట్‌లకు రక్షణ ఇవ్వదు. EV షీల్డ్, ఆన్ డ్యామేజ్ ప్రీమియం, మరియు జీరో డిప్రిసియేషన్ గురించి తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.