Publish Date:Dec 30, 2024
గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా జరుగుతున్న చర్చ ఏదైనా ఉందంటే అది పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు, మధ్యంతర బెయిలు, తెలంగాణ ముఖ్యమంత్రితో సినీ ప్రముఖుల చర్చ అంశాలపైనే. కాగా ఈ అంశంపై తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఎలాంటి భేషజాలకూ పోకుండా ఈ సంఘటనపై ఆయన స్పందన చాలా ముక్కుసూటిగా ఉంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటకు సంబంధించి ఆయన ఎవరినీ బాధ్యులను చేయలేదు. అదే సమయంలో ఎవరికీ మద్దతుగా మాట్లాడలేదు. కానీ స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా ఈ విషయంలో అల్లు అర్జున్ తీరును ఆయన తప్పుపట్టారు. సరిగా స్పందించడంలో విఫలమై అల్లు అర్జున్ గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ మరణించడం, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. ఈ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొన్న పవన్ కల్యాణ్.. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ ఆ కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని తప్పుపట్టారు. అల్లు అర్జున్ లేదా ఆయన ప్రతినిథులు ఎవరో ఒకరు వెళ్లి బాధిత కుటుంబాన్ని ఓదార్చి ఉండాల్సిందన్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును పవన్ కల్యాణ్ మెచ్చుకున్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ ధరలు వంటివి పరిశ్రమను ప్రోత్సహించడానికి దోహదపడతాయేమో కానీ.. అలా ప్రోత్సహించడం కోసం శాతి భద్రతల విషయంలో రాజీ పడటం సరైనది కాదనీ, అందుకే రేవంత్ వ్యవహరించిన తీరు నిష్పాక్షికంగా ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని రేవంత్ చాటారనీ, హీరోలైనంత మాత్రాన వారేం పైనుంచి దిగి రాలేదని రేవంత్ నిరూపించారని చెప్పారు.
చిరంజీవి కూడా అభిమానులతో కలిసి సినిమా ప్రదర్శనలు చూసేవారనీ, అయితే ఆయన చాలా సాదా సీదాగా, ఎవరి కంటా పడకుండా థియేటర్ కు వెళ్లేవారని వివరించిన పవన్ కల్యాణ్.. అల్లు అర్జున్ ఆర్భాటంగా సంధ్యా థియేటర్ కు రోడ్ షో చేస్తూ వెళ్లడమే తొక్కిసలాటకు కారణంగా కనిపిస్తోందన్నారు. సంఘటన జరిగిన తరువాత అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు సమస్యను పెద్దది చేసిందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపుపై చంద్రబాబు సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందన్న చర్చ ఒక్క సారిగా జోరందుకుంది. అలాగే నిర్మాత దిల్ రాజు ఆహ్వానం మేరకు ఆయన గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెడతారా అన్న చర్చ కూడా మొదలైంది. ఒక సమయంలో ఆయన బెనిఫిట్ షోలు, టికెట్ల ధర పెంపు వంటివి సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు దోహదపడతాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీ కూడదని అనడంతో కొన్ని షరతులతో ఏపీ సర్కార్ సంక్రాంతి సినిమాల బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alluarjun-attitude-made-things-critical-25-190547.html
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.