అఖిలంతో పార్టీలలో కలకలం

Publish Date:Oct 31, 2013

Advertisement

 

తెలుగుదేశం పార్టీలో పయ్యావుల కేశవ్ రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషనుతో, అవసరమయితే చంద్రబాబుని ఒప్పించయినా సరే తెలంగాణాపై పార్టీ ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకొని సమైక్యాంధ్ర కోసం పోరాడుతామని చెప్పిన మాటలతో, పార్టీలో ఆంధ్ర-తెలంగాణా నేతల మధ్య ఇప్పటికే చిన్నపాటి యుద్ధం మొదలయింది.

 

ఇప్పుడు హోం మంత్రి షిండే దీపావళి సందర్భంగా అఖిలపక్షం బాంబు పేల్చడం కేవలం తమ పార్టీలో విద్వంసం సృష్టించడానికేనని ఆ పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే మొదటి నుండి అఖిలపక్షం కోసం గట్టిగా డిమాండ్ చేసింది కూడా తమ పార్టీయే కావడంతో, ఇప్పడు దానిపై గట్టిగా మాట్లాడేందుకు తెదేపా నేతలు తడబడుతున్నారు. తెరాస,టీ-కాంగ్రెస్ నేతలు దీనిపట్ల తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.

 

బీజేపీ ఇదీ ఒకందుకు తమ మంచికే జరుగుతోందని భావిస్తోంది. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు దీనిని వ్యతిరేఖిస్తుండగా మొదటి నుండి రాష్ట్ర విభజన సమర్దిస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాత్రం దీనిని స్వాగతించారు. అయితే ఈసారి అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలవాలని ఆయన డిమాండ్ చేసారు.

 

బహుశః ఆయన కాంగ్రెస్ మనసులోమాటే పలికినట్లుంది. అలా చేస్తే మొట్ట మొదట ఇబ్బంది పడేది తెదేపాయేనని కాంగ్రెస్ కి తెలియకపోదు. అందువల్ల ఈసారి ఒక్కరినే రమ్మని ఆహ్వానించవచ్చును. అయితే తెదేపా కూడా కాంగ్రెస్ జిమ్మికులన్నిటినీ ఔపోసన పట్టిన పార్టీయే గనుక, ఒకవేళ అఖిలపక్షానికి ఒక్కరినే ఆహ్వానిస్తే, ఏదో కారణంతో బాయ్ కాట్ చేసి గండం గట్టె క్కేప్రయత్నం చేయవచ్చును. అయితే సమస్యకు ఇది సరయిన, శాశ్విత పరిష్కారం కాదని ఆ పార్టీకి తెలియకపోదు. అయితే ఇంతకంటే వేరే మార్గం కూడా లేదు.

 

ఇక సమైక్యాంధ్ర ఉద్యమ గురుతర భాద్యతలని తన భుజస్కందాలకెత్తుకొన్న జగన్మోహన్ రెడ్డి, ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చేయడానికి వీలులేదని, కేంద్రమంత్రుల బృందం సూచనలేవీ తమకు ఆమోదయోగ్యం కావని గట్టిగా వాదించి, తన సమైక్య చాంపియన్ బిరుదుని కాపాడుకొనే ప్రయత్నం చేయవచ్చును.

By
en-us Political News

  
పంచ్ డైలాగుల నుంచి పలాయనం దాకా వైసీపీ తిరోమన ప్రస్ధానం చేరుకుందా అంటే కడప జిల్లా రాజకీయాలలో జరుగుతున్న లేదా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వస్తోంది. పులివెందుల పులి, సింహం సింగిల్ ఎంట్రీ వంటి డైలాగుల నుంచి తమపై ఎవరూ ఆరోపణలూ విమర్శలూ చేయకూడదంటూ కడప కోర్టు నుంచి తెచ్చుకునే వరకూ వైసీపీ వచ్చింది.
ఏపీకి మాజీ కాబోతున్న ముఖ్యమంత్రి జగన్ ఆమధ్య మార్గదర్శి సంస్థ మీద పగబట్టి,
బీఆర్ఎస్ గాలి తీసేయడానికి ఆ పార్టీ నేతలే పోటీ పడుతున్న విచిత్ర పరిస్థితి ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపోతుండటం, కుమారుడి బావమరిది సైతం కారు దిగి చేయి అందుకోవడంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ కు ఇఫ్పుడు పార్టీలో ఉన్న అగ్రనేతలు కూడా తమ వ్యాఖ్యలతో పార్టీ ప్రతిష్టను, పార్టీ అధినేత ప్రతిష్టను దిగజారుస్తున్నారు.
తెలంగాణకు భానుడి భుగభగల నుంచి ఉపశమనం లభించింది. నిన్నటి వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన తెలంగాణ వాసులు శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఈ నెలలో భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల మస్క్ ఆ పర్యటనను వాయిదా వేసుకున్నారు.
ఒక వైపు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తూ మాట్లాడకూడదంటూ కడప కోర్టు గాగ్ ఆర్డర్ ఇచ్చింది. మరో వైపు కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన అవినాష్ రెడ్డి తన అఫడివిట్ లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి తనపై రెండు క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శనివారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలకు పైగా సమయం పడుతోంది.
అంతా భ్రాంతియేనా అని పాడుకోవడమే మిగిలింది ఇప్పుడు మాజీ ఐటీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు.
రాజకీయ ప్రత్యర్థులపై తిట్ల దండకంతో విరుచుకుపడే వైసీపీ నేత‌ల్లో వ‌ల్ల‌భ‌నేని వంశీ ఒక‌రు. 2 014, 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం అభ్య‌ర్థిగా విజ‌యం సాధించిన వంశీ.. ఆ త‌రువాత అధికార వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతూ జ‌గ‌న్ శిబిరంలో చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో అగ్రగామిగా నిలవాలంటే చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రజలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. నిజమే రాష్ట్ర విభజన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలూ శ్రమించి.. రాష్ట్రాన్ని ప్రగతి బాటలోకి తీసుకువచ్చిన చంద్రబాబు 2019 ఎన్నికలలో పరాజయం పాలై అధికారానికి దూరమయ్యారు.
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌, గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.