మూడూ ఒకటే.. జగన్ కు ఇక ఇక్కట్లే!

Publish Date:Mar 11, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్ కు ఇక్కట్లు తప్పవా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కలుస్తుందా? కలవదా? కలిస్తే అది తెలుగుదేశం, జనసేన కూటమికి ప్రయోజనమేనా?  బీజేపీపై ఏపీలో ఉన్న ఆగ్రహం కూటమిపై కూడా ప్రభావం చూపుతుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. పరిశీలకులు, కొన్ని సర్వేలు సైతం బీజేపీతో కలయిక తెలుగుదేశం పార్టీకి పెద్దగా లబ్ధి చేకూర్చే అవకాశాలు లేవనీ, ఏదో మేరకు నష్టం కూడా వాటిల్లే అవకాశాలున్నాయనీ పేర్కొన్నాయి. అయితే ఒక సారి తెలుగుదేశం, జనసేన కూటమితోనే ఏపీలో కలిసి వెళ్లాలని బీజేపీ నిర్ణయించుకున్న తరువాత జరిగిన పరిణామాలను గమనిస్తే, ఆ అనుమానాలన్నీ దూది పింజెల్లా తేలపోయాయి. 2019 ఎన్నికల తరువాత ఏపీ విషయంలో బీజేపీ తొలి సారిగా తన వాస్తవ బలం ఏమిటన్నది గుర్తించి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీలో పొత్తులో భాగంగా బీజేపీ ఎన్ని సీట్లు సాధించుకున్నా.. ఎన్ని స్థానాలలో పోటీ చేసినా.. ఆయా స్థానాలలో ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేనలే. ఎందుకంటే వాస్తవంగా చూసుకుంటే బీజేపీకి ఏపీలో ఒక్కటంటే ఒక్క శాతం ఓటు స్టేక్ కూడా లేదు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే.. ఆ పార్టీకి బలమైన అభ్యర్థులూ లేరు. పోటీ చేసే స్థానాలలో బూతు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి.

అయితే కేంద్రంలో అధికారంలో ఉండటం, మరో సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్న అంచనాలు బలంగా ఉండటంతో.. రాష్ట్ర ప్రయోజనాలను, కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సహకారాన్నీ దృష్టిలో ఉంచుకుని తెలుగుదేశం, జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు రెడీ అయ్యింది. ఆ పార్టీ పొత్తు విషయంలో నిర్ణయం తీసుకునే వరకూ వేచి చూసింది. ఒక సారి బీజేపీ కూడా తమ కూటమితో కలిసి వస్తుందన్న నిర్ణయం జరిగిపోగానే.. తెలుగుదేశం, జనసేన అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్లి రాష్ట్రంలో పరిస్థితిని, కూటమి గెలుపు అవకాశాలనూ ఆ పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూలంకషంగా వివరించారు. గత ఐదేళ్లుగా ఏపీలో బీజేపీలోని ఒక వర్గం వ్యవహరించిన తీరు కారణంగా బీజేపీ రాష్ట్రంలోని అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన ప్రజలలో బలంగా ఉందని సోదాహరణగా వివరించారు.

ఆ కారణంగా ప్రజలలో బలంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అంతే బలంగా బీజేపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆ పార్టీ అగ్రనేతలకు అర్ధమయ్యేలా వివరించగలిగారు. ఆ కారణంగానే బీజేపీ పెద్దలు ఏపీతో పొత్తుల విషయంలో తెలుగుదేశం, జనసేన కూటముల అభిప్రాయాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పొత్తు కారణంగానే కనీసం ఒక్కశాతం ఓటు కూడా లేని కమలం పార్టీకి ఏవో కొన్న అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు దక్కనున్నాయన్న సంగతి బీజేపీ పెద్దలకు స్పష్టంగా తెలుసు. అలా కాకుండా అధికార పార్టీతోనే  అంటకాగుతున్నామన్న భావన కలిగేలా కూటమితో కలవకపోయినా, అధిక స్థానాలు డిమాండ్ చేసి పొత్తు పొసగకపోవడానికి కారణమైనా ఏపీలో కనీస ప్రాతినిథ్యం కూడా ఉండే అవకాశం లేదని బీజేపీ అగ్రనాయకత్వానికి స్పష్టంగా తెలుసు. ఆ విషయాన్ని పరిగణనలోనికి తీసుకునే పొత్తు విషయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు కొందరు చేసిన అతి ప్రకటనలను పూర్తిగా పక్కన పెట్టేయడమే కాకుండా, పొత్తులో భాగంగా తమకు వచ్చిన స్థానాలలో కూడా తెలుగుదేశం, జనసేనలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే నిలపడానికి కూడా బీజేపీ అగ్రనాయకత్వం అంగీకరించడమే ఆ పార్టీ వాస్తవిక పరిస్థితులను గ్రహించే పొత్తుకు ముందుకు వచ్చిందన్న సంగతి స్పష్టంగా అవగతమౌతుంది. 

ఎందుకంటే ఇంత కాలం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న అధికార వైసీపీపై కాకుండా ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా విపక్ష తెలుగుదేశంపై పోరాడిందన్న భావన ప్రజలలో బలంగా ఉంది. అలా ఉండటానికి కారణం బీజేపీ ఏపీ నాయకులలో కొందరు చేసిన అతే కారణమనడంలో సందేహం లేదు. అదే విధంగా ఏపీ సర్కార్ ఆర్థిక అరాచకత్వాన్ని కేంద్రంలోని మోడీ సర్కార్ చూసీ చూడనట్లు వదిలేసిందన్న భావన కూడా ప్రజలలో ఉంది. జగన్ సర్పంచ్ లకు తెలియకుండానే పంచాయతీరాజ్ నిధులను డ్రా చేసుకుని ఇతర అవసరాలకు వాడేయడం వంటి వ్యవహారాలను కేంద్రం సీరియస్ గా తీసుకోకపోవడంతో జనంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ జగన్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలుస్తోందన్న భావన ఏర్పడింది. 

ఏపీ విషయంలో నాన్ సీరియస్ గా వ్యవహరించడం వల్ల జరిగిన నష్టాన్ని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఇప్పుడు పొరపాట్లను సవరించుకుని, రాష్ట్ర పార్టీలో వైసీపీ అనుకూల శక్తుల పట్ల సీరియస్ గా దృష్టి పెట్టింది. అందుకే ఏపీ బీజేపీలోని వైసీపీ అనుకూల నేతలకు పోటీ చేసే అవకాశం ఇవ్వవద్దన్న తెలుగుదేశం, జనసేన కూటమి షరతుకు అంగీకరించింది.  ఈ నేపథ్యంలోనే పార్టీలో వైసీపీ అనుకూల నేతలుగా ముద్రపడిన సోము వీర్రాజు, జీవీఎల్ సహా ఎవరికీ వచ్చే ఎన్నికలలో పోటీకి అవకాశం ఉండదని బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు స్పష్టం చేసినట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అంతే కాదు తొలి నుంచీ హిందూపురం లోక్ సభ స్థానం నుంచి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డిని కూడా పక్కన పెట్టేసినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  ఏపీ నుంచి బీజేపీ అభ్యర్ధులుగా రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడిన వారికి మాత్రమే కమలం పార్టీ టికెట్లు ఇచ్చేందుకు నిర్ణయించిందని అంటున్నారు.  బీజేపీ అభ్యర్థులుగా తాము ఎవరికి టికెట్ ఇచ్చినా వారు గెలవాల్సింది మాత్రం తెలుగుదేశం, జనసేన ఓట్లతోనే అన్న వాస్తవాన్ని గుర్తెరిగిన కమలనాథులు.. ఆ రెండు పార్టీలకూ ఆమోదయోగ్యమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.  

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.