Publish Date:May 29, 2025
పుష్ప పార్ట్ వన్ ద్వారా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా.. పార్ట్ టూ ద్వారా.. స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం మాములు విషయం కాదు. ఒక పాత్రను దర్శక రచయితలు మలచడం ఒక ఎత్తు అయితే దాన్ని చేయడం మరొక ఎత్తుగా భావించాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ దర్శక రచయితలదా? లేక ఆ కేరెక్టర్ కి ప్రాణం పెట్టిన ఆర్టిస్టుదా? ఎవరి సమర్ధత ఎంతెంత? ఎవరికి ఈ ఘనతను ఇవ్వాల్సి ఉంటుందని చూస్తే.. ఒక రకంగా చెబితే ఆర్టిస్టుకే ఈ క్రెడిబిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది.కారణం.. పాత్రలు అన్నింటా ఉంటాయి. అందరకూ క్రియేట్ చేయగలరు. కానీ దాన్ని పాన్ ఇండియాలో ప్రేక్షక ప్రజలను అలరించడం.. ఒక రకమైన మేనరిజమ్స్ తో ఆకట్టుకోవడం.. ఇవన్నీ ఆర్టిస్టు చేతుల్లోనే ఉంటాయి.
పుష్ప 2 పాత్ర అయితే, ఏకంగా డైలాగ్ డెలివరీ కూడా సరిగా ఉండదు. నోట్లు తంబాకు పెట్టుకుని నత్తి నత్తిగా డైలాగ్ చెప్పడం అన్నది ఇందులో కనిపిస్తుంది. దీంతో .. ఈ పాత్రను మరింత కష్టతరం చేశారు దర్శక రచయితలు. దీంతో చెప్పేదేముందీ ఈ పాత్ర పోషణ మరింత కఠువుగా మారినా.. దాన్నికూడా ఒక ఛాలెంజింగా తీసుకున్న నటుడు అల్లు అర్జున్ దీన్ని భేష్ అనిపించాడు. ఇక్కడ మరో సబ్జెక్ట్ ఏంటంటే.. ఇలాంటి స్మగ్లర్ కేరెక్టర్స్ కి, గద్దర్ లాంటి ప్రజా వాగ్గేయకారుడు, విప్లవకారుడి పేరిట ఇవ్వడమేంటి? ఇక్కడసబ్జెక్ట్ గద్దర్ కీ ఆ పాత్రకీ ఉన్న పోలిక కాదు. అంతటి కష్టతరమైన పాత్రను ఒక నటుడిగా అతడెలా చేశాడు? అన్నదే కీలకం. దీంతో ఈ దృష్టికోణంలో మనం అలా చూడాల్సి ఉంటుందని చెప్పాలి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/allu-arjun-39-198939.html
ఏపీపీఎస్సీలో అవకతవకలు కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను బుధవారం (జూన్ 4) జైలు నుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసును సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ పాలనపై నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమరశంఖం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ రాక్షస పాలనపై ప్రజలలో చైతన్యం తీసుకు రావడంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రముఖ పాత్ర వహించిందని పేర్కొన్నారు.
మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నాన్నా పులి కథ, తెలుసు కదా.. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కథ కూడా అలాగే వుంది. అందుకే.. ఇప్పుడు నిజంగానే మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయినా, జనం నమ్మేలా లేరు. సరే.. జరిగితే అప్పుడు చూద్దాంలే అంటున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ,మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల కవిత.. సర్వం తానై నడిపిస్తున్న పొలిటికల్ డ్రామాలో ఇంతవరకు సైలెంట్ స్పేక్టేటర్ గా ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు, తొలి సారిగా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ టైం స్పందించారు.
తుని కేసు.. అప్పట్లో ఏపీలో ఓ సంచలనం. కాపు రిజర్వేషన్ల కోసం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన దీక్ష తీవ్ర వివాదస్పదమైంది. 2016లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కాపు రిజర్వేషన్ల పేరుతో ముద్రగడ పద్మనాభం తునిలో ఓ సభ నిర్వహించారు.
ఏటా జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్నిఈ ఏడాది ఎపిలో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్ లో యశ్వంత్ కుమార్ పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో భక్తులు తిరమలేశుని దర్శనానికి పోటెత్తుతున్నారు.
ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీ విజయంలో కృనాల్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీ ఫైనల్ లో 191 పరుగుల స్కోరు డిఫెండ్ చేసుకోవడమంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 18 ఏళ్ల నిరీక్షణ. 2008లో ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ఆర్సీబీ లో భాగమైన కోహ్లీ ఈ 18 ఏళ్లూ అదే జట్టు తరఫున ఆడాడు. ఆర్సీబీతో ఎమోషనల్ గా పెనవేసుకుపోయాడు.
ఆర్సీబీ విజయంతో క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ కరిగి కన్నీరయ్యాడు. ఉద్వేగానికి లోనయ్యాడు. 18 ఏళ్లుగా ఆర్సీబీ విజయం కోసం తన సర్వశక్తులూ ధారపోసిన కోహ్లీ అది సాధించిన అనంతరం ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకున్నాడు.