Publish Date:Sep 10, 2024
కూటమి బంధం సడలుతోందా? ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ, జనసేన శ్రేణుల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా రగులుతున్నాయా? అంటే పరిస్థితులను గమనిస్తే ఔననే సమాధానమే చెప్పాలి. అసలీ విభేదాలకు బీజం గత ఏడాది ఫిబ్రవరిలోనే పడిందని చెప్పాలి. గత ఏడాది ఫిబ్రవరి 17న చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా అనపర్తి వెడుతుండగా, అప్పటి సబ్ ఇన్ స్పెక్టర్ వాసు ఆధ్వర్యంలో పోలీసులు ఆయన పర్యటనను అడ్డుకున్నారు. అవరోధాలు కల్పించారు. వాహనాలను నిలిపివేశారు. దీంతో చంద్రబాబు చిమ్మ చీకట్లో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం నడిచి మరీ అనపర్తి చేరుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా రామచంద్రపురం ఎస్ఐగా వాసును కొనసాగించడం పట్ల అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాసును ఎస్ఐగా కొనసాగించే విషయంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయమేంటంటే.. అప్పట్లో నల్లమల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి తెలుగుదేశం ఇన్ చార్జిగా ఉన్నారు. ప్రస్తుత మంత్రి రామచంద్రపురం నియోజకవర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ వైసీపీలో ఉన్నారు. ఎన్నికల సమయంలో పొత్తులలో భాగంగా అనపర్తి నియోజకవర్గం బీజేపీకి కేటాయించడంతో చంద్రబాబు సూచన మేరకు నల్లమల్ల రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. వాసంశెట్టి సుభాష్ వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరి రామచంద్రాపురం నుంచి పోటీ చేసి విజయం సాధించి మంత్రి అయ్యారు.
ఇప్పుడు ఎస్ ఐ వాసును రామచంద్రాపురంలో కొనసాగించడంపై నల్లమల్లి, వాసంశెట్టి మధ్య విభేదాలకు కారణమైంది. రామచంద్రాపురం ఎస్ఐగా నాడు చంద్రబాబును అడ్డుకున్న వాసును కొనసాగించడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మంత్రి వాసంశెట్టి సుభాష్ కు పోన్ ద్వారా తెలియజేసినా ఫలితం లేకపోవడంతో నల్లమల్లి విషయాన్ని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లడానికి సిద్ధమౌతున్నారు. విశేషమేమిటంటే ఈ విషయంలో తెలుగుదేశం క్యాడర్ మొత్తం నల్లమల్లికి మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తం మీద ఒక ఎస్ఐ విషయంలో తెలుగుదేశం మంత్రి, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇటువంటి వాతావరణం తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/alliance--bond-is-loosening-in-combined-east-godavari-39-184580.html
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.