Publish Date:May 29, 2025
పుష్ప పార్ట్ వన్ ద్వారా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం మాములు విషయం కాదు. ఒక పాత్రను దర్శక రచయితలు మలచడం ఒక ఎత్తు అయితే దాన్ని చేయడం మరొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ దర్శక రచయితలదా? లేక ఆ కేరెక్టర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవరి సమర్ధత ఎంతెంత? ఎవరికి ఈ ఘనతను ఇవ్వాల్సి ఉంటుందని చూస్తే.. ఒక రకంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కారణం.. పాత్రలు అన్నింటా ఉంటాయి. అందరకూ క్రియేట్ చేయగలరు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్రజలను అలరించడం.. ఒక రకమైన మేనరిజమ్స్ తో ఆకట్టుకోవడం.. ఇవన్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి.
పుష్ప 2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివరీ కూడా సరిగా ఉండదు. నోట్లు తంబాకు పెట్టుకుని నత్తి నత్తిగా డైలాగ్ చెప్పడం అన్నది ఇందులో కనిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మరింత కష్టతరం చేశారు దర్శక రచయితలు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోషణ మరింత కఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న నటుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్కడ మరో సబ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మగ్లర్ కేరెక్టర్స్ కి, గద్దర్ లాంటి ప్రజా వాగ్గేయకారుడు, విప్లవకారుడి పేరిట ఇవ్వడమేంటి? ఇక్కడసబ్జెక్ట్ గద్దర్ కీ ఆ పాత్రకీ ఉన్న పోలిక కాదు. అంతటి కష్టతరమైన పాత్రను ఒక నటుడిగా అతడెలా చేశాడు? అన్నదే కీలకం. దీంతో ఈ దృష్టికోణంలో మనం అలా చూడాల్సి ఉంటుందని చెప్పాలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-39-198939.html
ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు నేటి సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం నేపథ్యంలో భారత సాయుధ దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమన్ని నిర్వహిస్తోంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీని మళ్లీ విజయవాడ జిల్లా జైలుకు చేరుకున్నారు. ఆనారోగ్యం కారణంగా ఇటీవల వంశీకి కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసి మెరుగైన వైద్య చికిత్స అందించాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కేబినెట్ సమావేశం జూన్ 5 మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో నిర్వహించానున్నారు.
ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 నిందితుడి విచారణ చేయడానికి సిట్ కి దారులు బార్లా తెరుచుకున్నాయి. ఇప్పటి వరకూ అంటే గత 14 నెలలుగా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు వ్యవహారం, ఎన్నో మలుపుల మీద మలుపులు తిరిగి, ఆయన ఎట్టకేలకు హైదరాబాద్ వచ్చే వరకూ సాగింది.
ఐపీఎల్ 2025 ముగింపు దశకు వచ్చింది. మంగళవారం (జూన్ 3) సాయంత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ తో ఐపీఎల్ విజేత ఎవరన్నది తేలిపోతుంది.
కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కమల్ హాసన్ తన సినిమా థగ్ లైఫ్ జూన్ 05 న కర్ణాటకలో విడుదల కావడానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన అట్లూరి మౌనిక మిస్ అండ్ మిసెస్ తెలుగు యూఎస్ఏ అందాల పోటీల్లో ద్వితీయ స్థానం కైవశం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం హైరేంజ్లో ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి 40వేల ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది.
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో హత్యకు గురైన వ్యక్తిని పరామర్శించని జగన్ రౌడీ షీటర్లకు మద్దతిస్తున్నారని దళిత, ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో హీరో నాగార్జున భేటీ అయ్యారు. ఈ ఇరువురి భేటీ ఇరు రాష్ట్రాలలోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబునాయుడిని హీరో నాగార్జున మంగళవారం (జూన్ 3) కలిశారు.
రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య తన కూతురు చనిపోయినప్పటి నుంచి ఇలా మారిపోయారా? అంటే అవుననే తెలుస్తోంది. మొన్న రాబిన్ హుడ్ సినిమా ఫంక్షన్లో డేవిడ్ వార్నర్ ని దొ*గ ము*కొడుకు అంటూ కామెంట్ చేసి ట్రోల్ అయ్యారు.
క్రికెట్ అభిమానుల్లో.. ఐపీఎల్ పైనల్ ఉత్కంఠ పెంచుతోంది. ఈసారి కప్ కొట్టేది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరా.. పంజాబ్ కింగ్సా? అనేది మోస్ట్ ఇంట్రస్టింగ్గా మారింది. ఐపీఎల్ మొదలై 18 ఏళ్లు అవుతున్నా.. ఈ రెండు టీమ్లూ ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. కాబట్టి.. ఏ టీమ్ గెలిచినా.. కొత్త చరిత్ర సృష్టిస్తుంది.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ అధినేత జగన్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఇష్టారీతిగా ఆరోపణలు చేయడం కాదు.. వాటికి తగిన ఆధారాలు కూడా చూపించాలని చెబుతూనే.. జగన్ చేసిన ఆరోపణలకు ఒక్క ఆధారం చూపినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.