Publish Date:May 29, 2025
పుష్ప పార్ట్ వన్ ద్వారా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం మాములు విషయం కాదు. ఒక పాత్రను దర్శక రచయితలు మలచడం ఒక ఎత్తు అయితే దాన్ని చేయడం మరొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ దర్శక రచయితలదా? లేక ఆ కేరెక్టర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవరి సమర్ధత ఎంతెంత? ఎవరికి ఈ ఘనతను ఇవ్వాల్సి ఉంటుందని చూస్తే.. ఒక రకంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కారణం.. పాత్రలు అన్నింటా ఉంటాయి. అందరకూ క్రియేట్ చేయగలరు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్రజలను అలరించడం.. ఒక రకమైన మేనరిజమ్స్ తో ఆకట్టుకోవడం.. ఇవన్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి.
పుష్ప 2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివరీ కూడా సరిగా ఉండదు. నోట్లు తంబాకు పెట్టుకుని నత్తి నత్తిగా డైలాగ్ చెప్పడం అన్నది ఇందులో కనిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మరింత కష్టతరం చేశారు దర్శక రచయితలు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోషణ మరింత కఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న నటుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్కడ మరో సబ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మగ్లర్ కేరెక్టర్స్ కి, గద్దర్ లాంటి ప్రజా వాగ్గేయకారుడు, విప్లవకారుడి పేరిట ఇవ్వడమేంటి? ఇక్కడసబ్జెక్ట్ గద్దర్ కీ ఆ పాత్రకీ ఉన్న పోలిక కాదు. అంతటి కష్టతరమైన పాత్రను ఒక నటుడిగా అతడెలా చేశాడు? అన్నదే కీలకం. దీంతో ఈ దృష్టికోణంలో మనం అలా చూడాల్సి ఉంటుందని చెప్పాలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-39-198939.html
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు.
ఇప్పటి వరకూ మస్క్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా జరిగిన పరిణామ క్రమం వేరు. 2024 ఎన్నికల్లో సుమారు 30 కోట్ల డాలర్లు.. (ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మరీ రాజకీయాల్లోకి దిగిన మస్క్ కి జరిగిన శాస్తి ఏంటంటే.. ఆయన టెస్లా అమ్మకాలు భారీగా పడిపోవడం, షేర్ ధరలు యాభై శాతం డౌన్ కావడం, వంద బిలియన్ డాలర్ల మేర తన సంపద ఆవిరి కావడం.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు.
అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు ఈ నెల 19న ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పురందేశ్వరి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాజమహేంద్రవరం నగరం, గోదావరి పర్యాటక ప్రాంతాలకు కొత్త సొబగులు రానున్నాయి.