మూడు పార్టీలు.. ఒకటే ముచ్చట

Publish Date:May 31, 2025

Advertisement

బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత కుటుంబ కలహాలు బజారు పడ్డాయి. పతాక స్థాయికి చేరాయి. మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అన్నట్లు, పార్టీ, కుటుంబ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రోజు రోజుకు మరింతగా ముదిరి పాకాన పడుతున్నాయి. రాజకీయాలను రక్తి కట్టిస్తునాయి.  అయితే, అంతర్గత కుమ్ములాటలు ఒక్క బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితమా అంటే కాదు..  అన్ని పార్టీలలో ఉన్నదే.. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీలలోనూ అదే పరిస్థితి వుంది.  మూడు పార్టీలలో ఒకటే ముచ్చట నడుస్తోంది. చిన్న గీత పెద్ద గీత అంతే, అదొక్కటే తేడా, మిగిలినదంతా సేమ్  టూ సేమ్. 

అవును..  అన్ని పార్టీలలో, ప్రధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో, కేంద్రంలో అధికారంలోఉన్న బీజేపీలోనూ ధిక్కార స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. పార్టీ విధానాలను చిన్నా పెద్ద నాయకులు ప్రశ్నిస్తున్నారు. గీత దాటుతున్నారు. నేతలను నిలదీస్తునారు. అంతే కాదు.. ఇదొక అంటూ వ్యాధిలా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి, ఒక నాయకుడి నుంచి మరో నాయకుడికి   పాకుతోందని, రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

రాజకీయ పార్టీలలో అంతర్గత కుమ్ములాటలకు పదవీ కాంక్ష ఒక ప్రధాన కారణం అయితే..  రాజకీయ పార్టీలలో ప్రజాస్వామ్య పరిధి, పరిమితి రోజురోజుకు కుచించుకు పోవడం మరో ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పదవీ కాంక్ష పై కొచ్చినప్పుడు బంధాలు, బాంధవ్యాలు కూడా కొట్టుకు పోతున్నాయని అంటున్నారు. నిజానికి, ఈ రోజు బీఆర్ఎస్ లో  జరుగుతున్న పరిణామాలను గమనిస్తే,  ఇది ఫక్తు పదహారణాల కుటుంబ కలహాల చిత్రం లా సాగుతోందని అంటున్నారు. అన్నా, చెల్లి మధ్య కుర్చీలాటగా మొదలైన వివాదం మెల్లమెల్లగా కుటుంబ పరిధిని, పార్టీ పరిధిని దాటి ఇప్పుడు రాష్ట్ర సమస్యగా మారింది. ఒక చోటి నుంచి ఒక చోటికి పాకుతూ.. పక్క దారులు పట్టి పోతోంది.  రాష్ట్ర హద్దులు దాటి  జాతీయ మీడియాలోనూ చర్చకు వస్తున్నా పెద్దాయన కేసీఆర్  పెదవి విప్పక పోవడం చిత్రంగా ఉందని అంటున్నారు. నిజానికి.. ఆయన తలచుకుంటే, సమస్య ఇంత వరకు వచ్చేది కాదని, అయినా ఆయన మౌనంగా ఉండడమే కాకుండా, మధ్య వర్తిత్వం జరిపేందుకు ముందుకు వచ్చిన కుటుంబ, పార్టీ పెద్దలకు కూడా పర్మిషన్ ఇవ్వ లేదని అంటున్నారు. మరోవంక కవిత, కేసీఆర్ ను కలిసే  అవకాశం వచ్చినా కలవలేక పోయానని,అంటున్నారు. 

మరోవంక బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత చేసిన కామెంట్ బీజేపీలో చిచ్చు పెట్టింది. అంతో ఇంతో ఇంకా క్రమశిక్షణ బతికున్న పార్టీగా భావించే బీజేపీలోనూ కవిత కామెంట్ నిప్పు పెట్టింది. ఫైర్ బ్రాండ్ ఎమ్మల్యేగా ముద్ర వేసుకున్న గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్  కవిత కామెంట్ ను ఎండార్స్ చేశారు. ఆమె చెప్పింది సత్యమని సర్టిఫికేట్ ఇచ్చారు.  అంతే కాదు.. రాష్ట్ర అపార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని బహిరంగంగా విమర్శించారు. సరైన రేటు ఇస్తే, ప్లేటు మార్చేందుకు తమ పార్టీ నాయకులు ఎప్పుడూ సిద్దంగా ఉంటారని అన్నారు. ఆయన ఒకరనే కాదు..  కవిత ఇష్యూలో వేలు పెట్టవద్దని అధిష్టానం ఆదేశించినా..  బీజేపీ నాయకులు ఎవరికి  వారుగానే సొంత అభిప్రాయాలు, విశ్లేషణలు వినిపిస్తున్నారు. కవిత విషయంలోనే కాదు.. అంతర్గత కుమ్ములాటల కారణంగానే పార్టీ  అధ్యక్ష ఎన్నిక ఒక అంతులేని కథల సాగుతోంది. 

ఇక కాంగ్రెస్ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ముందు అసమ్మతి పుట్టి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ పుట్టింది అంటే అందులో తప్పులేదు. అదేమంటే,  మా పార్టీలో  అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువ అంటారు. అందుకే.. పార్టీ ఎమ్మెల్సీ సభలోనే  ప్రభుత్వ విధానాలను విమర్శిస్తారు. ఎమ్మెల్యేలు, నాయకులు పదవుల కోసం గాంధీ భవన్  మెట్ల మీదనే ధర్నా చేస్తారు. అంతవరకు ఎందుకు.. అంతర్గత కుమ్ములాటల కారణం గానే ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయినా ఇంతవరకు పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడ లేదు. కనీసం పీసీసీ  ఏర్పాటుకు కూడా మీన మేషాలు లెక్క పెట్టవలసి వస్తోంది.  సో. అంతర్గత కుమ్ములాటల విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట ..అంతర్గత ప్రజాస్వామ్యం లేక పోవడమే ఈ పరిస్థితికి కారణమని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
ప్ర‌పంచ దేశాలను ఏపీ చూడ‌డం కాదు.. ఏపీని ప్ర‌పంచ దేశాలు చూసేలా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మాట అన్నది ఎవరో కాదు ప్రధాని నరేంద్రమోడీ.
కేసీఆర్ మెడకు ఫోన్ వైర్ మెల్లగా చుట్టుకుంటోంది. పోన్ ట్యాపింగ్ బాధితులలో మొత్తం 615 మందిలో.. రకరకాల రంగాల వారున్నారు. వీరిలో రాజకీయ నాయకులు, మీడియా అధినేతలు, సినీ, వ్యాపార ప్రముఖులు, కొందరు పౌర హక్కుల నేతలు వంటి వారున్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు. ఈయన తన నోరు మెదపక పోయినా.. ఇప్పటికే సిట్ పూర్తి ఆధారాలు సేకరించినట్టు సమాచారం.
శనివారం జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. ఎప్పుడో వందల వేల సంవత్సరాల క్రితం మన దేశంలో పుట్టిన యోగ విద్యను ఈ రోజు ప్రపంచం మొత్తం సొంతం చేసుకుంది. 2014 లో మన దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్ 14న ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సభ, భారతీయ యోగ విద్యను గుర్తించి, ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ యోగ దినోత్సవాన్ని నిర్వహించాలనే చారిత్రక నిర్ణయం తీసుకుంది.
ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి రైతులకు బిగ్ రిలీఫ్ కలిగించింది. జగన్ హయాంలో వారిపై పెట్టిన కేసులను ఎత్తివేసింది.జగన్ హయాంలో అమరావతిని నిర్వీర్యం చేస్తూ మొదలు పెట్టిన మూడు రాజధానుల విధానానికి వ్తయతికేకంగా చారిత్రాత్మక ఆందోళన చేసిన రైతులపై అప్పటి జగన్ సర్కార్ బనాయించిన కేసులను ఉపసంహరించుకుంది.
హనుమ కొండ జిల్లా కోర్టు ఆవరణలో డిటొనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి హనుమకొండ జిల్లా కోర్టు ఆవరణలో బాంబు ఉందన్న ఫోన్ కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో కోర్టు ఆవరణ అంతా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చినట్లు.. అన్న, చెల్లిల మధ్య పోరు వారి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని ఇక్కట్ల పాలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ సీఎం జగన్, ఏపీసీసీ ప్రెసిడెంట్ షర్మిల మధ్య ఇరుక్కుపోతున్న వైవీ సుబ్బారెడ్డి ఎటూ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారంట.
వైసీపీ సీనియర్ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మరో మారు ఆస్పత్రిపాలయ్యారు. గురువారం (జూన్ 19) రాత్రి ఆయన అస్వస్థతకు గురి కావడంతో విజయవాడ జిల్లా జైలు నుంచి జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సాధారణంగా మనం బైక్ తీసుకుని బయలుదేరినప్పుడు ఒక్కోసారి పెట్రోల్ ట్యాంక్ స్విచ్ ఆన్ చేయడం మర్చిపోతుంటాం. అయినా బండి స్టార్ట్ అవుతుంది, ఓ ఫర్లాంగు దూరం నడుస్తుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. సరిగ్గా అహ్మదాబాద్ లో టేకాఫ్ అయిన క్షణాలలోనే కుప్పకూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం విషయంలో ఇలాంటిదే జరిగివుంటుందని కొందరు నిపుణులు విశ్లేసిస్తున్నారు.
ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా రగిలిపోతోంది. అగ్రరాజ్యం అమెరికా రణ రంగంలోకి దిగనుందనే సంకేతాలు ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఇజ్రాయెల్ తరఫున అమెరికా గనక వార్ జోన్‌లోకి ఎంటరైతే పరిస్థితులు ఎలా మారబోతున్నాయన్నది ఉత్కంఠ రేపుతోంది.
ఇటీవలి కాలంలో విమాన ప్రయాణమంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. అహ్మదాబాద్ లో విమానం కుప్పకూలిన ఘటనలో వందలాది మంది మరణించిన ఘటన మరువక ముందే పలు విమానాలలో సాంకేతిక లోపాల వార్తలు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి.
తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్లీ నెయ్యి వినియోగం కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి నెయ్యిని సరఫరా చేసినది బోలేబాబా డెయిరీ అనీ, ఈ డెయిరీ సరఫరా చేసినది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే రసాయినాల మిశ్రమమనీ సిట్ నిర్ధారణకు వచ్చింది.
ఆస్తిని పిల్లలకు పంచి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన ఉదంతమింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.