Publish Date:Oct 29, 2024
నందమూరి బాల కృష్ణ తాను హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో ద్వారా అల్లు అర్జున్ నంద్యాల పర్యటన రేపిన రచ్చకు ఫుల్ స్టాప్ పేట్టేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షో ద్వారా బాలకృష్ణ ఇప్పటికే మూడు సీజన్ లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు. ఇప్పుడు నాలుగో సీజన్ గత సీజన్లకు మించి అన్నట్లుగా సాగుతోంది. ప్రతి శుక్రవారం ఆహా లో ప్రసారమౌతున్న ఈ అన్ స్టాపబుల్ షో సీజన్ ఫోర్ తొలి ఎపిసోడ్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ షో అంచనాలకు మించి విజయవంతమైంది.
ఇప్పుడు నాలుగో సీజన్ తరువాతి ఎపిసోడ్లకు గెస్ట్ లుగా ఎవరు వస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ షోలో పుష్ప 2 మూవీ ప్రమోషన్లలో భాగంగా అల్లు అర్జున్ పాల్గొననున్నారు. డిసెంబర్ 5న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అంతకు ముంది అన్ స్టాపబుల్ విత్ బాలయ్య షోలో అల్లు అర్జున్ సందడి చేయనున్నారు. ఇటీవలే అన్ స్టాపబుల్ ఫోలో అల్లు అర్జున్ తో ఎపిసోడ్ కు సంబంధించిన షూట్ కూడా జరిగింది.
దీంతో ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ కచ్చితంగా అల్లు అర్జున్ నంద్యాల పర్యటనపై ముప్పిరిగొన్న వివాదంపై ప్రశ్నలు సంధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ఆ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న శిల్పా రవిచంద్రకిషోర్ కు ఓటు వేయాలని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. ఒక వైపు పవన్ కల్యాణ్ వైసీపీకి వ్యతిరేకంగా కూటమి తరఫున బరిలో ఉన్నారు. అటువంటి సమయంలో వైసీపీ అభ్యర్థిగా మద్దతుగా అల్లు అర్జున్ మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య రిలేషన్స్ బాగా లేవా అన్న ప్రచారం కూడా జరిగింది. అది ఇప్పటికీ అలాగే ఉంది. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో ద్వారా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇటు అల్లు అర్జున్ కూడా తాను నంద్యాల ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో, తన ఉద్దేశమేంటో అల్లు అర్జున్ క్లారిటీ చెప్పే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ ప్రసారం తరువాత అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదానికి ఫుల్ స్టాప్ పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు బన్నీ అభిమానులు, ఇటు మెగా అభిమానులూ కూడా భావిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-as-guest-in-balayya-unstopable-show-25-187621.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.